ETV Bharat / sports

మూడోసారి భారత్​-పాక్ ఢీ.. మ్యాచ్​కు రంగం సిద్ధం

author img

By

Published : Sep 27, 2022, 2:02 PM IST

ICC T20 World Cup 2022 : ఈ సంవత్సరం ముచ్చటగా మూడోసారి భారత్​-పాక్ పురుషుల జట్టు తలపడబోతున్నాయి. టీ20 వరల్డ్​కప్​లో భాగంగా ఈ మ్యాచ్​ మెల్​బోర్న్​లో జరగనుంది. ఇందుకోసం మైదానం పనులు జరుగుతున్నాయని మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్ ఫొటోలను షేర్ చేసింది. దీంతో ఈ మ్యాచ్​ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు అభిమానులు.

ICC T20 World Cup 2022
ICC T20 World Cup 2022

ICC T20 World Cup 2022 : మెగా టోర్నీకి రంగం సిద్ధమైంది. మైదానాలు పచ్చదనం పూసుకుంటున్నాయి. పిచ్​లు పదునెక్కుతున్నాయ్. స్టాండ్​లు ప్రేక్షకుల కోసం ఎదురుచూస్తున్నాయి. ఇలాంటి తరుణంలో చిలకాల ప్రత్యర్థులు ఎదురు పడితే.. అది దాయాదుల కురుక్షేత్రమే. మెల్​బోర్న్ వేదికగా అక్టోబర్ 23న అలాంటి యుద్ధమే జరగబోతోంది. టీ20 వరల్డ్​ కప్​లో ఇండియా, పాకిస్థాన్​ తలపడబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి మెల్​బోర్న్​ క్రికెట్ గ్రౌండ్ ట్విట్టర్​ హ్యాండిల్ ఓ పోస్ట్ చేసింది. అందులో గ్రౌండ్​లో వరల్డ్​ కప్​ కోసం గ్రౌండ్​లో పని జరుగుతున్న ఫొటోలు షేర్ చేసింది. దానికి " క్రికెట్​ లోడింగ్" అని క్యాప్షన్​ జత చేసింది.

Melbourne Cricket Ground
.

ఈ సంవత్సరం ఇదివరకే ఈ దేశాల మధ్య జరిగిన మూడు మ్యాచ్​లు చూసే అదృష్టం ప్రేక్షకులకు కలిగింది. పురుషుల మ్యాచ్​లు రెండు జరగ్గా.. మహిళలు ఒక మ్యాచ్​ ఆడారు. కామన్​వెల్త్​ గేమ్స్​లో భాగంగా మహిళల జట్టు జులై 31న పాకిస్థాన్​తో తలపడింది. ఈ మ్యాచ్​లో 18 ఓవర్లు అడిన పాకిస్థాన్​.. 99 పరుగులు చేసి ఆల్​ ఔట్​ అయ్యింది. 100 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్​.. 11.4 ఓవర్లలో సునాయాసంగా.. 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అలాగే కామన్​వెల్త్​లో సిల్వర్​ మెడల్​ సాధించింది.

Melbourne Cricket Ground
.
Melbourne Cricket Ground
.

ఇక ఆసియా కప్​ 2022లో ఆగస్టు 28న పురుషుల జట్టు పాకిస్థాన్​తో ఆడింది. అందులో 19.5 ఓవర్లలో 147 పరుగులకే పాక్​ను కట్టడి చేసింది. 148 పరుగుల టార్గెట్​ను ఛేదించి గెలిచింది టీమ్ ఇండియా. మళ్లీ సెప్టెంబర్​ 4న తలపడిన టీమ్ ఇండియా సూపర్ 4 ఫేజ్​లో ఓటమిపాలైంది. దీంతో ఆసియా కప్​ రేస్​ నుంచి వెనుదిరిగింది. అలాగే 2021లో కూడా పాకిస్థాన్​ చేతిలో ఓడిపోయింది. అప్పుడు సూపర్ 12 ఫేజ్​లో టోర్నమెంట్​ నుంచి బయటకు వచ్చింది.

అయితే ఈ ఓటములన్నిటిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఉంది టీమ్ ఇండియా. ఇటీవల ఆసియా కప్​ పరాభవాన్ని టీమ్ ఇండియా ఇంకా మరచిపోలేదు. అయితే అస్ట్రేలియాతో జరిగిన సిరీస్ మొదటి మ్యాచ్​లో భారత వైఫల్యాలు బయటపడ్డాయి. ఇలా అయితే వరల్డ్​ కప్​ నెగ్గడం కష్టమే అని విమర్శలు వచ్చాయి. కానీ మళ్లీ తేరుకున్న టీమ్ ఇండియా సిరీస్​ను 2-1 తో కైవసం చేసుకుంది. అయినా సమస్యలు టీమ్ ఇండియాను వెంటాడుతున్నాయి.

డెత్​ ఓవర్లలో బౌలింగ్ భయపెడుతోంది. ఇక వరల్డ్​ కప్​లో ఆశలన్నీ కేఎల్​ రాహుల్, రోహిత్​ శర్మ, హార్దిక్ పాండ్య, జస్​ప్రీత్​ బుమ్రా లాంటి వాళ్లపైనే ఉన్నాయి. అక్షర్​ ఆస్ట్రేలియా సరీస్​లో బాగానే రాణించినా.. వరల్డ్​ కప్​లో ఏం చేస్తాడనేది ఆసక్తిగా మారింది. గాయం నుంచి కోలుకున్న హర్షల్ పటేల్​.. ప్రదర్శన ఆస్ట్రేలియా సిరీస్​లో తేలిపోయింది.

సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్​లో భారత్ జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్(వికెట్ కీపర్​), దినేశ్​ కార్తిక్(వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ షమి, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్​ప్రీత్ బుమ్రా.. సౌత్ ఆఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్​కు ఎంపికయ్యారు.

ఇవీ చదవండి: సిరీస్ గెలిచాం సరే.. మరి ఆ సమస్యల సంగతేంటో!

ఇంగ్లాండ్​లో భారత మహిళా క్రికెటర్​కు చేదు అనుభవం.. ఆగంతకుడు రూమ్​లో దూరి..

ICC T20 World Cup 2022 : మెగా టోర్నీకి రంగం సిద్ధమైంది. మైదానాలు పచ్చదనం పూసుకుంటున్నాయి. పిచ్​లు పదునెక్కుతున్నాయ్. స్టాండ్​లు ప్రేక్షకుల కోసం ఎదురుచూస్తున్నాయి. ఇలాంటి తరుణంలో చిలకాల ప్రత్యర్థులు ఎదురు పడితే.. అది దాయాదుల కురుక్షేత్రమే. మెల్​బోర్న్ వేదికగా అక్టోబర్ 23న అలాంటి యుద్ధమే జరగబోతోంది. టీ20 వరల్డ్​ కప్​లో ఇండియా, పాకిస్థాన్​ తలపడబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి మెల్​బోర్న్​ క్రికెట్ గ్రౌండ్ ట్విట్టర్​ హ్యాండిల్ ఓ పోస్ట్ చేసింది. అందులో గ్రౌండ్​లో వరల్డ్​ కప్​ కోసం గ్రౌండ్​లో పని జరుగుతున్న ఫొటోలు షేర్ చేసింది. దానికి " క్రికెట్​ లోడింగ్" అని క్యాప్షన్​ జత చేసింది.

Melbourne Cricket Ground
.

ఈ సంవత్సరం ఇదివరకే ఈ దేశాల మధ్య జరిగిన మూడు మ్యాచ్​లు చూసే అదృష్టం ప్రేక్షకులకు కలిగింది. పురుషుల మ్యాచ్​లు రెండు జరగ్గా.. మహిళలు ఒక మ్యాచ్​ ఆడారు. కామన్​వెల్త్​ గేమ్స్​లో భాగంగా మహిళల జట్టు జులై 31న పాకిస్థాన్​తో తలపడింది. ఈ మ్యాచ్​లో 18 ఓవర్లు అడిన పాకిస్థాన్​.. 99 పరుగులు చేసి ఆల్​ ఔట్​ అయ్యింది. 100 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్​.. 11.4 ఓవర్లలో సునాయాసంగా.. 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అలాగే కామన్​వెల్త్​లో సిల్వర్​ మెడల్​ సాధించింది.

Melbourne Cricket Ground
.
Melbourne Cricket Ground
.

ఇక ఆసియా కప్​ 2022లో ఆగస్టు 28న పురుషుల జట్టు పాకిస్థాన్​తో ఆడింది. అందులో 19.5 ఓవర్లలో 147 పరుగులకే పాక్​ను కట్టడి చేసింది. 148 పరుగుల టార్గెట్​ను ఛేదించి గెలిచింది టీమ్ ఇండియా. మళ్లీ సెప్టెంబర్​ 4న తలపడిన టీమ్ ఇండియా సూపర్ 4 ఫేజ్​లో ఓటమిపాలైంది. దీంతో ఆసియా కప్​ రేస్​ నుంచి వెనుదిరిగింది. అలాగే 2021లో కూడా పాకిస్థాన్​ చేతిలో ఓడిపోయింది. అప్పుడు సూపర్ 12 ఫేజ్​లో టోర్నమెంట్​ నుంచి బయటకు వచ్చింది.

అయితే ఈ ఓటములన్నిటిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఉంది టీమ్ ఇండియా. ఇటీవల ఆసియా కప్​ పరాభవాన్ని టీమ్ ఇండియా ఇంకా మరచిపోలేదు. అయితే అస్ట్రేలియాతో జరిగిన సిరీస్ మొదటి మ్యాచ్​లో భారత వైఫల్యాలు బయటపడ్డాయి. ఇలా అయితే వరల్డ్​ కప్​ నెగ్గడం కష్టమే అని విమర్శలు వచ్చాయి. కానీ మళ్లీ తేరుకున్న టీమ్ ఇండియా సిరీస్​ను 2-1 తో కైవసం చేసుకుంది. అయినా సమస్యలు టీమ్ ఇండియాను వెంటాడుతున్నాయి.

డెత్​ ఓవర్లలో బౌలింగ్ భయపెడుతోంది. ఇక వరల్డ్​ కప్​లో ఆశలన్నీ కేఎల్​ రాహుల్, రోహిత్​ శర్మ, హార్దిక్ పాండ్య, జస్​ప్రీత్​ బుమ్రా లాంటి వాళ్లపైనే ఉన్నాయి. అక్షర్​ ఆస్ట్రేలియా సరీస్​లో బాగానే రాణించినా.. వరల్డ్​ కప్​లో ఏం చేస్తాడనేది ఆసక్తిగా మారింది. గాయం నుంచి కోలుకున్న హర్షల్ పటేల్​.. ప్రదర్శన ఆస్ట్రేలియా సిరీస్​లో తేలిపోయింది.

సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్​లో భారత్ జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్(వికెట్ కీపర్​), దినేశ్​ కార్తిక్(వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ షమి, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్​ప్రీత్ బుమ్రా.. సౌత్ ఆఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్​కు ఎంపికయ్యారు.

ఇవీ చదవండి: సిరీస్ గెలిచాం సరే.. మరి ఆ సమస్యల సంగతేంటో!

ఇంగ్లాండ్​లో భారత మహిళా క్రికెటర్​కు చేదు అనుభవం.. ఆగంతకుడు రూమ్​లో దూరి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.