ETV Bharat / sports

తొలిసారి అంతర్జాతీయ రిఫరీ ప్యానెల్​లో మహిళ

భారత మాజీ క్రికెటర్ జీ ఎస్ లక్ష్మీని అంతర్జాతీయ మ్యాచ్​ రిఫరీల ప్యానెల్​లో నియమించింది ఐసీసీ.  ఈ నిర్ణయంతో ఆమెకు అంతర్జాతీయ మ్యాచుల్లో రిఫరీగా పనిచేసే అవకాశం దక్కింది.

author img

By

Published : May 14, 2019, 6:08 PM IST

లక్ష్మీ

ఇటీవల పురుషుల వన్డేలో మహిళా అంపైర్​ (క్లేర్ పొలొసాక్​)ను మరువక ముందే మరోసారి మహిళకు కీలక పదవినిచ్చింది ఐసీసీ. తాజాగా​ అంతర్జాతీయ మ్యాచ్​ రిఫరీల ప్యానెల్​లో మాజీ క్రికెటర్ జీ ఎస్​ లక్ష్మీని నియమించింది. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డు సాధించింది లక్ష్మీ. ఈ నిర్ణయంతో ఆమెకు అంతర్జాతీయ మ్యాచుల్లో రిఫరీగా పనిచేసే అవకాశం దక్కింది.

"అంతర్జాతీయ రిఫరీ ప్యానెల్​లో అవకాశం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. భారత క్రికెటర్​గా, మ్యాచ్​ రిఫరీగా బాధ్యతలు నిర్వహించాను. నాకు దక్కిన ఈ గౌరవాన్ని నా అనుభవంతో సక్రమంగా నిర్వర్తించేందుకు కృషి చేస్తాను" - జీ ఎస్​ లక్ష్మీ, భారత మాజీ క్రికెటర్, రిఫరీ

51 ఏళ్ల​ లక్ష్మీ దేశవాళీ మహిళ క్రికెట్​లో 2008-09 సీజన్​కు రిఫరీగా సేవలందించింది. అంతేకాకుడా మూడు మహిళా వన్డేలు, టీ 20 మ్యాచు​ల్లో రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించింది. లక్ష్మీతో పాటు లోరెన్, కిమ్ కాటన్, శివాని మిశ్రా, సూయ్ రెడ్​ఫెర్న్, మేరీ వాల్డ్రన్​, జాక్వలిన్ విలియమ్స్​ తదితరులు ఈ ప్యానెల్​లో ఉన్నారు.

ఇవీ చదవండి: ప్రపంచ తొలి త్రీడీ చిత్రంలో 2 ముగింపులు
'ప్రపంచకప్​ పోరుకు అన్ని అస్త్రాలు సిద్ధం'

ఇటీవల పురుషుల వన్డేలో మహిళా అంపైర్​ (క్లేర్ పొలొసాక్​)ను మరువక ముందే మరోసారి మహిళకు కీలక పదవినిచ్చింది ఐసీసీ. తాజాగా​ అంతర్జాతీయ మ్యాచ్​ రిఫరీల ప్యానెల్​లో మాజీ క్రికెటర్ జీ ఎస్​ లక్ష్మీని నియమించింది. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డు సాధించింది లక్ష్మీ. ఈ నిర్ణయంతో ఆమెకు అంతర్జాతీయ మ్యాచుల్లో రిఫరీగా పనిచేసే అవకాశం దక్కింది.

"అంతర్జాతీయ రిఫరీ ప్యానెల్​లో అవకాశం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. భారత క్రికెటర్​గా, మ్యాచ్​ రిఫరీగా బాధ్యతలు నిర్వహించాను. నాకు దక్కిన ఈ గౌరవాన్ని నా అనుభవంతో సక్రమంగా నిర్వర్తించేందుకు కృషి చేస్తాను" - జీ ఎస్​ లక్ష్మీ, భారత మాజీ క్రికెటర్, రిఫరీ

51 ఏళ్ల​ లక్ష్మీ దేశవాళీ మహిళ క్రికెట్​లో 2008-09 సీజన్​కు రిఫరీగా సేవలందించింది. అంతేకాకుడా మూడు మహిళా వన్డేలు, టీ 20 మ్యాచు​ల్లో రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించింది. లక్ష్మీతో పాటు లోరెన్, కిమ్ కాటన్, శివాని మిశ్రా, సూయ్ రెడ్​ఫెర్న్, మేరీ వాల్డ్రన్​, జాక్వలిన్ విలియమ్స్​ తదితరులు ఈ ప్యానెల్​లో ఉన్నారు.

ఇవీ చదవండి: ప్రపంచ తొలి త్రీడీ చిత్రంలో 2 ముగింపులు
'ప్రపంచకప్​ పోరుకు అన్ని అస్త్రాలు సిద్ధం'

Ujjain (MP), May 14 (ANI): While addressing a public rally in Madhya Pradesh's Ujjain on Tuesday, Congress president Rahul Gandhi said, "I will show you clearly, look at these forms. Congress Party waived off farm loans of Shivraj Singh Chouhan's family members, but he is spreading lies to Madhya Pradesh that farm loans were not waived off." Earlier former Madhya Pradesh CM had claimed that Kamal Nath is lying over farmers' loan waiver.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.