ETV Bharat / sports

Cricket News:టీమ్​ఇండియాకు నిరాశ.. ఇంగ్లాండ్​దే వన్డే సిరీస్

author img

By

Published : Jul 1, 2021, 7:10 AM IST

టౌంటన్​ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత మహిళా జట్టు ఓడిపోయింది. దీంతో మరో మ్యాచ్​ ఉండగానే ఇంగ్లాండ్, సిరీస్​ను కైవసం చేసుకుంది.

England Women beat India Women in 2nd ODI
క్రికెట్ న్యూస్

ఇంగ్లాండ్​తో వన్డే సిరీస్​ ఆడుతున్న టీమ్​ఇండియా మహిళ జట్టు నిరాశపరిచింది. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్​లో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇప్పటికే తొలి మ్యాచ్​లో ఓటమిపాలైంది. దీంతో మరో మ్యాచ్​ మిగిలుండగానే ఆతిధ్య ఇంగ్లీష్​ జట్టు సిరీస్​ను సొంతం చేసుకుంది.

టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. భారత్​కు బ్యాటింగ్ అప్పగించింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లు ఆడిన మన మహిళా జట్టు 221 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మిథాలీరాజ్ (59), షెఫాలీ వర్మ(44) మినహా అందరూ విఫలమయ్యారు.

mithali raj
మిథాలీరాజ్

అనంతరం ఛేదనలో ఇంగ్లాండ్​లో ఆచితూచి ఆడింది. లక్ష్యాన్ని 47.3 ఓవర్లలో పూర్తిచేసి, విజయం సాధించింది. సోఫియా డంక్లీ 73 పరుగులు చేయగా, విన్​ఫీల్డ్ 42 పరుగులు చేసింది. ఐదు వికెట్లు తీసిన ఇంగ్లాండ్ బౌలర్ కేట్​ క్రాస్​.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచింది. చివరి వన్డే శనివారం జరగనుంది.

england team
ఇంగ్లాండ్ జట్టు

ఇవీ చదవండి:

ఇంగ్లాండ్​తో వన్డే సిరీస్​ ఆడుతున్న టీమ్​ఇండియా మహిళ జట్టు నిరాశపరిచింది. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్​లో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇప్పటికే తొలి మ్యాచ్​లో ఓటమిపాలైంది. దీంతో మరో మ్యాచ్​ మిగిలుండగానే ఆతిధ్య ఇంగ్లీష్​ జట్టు సిరీస్​ను సొంతం చేసుకుంది.

టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. భారత్​కు బ్యాటింగ్ అప్పగించింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లు ఆడిన మన మహిళా జట్టు 221 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మిథాలీరాజ్ (59), షెఫాలీ వర్మ(44) మినహా అందరూ విఫలమయ్యారు.

mithali raj
మిథాలీరాజ్

అనంతరం ఛేదనలో ఇంగ్లాండ్​లో ఆచితూచి ఆడింది. లక్ష్యాన్ని 47.3 ఓవర్లలో పూర్తిచేసి, విజయం సాధించింది. సోఫియా డంక్లీ 73 పరుగులు చేయగా, విన్​ఫీల్డ్ 42 పరుగులు చేసింది. ఐదు వికెట్లు తీసిన ఇంగ్లాండ్ బౌలర్ కేట్​ క్రాస్​.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచింది. చివరి వన్డే శనివారం జరగనుంది.

england team
ఇంగ్లాండ్ జట్టు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.