ETV Bharat / sports

IPL 2023 RR VS CSK : ధోనీ అసహనం.. ఈ సీజన్​లో తొలిసారి లెక్క తప్పింది!

author img

By

Published : Apr 27, 2023, 10:06 PM IST

Updated : Apr 27, 2023, 10:18 PM IST

ఐపీఎల్‌ 16వ సీజన్‌ రాజస్థాన్​ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మహీ అసహనానికి గురయ్యాడు. ఆ వివరాలు..

Rajasthan Royals vs Chennai Super Kings 37th Match
IPL 2023 RR VS CSK : ధోనీ అసహనం.. ఈ సీజన్​లో తొలిసారి ఇలా..

సాధారణంగా మ్యాచ్​ ఆడేటప్పుడు ధోనీ ఎంత ప్రశాంతంగా ఉంటాడో అందరికే తెలిసిందే. అందుకే అతడిని మిస్టర్​ కూల్ అని కూడా అంటుంటారు. కానీ తాజాగా అతడు రాజస్థాన్​ రాయల్స్​తో జరిగే మ్యాచ్​లో కాస్త అసహనానికి గురయ్యాడు. సాధారణంగా మ్యాచ్​లో మహీ రివ్యూ తీసుకున్నాడంటే చాలా సందర్భాల్లో ఫలితం అనుకూలంగానే వస్తుంది. మాస్టర్‌మైండ్‌తో ఆలోచించే మహీ రివ్యూ విషయంలో ఎంతో ఫర్‌ఫెక్ట్‌గా ఉంటాడు. కానీ ఐపీఎల్‌ 16వ సీజన్‌లో తొలిసారి అతడి లెక్క తప్పినట్టుంది. రాజస్థాన్​ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మహీ.. యశస్వి జైశ్వాల్‌​ విషయంలో రివ్యూకు వెళ్లగా.. అంపైర్​ మహీకి అనకూలమైన తీర్పు ఇవ్వలేదు.

తీక్షణ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌ మూడో బంతిని.. జైశ్వాల్‌ స్వీప్‌ ఆడే ప్రయత్నం చేసి బాల్​ను మిస్‌ చేశాడు. ఈ క్రమంలోనే బాల్​ అతడి ప్యాడ్లను తాకి కీపర్‌ ధోనీ చేతుల్లోకి వెళ్లింది. అప్పుడు అంపైర్‌కు అప్పీల్‌ చేయగా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మహీ డీఆర్‌ఎస్‌ కోరాడు. అయితే డీఆర్​ఎస్​లో.. అల్ట్రాఎడ్జ్‌లో బంతి ప్యాడ్లను తాకినప్పటికీ లెగ్‌స్టంప్‌ ఔట్‌సైడ్‌లో బంతి పిచ్‌ అయినట్లు చూపించింది. దీంతో జైశ్వాల్‌ నాటౌట్‌ అని తేలింది. సీఎస్కే ఒక రివ్యూను కోల్పోయింది. అయితే అప్పటికే జైశ్వాల్‌ ధాటిగా ఆడడంతో.. ఓ దశలో తమ బౌలర్లపై ధోనీ అసహనం కూడా వ్యక్తం చేశాడు.

DRS Means Dhoni Review System Bro 🔥..#CSKvRR pic.twitter.com/ezLnZ3UQYY

— ஒத்த கை உலககோப்பை (@ok_uk_) April 27, 2023 ">

ధోనీ మరోసారి.. ఇకపోతే ఈ మ్యాచ్​లో సీఎస్కే కెప్టెన్​ ధోనీ మరోసారి కూడా అసహనం వ్యక్తం చేశాడు. రాజస్థాన్​ ఇన్నింగ్స్‌ 16వ ఓవర్​లో పతీరానా బౌలింగ్​ వేశాడు. అయితే ఆ ఓవర్​లో బంతి బ్యాటింగ్ చేస్తున్న హెట్​మెయర్ కాలికి తగిలి ధోని వైపు వెళ్లింది. అంపైర్‌ లెగ్‌బై ఇవ్వగా హెట్‌మెయర్​ పరుగుకు ప్రయత్నించాడు. బాల్​ను అందుకున్న మహీ నేరుగా నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌వైపు డైరెక్ట్‌ త్రో వేశాడు. కానీ పతీరానా బాల్​ను అందుకునే ప్రయత్నంలో త్రోకు కాస్త అడ్డు వచ్చాడు. అయితే అప్పటికీ హెట్‌మెయర్​ క్రీజులోకి చేరుకోలేదు. ఒకవేళ మహీ వేసిన త్రో వికెట్లకు తాకుంటే హెట్‌మెయర్​ రనౌట్‌ అయ్యేవాడే. రనౌట్‌ ఛాన్స్​ మిస్​ అవ్వడంతో ధోని.. పతీరానాను చూస్తూ అసహనం వ్యక్తం చేసినట్లు కనిపించాడు. అయితే హెట్‌మెయర్​.. 16 ఓవర్​ రెండో బంతికే ఔటయ్యాడు. 8 పరుగులు చేసిన అతడు తీక్షణ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా పెవిలియన్ చేరాడు. ఇకపోతే ఈ మ్యాచ్​లో ఫస్ట్ బ్యాటింగ్​ చేసిన రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు సాధించింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (77; 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్​లు) విరుచుకుపడ్డాడు.

ఇదీ చూడండి: రఫ్ఫాడిస్తున్న సీనియర్స్.. రికార్డ్స్​తో యంగ్ ప్లేయర్స్​కు సవాల్

సాధారణంగా మ్యాచ్​ ఆడేటప్పుడు ధోనీ ఎంత ప్రశాంతంగా ఉంటాడో అందరికే తెలిసిందే. అందుకే అతడిని మిస్టర్​ కూల్ అని కూడా అంటుంటారు. కానీ తాజాగా అతడు రాజస్థాన్​ రాయల్స్​తో జరిగే మ్యాచ్​లో కాస్త అసహనానికి గురయ్యాడు. సాధారణంగా మ్యాచ్​లో మహీ రివ్యూ తీసుకున్నాడంటే చాలా సందర్భాల్లో ఫలితం అనుకూలంగానే వస్తుంది. మాస్టర్‌మైండ్‌తో ఆలోచించే మహీ రివ్యూ విషయంలో ఎంతో ఫర్‌ఫెక్ట్‌గా ఉంటాడు. కానీ ఐపీఎల్‌ 16వ సీజన్‌లో తొలిసారి అతడి లెక్క తప్పినట్టుంది. రాజస్థాన్​ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మహీ.. యశస్వి జైశ్వాల్‌​ విషయంలో రివ్యూకు వెళ్లగా.. అంపైర్​ మహీకి అనకూలమైన తీర్పు ఇవ్వలేదు.

తీక్షణ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌ మూడో బంతిని.. జైశ్వాల్‌ స్వీప్‌ ఆడే ప్రయత్నం చేసి బాల్​ను మిస్‌ చేశాడు. ఈ క్రమంలోనే బాల్​ అతడి ప్యాడ్లను తాకి కీపర్‌ ధోనీ చేతుల్లోకి వెళ్లింది. అప్పుడు అంపైర్‌కు అప్పీల్‌ చేయగా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మహీ డీఆర్‌ఎస్‌ కోరాడు. అయితే డీఆర్​ఎస్​లో.. అల్ట్రాఎడ్జ్‌లో బంతి ప్యాడ్లను తాకినప్పటికీ లెగ్‌స్టంప్‌ ఔట్‌సైడ్‌లో బంతి పిచ్‌ అయినట్లు చూపించింది. దీంతో జైశ్వాల్‌ నాటౌట్‌ అని తేలింది. సీఎస్కే ఒక రివ్యూను కోల్పోయింది. అయితే అప్పటికే జైశ్వాల్‌ ధాటిగా ఆడడంతో.. ఓ దశలో తమ బౌలర్లపై ధోనీ అసహనం కూడా వ్యక్తం చేశాడు.

ధోనీ మరోసారి.. ఇకపోతే ఈ మ్యాచ్​లో సీఎస్కే కెప్టెన్​ ధోనీ మరోసారి కూడా అసహనం వ్యక్తం చేశాడు. రాజస్థాన్​ ఇన్నింగ్స్‌ 16వ ఓవర్​లో పతీరానా బౌలింగ్​ వేశాడు. అయితే ఆ ఓవర్​లో బంతి బ్యాటింగ్ చేస్తున్న హెట్​మెయర్ కాలికి తగిలి ధోని వైపు వెళ్లింది. అంపైర్‌ లెగ్‌బై ఇవ్వగా హెట్‌మెయర్​ పరుగుకు ప్రయత్నించాడు. బాల్​ను అందుకున్న మహీ నేరుగా నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌వైపు డైరెక్ట్‌ త్రో వేశాడు. కానీ పతీరానా బాల్​ను అందుకునే ప్రయత్నంలో త్రోకు కాస్త అడ్డు వచ్చాడు. అయితే అప్పటికీ హెట్‌మెయర్​ క్రీజులోకి చేరుకోలేదు. ఒకవేళ మహీ వేసిన త్రో వికెట్లకు తాకుంటే హెట్‌మెయర్​ రనౌట్‌ అయ్యేవాడే. రనౌట్‌ ఛాన్స్​ మిస్​ అవ్వడంతో ధోని.. పతీరానాను చూస్తూ అసహనం వ్యక్తం చేసినట్లు కనిపించాడు. అయితే హెట్‌మెయర్​.. 16 ఓవర్​ రెండో బంతికే ఔటయ్యాడు. 8 పరుగులు చేసిన అతడు తీక్షణ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా పెవిలియన్ చేరాడు. ఇకపోతే ఈ మ్యాచ్​లో ఫస్ట్ బ్యాటింగ్​ చేసిన రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు సాధించింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (77; 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్​లు) విరుచుకుపడ్డాడు.

ఇదీ చూడండి: రఫ్ఫాడిస్తున్న సీనియర్స్.. రికార్డ్స్​తో యంగ్ ప్లేయర్స్​కు సవాల్

Last Updated : Apr 27, 2023, 10:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.