ETV Bharat / sports

వికెట్ల మధ్య ఫాస్టెస్ట్‌ అండ్​ వరస్ట్‌ రన్నర్‌ ఎవరు?.. కోహ్లీ ఆన్సర్​ ఇదే

author img

By

Published : Mar 22, 2023, 7:18 PM IST

Updated : Mar 22, 2023, 7:31 PM IST

మైదానంలో వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తే బ్యాటర్‌ ఎవరు..? నెమ్మదిగా ఎవరు పరుగెడుతారు?.. ఈ రెండు ప్రశ్నలకు విరాట్‌ కోహ్లీ తనదైన స్టైల్​లో సమాధానమిచ్చాడు. ఇంతకీ ఏమన్నాడంటే?

kohli Picks fastest Runner Between Wickets
వికెట్ల మధ్య ఫాస్టెస్ట్‌ అండ్​ వరస్ట్‌ రన్నర్‌ ఎవరు?.. కోహ్లీ ఆన్సర్​ ఇదే

టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్​, రన్ మెషీన్​ విరాట్​ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫీల్డ్​లో ఫుల్​ యాక్టివ్​గా ఉంటే ఈ ఇతడు ఫిట్​నెస్​కు ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు. అలాగే గ్రౌండ్​లో వికెట్ల మధ్య చిరుతలా పరిగెడుతూ పరుగుల వరద పారిస్తాడు. సింగిల్స్​ను డబుల్స్​గా ఈజీగా మలుస్తుంటాడు. అలా మైదానంలో వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీసే ఎంతో మంది దిగ్గజ ప్లేయర్స్​తో పిచ్​ను కూడా షేర్​ చేసుకున్నాడు. అయితే తాజాగా విరాట్​కు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. 'వేగంగా సింగిల్స్‌' ఎవరు తీస్తారు..? అనే విషయంపై రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు మాజీ ప్లేయర్​ ఏబీ డివిలియర్స్‌-కోహ్లీ మధ్య చర్చ జరిగింది. దీనికి విరాట్‌ చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఆ పేరు ఏంటో తెలుసా? ధోనీ కాదు. ఏబీడీ.

"ఈ ప్రశ్న నాకు గతంలోనూ ఎదురైంది. వికెట్ల మధ్య నాతో అత్యంత వేగంగా పరుగెత్తే ప్లేయర్​ ఏబీ డివిలియర్స్‌. అయితే అతడితో పాటు వికెట్ల మధ్య ఎంతో సహకారాన్ని అందించే మరో ప్లేయర్​ మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ. వారిద్దరు ఎంత వేగంగా పరుగెత్తుతారో అస్సలు నాకు తెలియదు. కానీ.. వారిద్దరితో కలిసి ఆడితే.. రన్​ కోసం వారిని పిలవాల్సిన అవసరమే నాకు ఉండదు" అని విరాట్ చెప్పుకొచ్చాడు. ఇక ఇదే ప్రశ్నను ఏబీడీని అడగగా.. అతడు మాత్రం డుప్లెసిస్‌ పేరు పేర్కొన్నాడు.

ఇక విరాట్​కు మరో ప్రశ్న కూడా ఎదురైంది. 'వికెట్ల మధ్య అత్యంత స్లోగా పరుగెత్తే బ్యాటర్‌ ఎవరు..?' అని అడగగా... దానికి తనదైన స్టైల్​లో బదులిచ్చాడు. ఇది కాంట్రవర్సీ ప్రశ్న అని అంటూనే పుజారా పేరును సరదాగా నవ్వుతూ తెలిపాడు. 2018లో సెంచూరియన్‌ టెస్టును గుర్తుచేసుకుంటూ.. రెండు ఇన్నింగ్స్‌లో పుజారా రనౌట్‌ అయ్యాడని.. అప్పుడు అతడు పరుగెత్తిన విధానాన్ని వివరించాడు. కాగా, ప్రస్తుతం విరాట్​ ఆస్ట్రేలియాతో మూడో వన్డే ఆడుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్​లో ఆచితూచి ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే మ్యాచ్​కు ముందుకు మరోసారి తనదైన స్టైల్​లో గ్రౌండ్​లో చిందులేసి ఫ్యాన్స్​ను ఆకట్టుకున్నాడు. తాజాగా చెపాక్‌ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో బౌండరీ రోప్‌ వద్ద 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమాలోని లుంగీ డ్యాన్స్‌ పాటకు చిందులు వేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఫుల్​ వైరల్​గా మారింది. దీనికి నెటిజన్లు తెగ లైక్స్​, కామెంట్స్​ పెడుతున్నారు.

pic.twitter.com/MOGlikuSFG

— javed ansari (@javedan00643948) March 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: నెం.1 ర్యాంకును కోల్పోయిన సిరాజ్​.. గ్రౌండ్​లోనే మండిపడ్డ రోహిత్, కోహ్లీ!

టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్​, రన్ మెషీన్​ విరాట్​ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫీల్డ్​లో ఫుల్​ యాక్టివ్​గా ఉంటే ఈ ఇతడు ఫిట్​నెస్​కు ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు. అలాగే గ్రౌండ్​లో వికెట్ల మధ్య చిరుతలా పరిగెడుతూ పరుగుల వరద పారిస్తాడు. సింగిల్స్​ను డబుల్స్​గా ఈజీగా మలుస్తుంటాడు. అలా మైదానంలో వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీసే ఎంతో మంది దిగ్గజ ప్లేయర్స్​తో పిచ్​ను కూడా షేర్​ చేసుకున్నాడు. అయితే తాజాగా విరాట్​కు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. 'వేగంగా సింగిల్స్‌' ఎవరు తీస్తారు..? అనే విషయంపై రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు మాజీ ప్లేయర్​ ఏబీ డివిలియర్స్‌-కోహ్లీ మధ్య చర్చ జరిగింది. దీనికి విరాట్‌ చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఆ పేరు ఏంటో తెలుసా? ధోనీ కాదు. ఏబీడీ.

"ఈ ప్రశ్న నాకు గతంలోనూ ఎదురైంది. వికెట్ల మధ్య నాతో అత్యంత వేగంగా పరుగెత్తే ప్లేయర్​ ఏబీ డివిలియర్స్‌. అయితే అతడితో పాటు వికెట్ల మధ్య ఎంతో సహకారాన్ని అందించే మరో ప్లేయర్​ మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ. వారిద్దరు ఎంత వేగంగా పరుగెత్తుతారో అస్సలు నాకు తెలియదు. కానీ.. వారిద్దరితో కలిసి ఆడితే.. రన్​ కోసం వారిని పిలవాల్సిన అవసరమే నాకు ఉండదు" అని విరాట్ చెప్పుకొచ్చాడు. ఇక ఇదే ప్రశ్నను ఏబీడీని అడగగా.. అతడు మాత్రం డుప్లెసిస్‌ పేరు పేర్కొన్నాడు.

ఇక విరాట్​కు మరో ప్రశ్న కూడా ఎదురైంది. 'వికెట్ల మధ్య అత్యంత స్లోగా పరుగెత్తే బ్యాటర్‌ ఎవరు..?' అని అడగగా... దానికి తనదైన స్టైల్​లో బదులిచ్చాడు. ఇది కాంట్రవర్సీ ప్రశ్న అని అంటూనే పుజారా పేరును సరదాగా నవ్వుతూ తెలిపాడు. 2018లో సెంచూరియన్‌ టెస్టును గుర్తుచేసుకుంటూ.. రెండు ఇన్నింగ్స్‌లో పుజారా రనౌట్‌ అయ్యాడని.. అప్పుడు అతడు పరుగెత్తిన విధానాన్ని వివరించాడు. కాగా, ప్రస్తుతం విరాట్​ ఆస్ట్రేలియాతో మూడో వన్డే ఆడుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్​లో ఆచితూచి ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే మ్యాచ్​కు ముందుకు మరోసారి తనదైన స్టైల్​లో గ్రౌండ్​లో చిందులేసి ఫ్యాన్స్​ను ఆకట్టుకున్నాడు. తాజాగా చెపాక్‌ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో బౌండరీ రోప్‌ వద్ద 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమాలోని లుంగీ డ్యాన్స్‌ పాటకు చిందులు వేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఫుల్​ వైరల్​గా మారింది. దీనికి నెటిజన్లు తెగ లైక్స్​, కామెంట్స్​ పెడుతున్నారు.

ఇదీ చూడండి: నెం.1 ర్యాంకును కోల్పోయిన సిరాజ్​.. గ్రౌండ్​లోనే మండిపడ్డ రోహిత్, కోహ్లీ!

Last Updated : Mar 22, 2023, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.