ETV Bharat / sports

మొతేరా జిమ్​లో కోహ్లీ కసరత్తులు.. పంత్​ విన్యాసాలు

మొతేరా వేదికగా ఇంగ్లాండ్​తో జరగనున్న మూడో టెస్టు కోసం టీమ్ఇండియా సన్నద్ధమవుతోంది. భారత ఆటగాళ్లు జిమ్​లో కసరత్తులు చేస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

author img

By

Published : Feb 20, 2021, 1:00 PM IST

Team India's workout session from Motera gym
మొతేరా జిమ్​లో కోహ్లీ కసరత్తులు.. పంత్​ విన్యాసాలు

అహ్మదాబాద్​ వేదికగా ఫిబ్రవరి 24 నుంచి ఇంగ్లాండ్​, భారత్​ మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టు కోసం టీమ్​ఇండియా ఆటగాళ్లు జిమ్​లో తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను 'స్థిరత్వం కీలకమైనది' అనే క్యాప్షన్​తో పంచుకున్నాడు సారథి విరాట్​ కోహ్లీ. మిగిలిన క్రికెటర్లు తమ తమ పిక్స్​ను సోషల్​మీడియాలో షేర్​ చేశారు.

జిమ్​లో సరదాగా..

టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ రిషభ్‌పంత్‌ మరోసారి స్పైడర్‌మ్యాన్‌గా వార్తల్లో నిలిచాడు. ఇంగ్లాండ్‌తో మూడో టెస్టుకు ముందు మొతేరా స్టేడియంలో ప్రాక్టీస్‌ చేస్తున్న సందర్భంగా అతడు స్పైడర్‌మ్యాన్‌లా మారిపోయాడు. మిగతా ఆటగాళ్లు జిమ్‌లో శారీరక కసరత్తులు చేస్తుంటే పంత్‌ నేలపై పాకుతూ వెళ్లాడు. అందుకు సంబంధించిన వీడియోను ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఆ వీడియోకు స్పైడర్‌ మ్యాన్‌ థీమ్‌సాంగ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌గా సెట్‌చేశారు.

అయితే, పంత్‌ ఇలా స్పైడర్‌మ్యాన్‌గా వార్తల్లోకెక్కడం ఇదేం తొలిసారి కాదు. గతనెల ఆస్ట్రేలియాతో తలపడిన బ్రిస్బేన్‌ టెస్టులోనూ నాలుగో రోజు మైదానంలోనే స్పైడర్‌మ్యాన్‌ హిందీ పాట పాడాడు. కీపింగ్‌ చేస్తున్నప్పుడు అతడు ఈ పాట అందుకోవడం వల్ల అది స్టంప్‌మైక్‌లో వినిపించింది. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పుడు మరోసారి పంత్‌ స్పైడర్‌మ్యాన్‌లా చేయడం గమనార్హం.

మరోవైపు హార్దిక్‌ పాండ్య మొతేరా స్టేడియంలో సెల్ఫీ తీసుకొని సంతోషం వ్యక్తం చేశాడు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంగా ఇటీవలే దీన్ని ఆధునిక వసతులతో అభివృద్ధి చేశారు. ఈ మైదానం ఎంతో చూడముచ్చటగా ఉందని పాండ్య పేర్కొన్నాడు. అలాగే జిమ్‌లో తీసుకున్న ఫొటోలు కూడా అభిమానులతో పంచుకున్నాడు.

ఇదీ చూడండి: వైరల్​: 'మాస్టర్​' పాటకు స్టెప్పులేసిన భారత క్రికెటర్లు​

అహ్మదాబాద్​ వేదికగా ఫిబ్రవరి 24 నుంచి ఇంగ్లాండ్​, భారత్​ మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టు కోసం టీమ్​ఇండియా ఆటగాళ్లు జిమ్​లో తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను 'స్థిరత్వం కీలకమైనది' అనే క్యాప్షన్​తో పంచుకున్నాడు సారథి విరాట్​ కోహ్లీ. మిగిలిన క్రికెటర్లు తమ తమ పిక్స్​ను సోషల్​మీడియాలో షేర్​ చేశారు.

జిమ్​లో సరదాగా..

టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ రిషభ్‌పంత్‌ మరోసారి స్పైడర్‌మ్యాన్‌గా వార్తల్లో నిలిచాడు. ఇంగ్లాండ్‌తో మూడో టెస్టుకు ముందు మొతేరా స్టేడియంలో ప్రాక్టీస్‌ చేస్తున్న సందర్భంగా అతడు స్పైడర్‌మ్యాన్‌లా మారిపోయాడు. మిగతా ఆటగాళ్లు జిమ్‌లో శారీరక కసరత్తులు చేస్తుంటే పంత్‌ నేలపై పాకుతూ వెళ్లాడు. అందుకు సంబంధించిన వీడియోను ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఆ వీడియోకు స్పైడర్‌ మ్యాన్‌ థీమ్‌సాంగ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌గా సెట్‌చేశారు.

అయితే, పంత్‌ ఇలా స్పైడర్‌మ్యాన్‌గా వార్తల్లోకెక్కడం ఇదేం తొలిసారి కాదు. గతనెల ఆస్ట్రేలియాతో తలపడిన బ్రిస్బేన్‌ టెస్టులోనూ నాలుగో రోజు మైదానంలోనే స్పైడర్‌మ్యాన్‌ హిందీ పాట పాడాడు. కీపింగ్‌ చేస్తున్నప్పుడు అతడు ఈ పాట అందుకోవడం వల్ల అది స్టంప్‌మైక్‌లో వినిపించింది. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పుడు మరోసారి పంత్‌ స్పైడర్‌మ్యాన్‌లా చేయడం గమనార్హం.

మరోవైపు హార్దిక్‌ పాండ్య మొతేరా స్టేడియంలో సెల్ఫీ తీసుకొని సంతోషం వ్యక్తం చేశాడు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంగా ఇటీవలే దీన్ని ఆధునిక వసతులతో అభివృద్ధి చేశారు. ఈ మైదానం ఎంతో చూడముచ్చటగా ఉందని పాండ్య పేర్కొన్నాడు. అలాగే జిమ్‌లో తీసుకున్న ఫొటోలు కూడా అభిమానులతో పంచుకున్నాడు.

ఇదీ చూడండి: వైరల్​: 'మాస్టర్​' పాటకు స్టెప్పులేసిన భారత క్రికెటర్లు​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.