టీమ్ఇండియాతో జరిగే టెస్టు సిరీస్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్. గత సిరీస్లో జరిగిన పొరపాట్లను చక్కదిద్దుకుని ఈ సిరీస్లో రాణిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. కోహ్లీసేన గతేడాది తమ జట్టు కంటే అన్ని విభాగాల్లోనూ బలంగా ఉందని కొనియాడాడు.
"ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ను కోల్పోతామని ఎప్పుడూ అనుకోలేదు. 2018-19 సిరీస్లో మా జట్టు కంటే భారత్ అన్ని విభాగాల్లోనూ బలంగా ఉంది. ఇందులో దాచిపెట్టాల్సిందేమీ లేదు. ఈ సిరీస్లో గత సిరీస్లో జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుని రాణించడానికి ప్రయత్నిస్తాం."
-స్టార్క్, ఆసీస్ బౌలర్
గతేడాది కోహ్లీ సారథ్యంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన కోహ్లీసేన టెస్టు సిరీస్ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. కంగారూల గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయం సాధించింది.