ETV Bharat / sports

'అన్ని మ్యాచ్​ల్లో ఆడనందుకు బాధపడ్డా'

author img

By

Published : Nov 3, 2020, 12:35 PM IST

బెంగళూరుతో సోమవారం జరిగిన మ్యాచ్​లో అదరగొట్టింది దిల్లీ. ఆ జట్టును విజయ తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు సీనియర్ బ్యాట్స్​మన్ రహానే. కానీ ఇతడు దిల్లీ తరఫున ఈ సీజన్​లో ఆరు మ్యాచులే ఆడాడు​. దీనిపై స్పందిస్తూ.. అన్ని మ్యాచుల్లో ఈసారి తాను ఆడలేకపోయినందుకు నిరాశకు గురయ్యానని అన్నాడు.

IPL 2020: Was disappointed when I didn't get to play, says Rahane
అందుకు నేను చాలా బాధ పడ్డాను:రహానే

అబుదాబి వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘన విజయం సాధించింది దిల్లీ క్యాపిటల్స్. ఈ గెలుపుతో ప్లేఆఫ్స్​ స్థానాన్ని పదిలం చేసుకుంది. దిల్లీ విజయంలో రహానే(60) కీలక పాత్ర పోషించాడు. అయితే ఈసారి దిల్లీ తరఫున కేవలం ఆరు మ్యాచుల్లోనే ఆడాడు రహానే. దీనిపై స్పందిస్తూ ఈ సీజన్​లో అన్ని మ్యాచుల్లో ఆడలేకపోయినందుకు బాధపడ్డానని తెలిపాడు.

"ఈ సీజన్​లో అన్ని మ్యాచుల్లో ఆడలేకపోయినందుకు నిరాశకు గరయ్యా. కానీ, బెంగళూరుపై విజయం సాధించాక చాలా ఆనందం కలిగింది. ధావన్​తో కలిసి క్రీజు పంచుకోవడాన్ని ఆస్వాదించా. అతని బ్యాటింగ్​ స్టైల్​ నుంచి నేను చాలా నేర్చుకున్నా. నేను మూడో స్థానంలో ఆడుతున్నానని తెలిసినప్పుడు మంచి ఆవకాశం దొరికిందని అనుకున్నా. క్లిష్ట పరిస్థితుల్లో మనం భాగస్వాములయ్యాక ఆ మ్యాచ్​ గెలిస్తే రెట్టింపు ఆనందం కలగుతుంది."

- అజింక్యా రహానే, దిల్లీ ఆటగాడు

153 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన దిల్లీ జట్టు.. 19 ఓవర్లలో ఛేదించింది. రహానే (60), ధావన్ (54) అర్ధసెంచరీలతో చెలరేగి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించారు. అయితే నెట్ రన్​రేట్ బాగుండటం వల్ల గెలిచిన దిల్లీతో పాటు ఓడిన బెంగళూరు కూడా ప్లేఆఫ్స్​కు అర్హత సాధించింది.

ఇదీ చూడండి:'ప్లేఆఫ్స్ చేరడం సంతోషంగా ఉంది'

అబుదాబి వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘన విజయం సాధించింది దిల్లీ క్యాపిటల్స్. ఈ గెలుపుతో ప్లేఆఫ్స్​ స్థానాన్ని పదిలం చేసుకుంది. దిల్లీ విజయంలో రహానే(60) కీలక పాత్ర పోషించాడు. అయితే ఈసారి దిల్లీ తరఫున కేవలం ఆరు మ్యాచుల్లోనే ఆడాడు రహానే. దీనిపై స్పందిస్తూ ఈ సీజన్​లో అన్ని మ్యాచుల్లో ఆడలేకపోయినందుకు బాధపడ్డానని తెలిపాడు.

"ఈ సీజన్​లో అన్ని మ్యాచుల్లో ఆడలేకపోయినందుకు నిరాశకు గరయ్యా. కానీ, బెంగళూరుపై విజయం సాధించాక చాలా ఆనందం కలిగింది. ధావన్​తో కలిసి క్రీజు పంచుకోవడాన్ని ఆస్వాదించా. అతని బ్యాటింగ్​ స్టైల్​ నుంచి నేను చాలా నేర్చుకున్నా. నేను మూడో స్థానంలో ఆడుతున్నానని తెలిసినప్పుడు మంచి ఆవకాశం దొరికిందని అనుకున్నా. క్లిష్ట పరిస్థితుల్లో మనం భాగస్వాములయ్యాక ఆ మ్యాచ్​ గెలిస్తే రెట్టింపు ఆనందం కలగుతుంది."

- అజింక్యా రహానే, దిల్లీ ఆటగాడు

153 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన దిల్లీ జట్టు.. 19 ఓవర్లలో ఛేదించింది. రహానే (60), ధావన్ (54) అర్ధసెంచరీలతో చెలరేగి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించారు. అయితే నెట్ రన్​రేట్ బాగుండటం వల్ల గెలిచిన దిల్లీతో పాటు ఓడిన బెంగళూరు కూడా ప్లేఆఫ్స్​కు అర్హత సాధించింది.

ఇదీ చూడండి:'ప్లేఆఫ్స్ చేరడం సంతోషంగా ఉంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.