ETV Bharat / sports

మూడో టీ20: సిరీస్​పై పట్టు సాధించేదెవరు?

author img

By

Published : Mar 15, 2021, 8:01 PM IST

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా భారత్​-ఇంగ్లాండ్​ మధ్య మంగళవారం మూడో టీ20 జరగనుంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్​ల్లో చెరొకటి గెలిచి సిరీస్​ సమం చేయగా.. మూడో టీ20లో గెలుపొంది సిరీస్​ ఆధిక్యంలో కొనసాగాలని ఇరుజట్లు సన్నద్ధమవుతున్నాయి.

Confident India look to build on new approach against England in 3rd T20I
భారత్​ Vs ఇంగ్లాండ్​: ఆధిక్యంలోకి వెళ్లేదెవరు?

రెండో టీ20లో అద్భుతమైన విజయం సొంతం చేసుకున్న కోహ్లీసేన.. మూడో టీ20లోనూ సత్తాచాటి సిరీస్​పై పట్టు సాధించాలని ఊవిళ్లూరుతోంది. కెప్టెన్​ కోహ్లీతో పాటు యువ ఆటగాళ్లూ రాణిస్తున్న వేళ టీమ్​ఇండియా శిబిరంలో సరికొత్త జోష్​ కనపడుతోంది. ఇదే ఉత్సాహంతో మూడో టీ20లోనూ విజయం సాధించాలని.. భారత జట్టు వ్యూహాలకు పదునుపెడుతోంది.

మొతేరాలో టీమ్ఇండియా, ఇంగ్లాండ్​ మధ్య జరగనున్న మూడో టీ20కు ఎర్రమట్టి పిచ్​ను తయారు చేయనున్నారని తెలుస్తోంది. ఈ మ్యాచ్​ మంగళవారం రాత్రి 7 గంటలకు ప్రారంభంకానుంది.

రోహిత్​కు ఛాన్స్​!

ఇంగ్లాండ్​తో జరిగిన రెండో టీ20లో యువ బ్యాట్స్​మన్​ ఇషాన్​ కిషన్​ అర్ధశతకంతో అలరించగా.. కెప్టెన్​ కోహ్లీ తనదైన మెరుపు ఇన్నింగ్స్​తో జట్టుకు విజయాన్ని తెచ్చిపెట్టాడు. అయితే ఈ మ్యాచ్​లో ఓపెనర్​ కేఎల్​ రాహుల్​ డకౌట్​ అవ్వడంపై అభిమానులు కలవరానికి గురయ్యారు. తొలి టీ20లోనూ రాహుల్​ తన బ్యాటింగ్​తో ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో.. అతడి స్థానంలో రెండు మ్యాచ్​ల్లో విశ్రాంతినిచ్చిన రోహిత్​ శర్మకు మూడో టీ20లో ఓపెనర్​గా బ్యాటింగ్​కు పంపే అవకాశం ఉంది.

మరోవైపు.. రిషబ్​ పంత్​, శ్రేయస్​ అయ్యర్​, సూర్యకుమార్​ యాదవ్​ వంటి ఆటగాళ్లతో టీమ్ఇండియా మిడిల్​ ఆర్డర్ బలంగా ఉంది. అటు బౌలింగ్​లోనూ మార్పు ఉండకపోవచ్చు.

ఈసారైనా..?

గాయం కారణంగా రెండో టీ20కి దూరమైన మార్క్​ వుడ్​.. మూడో టీ20కి అందుబాటులో ఉంటాడని ఇంగ్లాండ్​ కెప్టెన్ ఇయాన్​ మోర్గాన్ చెప్పాడు. ఓపెనర్లు జేసన్​ రాయ్​ మంచి ఫామ్​లో ఉన్నాడు. ఆడిన రెండు టీ20ల్లోనూ అర్ధశతకం వరకు వచ్చి వెనుదిరిగాడు.

స్క్వాడ్స్ అంచనా​:

టీమ్ఇండియా: విరాట్​ కోహ్లీ (కెప్టెన్​), రోహిత్​ శర్మ (వైస్​కెప్టెన్​), కేఎల్​ రాహుల్​, శిఖర్​ ధావన్​, శ్రేయస్​ అయ్యర్​, సూర్యకుమార్​ యాదవ్​, రిషబ్​ పంత్​ (వికెట్​ కీపర్​), హార్దిక్​ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్​, భువనేశ్వర్​ కుమార్​, అక్షర్​ పటేల్​, వాషింగ్టన్​ సుందర్​, శార్దూల్​ ఠాకూర్​, నవదీప్​ సైనీ, దీపక్​ చాహర్​, రాహుల్​ తెవాతియా, ఇషాన్​ కిషన్​ (రిజర్వ్​ వికెట్​కీపర్​).

ఇంగ్లాండ్​: ఇయాన్​ మోర్గాన్​ (కెప్టెన్​), జోస్​ బట్లర్​, జేసన్​ రాయ్​, లైమ్​ లివింగ్​స్టన్​, డేవిడ్​ మలన్​, బెన్​ స్టోక్స్​, మొయిన్​ అలీ, అదిల్​ రషీద్​, రీసె టాప్లే, క్రిస్​ జోర్డాన్​, మార్క్​ వుడ్​, సామ్​ కరన్​, టామ్​ కరన్​, సామ్​ బిల్లింగ్స్​, జానీ బెయిర్​స్టా, జోఫ్రా ఆర్చర్​.

ఇదీ చూడండి: దంచేసిన ఇషాన్​- కోహ్లీ.. భారత్​దే గెలుపు

రెండో టీ20లో అద్భుతమైన విజయం సొంతం చేసుకున్న కోహ్లీసేన.. మూడో టీ20లోనూ సత్తాచాటి సిరీస్​పై పట్టు సాధించాలని ఊవిళ్లూరుతోంది. కెప్టెన్​ కోహ్లీతో పాటు యువ ఆటగాళ్లూ రాణిస్తున్న వేళ టీమ్​ఇండియా శిబిరంలో సరికొత్త జోష్​ కనపడుతోంది. ఇదే ఉత్సాహంతో మూడో టీ20లోనూ విజయం సాధించాలని.. భారత జట్టు వ్యూహాలకు పదునుపెడుతోంది.

మొతేరాలో టీమ్ఇండియా, ఇంగ్లాండ్​ మధ్య జరగనున్న మూడో టీ20కు ఎర్రమట్టి పిచ్​ను తయారు చేయనున్నారని తెలుస్తోంది. ఈ మ్యాచ్​ మంగళవారం రాత్రి 7 గంటలకు ప్రారంభంకానుంది.

రోహిత్​కు ఛాన్స్​!

ఇంగ్లాండ్​తో జరిగిన రెండో టీ20లో యువ బ్యాట్స్​మన్​ ఇషాన్​ కిషన్​ అర్ధశతకంతో అలరించగా.. కెప్టెన్​ కోహ్లీ తనదైన మెరుపు ఇన్నింగ్స్​తో జట్టుకు విజయాన్ని తెచ్చిపెట్టాడు. అయితే ఈ మ్యాచ్​లో ఓపెనర్​ కేఎల్​ రాహుల్​ డకౌట్​ అవ్వడంపై అభిమానులు కలవరానికి గురయ్యారు. తొలి టీ20లోనూ రాహుల్​ తన బ్యాటింగ్​తో ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో.. అతడి స్థానంలో రెండు మ్యాచ్​ల్లో విశ్రాంతినిచ్చిన రోహిత్​ శర్మకు మూడో టీ20లో ఓపెనర్​గా బ్యాటింగ్​కు పంపే అవకాశం ఉంది.

మరోవైపు.. రిషబ్​ పంత్​, శ్రేయస్​ అయ్యర్​, సూర్యకుమార్​ యాదవ్​ వంటి ఆటగాళ్లతో టీమ్ఇండియా మిడిల్​ ఆర్డర్ బలంగా ఉంది. అటు బౌలింగ్​లోనూ మార్పు ఉండకపోవచ్చు.

ఈసారైనా..?

గాయం కారణంగా రెండో టీ20కి దూరమైన మార్క్​ వుడ్​.. మూడో టీ20కి అందుబాటులో ఉంటాడని ఇంగ్లాండ్​ కెప్టెన్ ఇయాన్​ మోర్గాన్ చెప్పాడు. ఓపెనర్లు జేసన్​ రాయ్​ మంచి ఫామ్​లో ఉన్నాడు. ఆడిన రెండు టీ20ల్లోనూ అర్ధశతకం వరకు వచ్చి వెనుదిరిగాడు.

స్క్వాడ్స్ అంచనా​:

టీమ్ఇండియా: విరాట్​ కోహ్లీ (కెప్టెన్​), రోహిత్​ శర్మ (వైస్​కెప్టెన్​), కేఎల్​ రాహుల్​, శిఖర్​ ధావన్​, శ్రేయస్​ అయ్యర్​, సూర్యకుమార్​ యాదవ్​, రిషబ్​ పంత్​ (వికెట్​ కీపర్​), హార్దిక్​ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్​, భువనేశ్వర్​ కుమార్​, అక్షర్​ పటేల్​, వాషింగ్టన్​ సుందర్​, శార్దూల్​ ఠాకూర్​, నవదీప్​ సైనీ, దీపక్​ చాహర్​, రాహుల్​ తెవాతియా, ఇషాన్​ కిషన్​ (రిజర్వ్​ వికెట్​కీపర్​).

ఇంగ్లాండ్​: ఇయాన్​ మోర్గాన్​ (కెప్టెన్​), జోస్​ బట్లర్​, జేసన్​ రాయ్​, లైమ్​ లివింగ్​స్టన్​, డేవిడ్​ మలన్​, బెన్​ స్టోక్స్​, మొయిన్​ అలీ, అదిల్​ రషీద్​, రీసె టాప్లే, క్రిస్​ జోర్డాన్​, మార్క్​ వుడ్​, సామ్​ కరన్​, టామ్​ కరన్​, సామ్​ బిల్లింగ్స్​, జానీ బెయిర్​స్టా, జోఫ్రా ఆర్చర్​.

ఇదీ చూడండి: దంచేసిన ఇషాన్​- కోహ్లీ.. భారత్​దే గెలుపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.