వెస్టిండీస్ బ్యాట్స్మన్ షై హోప్, అతడి సోదరుడు కైల్ హోప్.. త్వరలో జరగబోయే సూపర్50 కప్ టోర్నీ నుంచి తప్పుకున్నారు. వీరిద్దరికీ తాజాగా చేసిన కరోనా నిర్ధరణ పరీక్షల్లో పాజిటివ్గా తేలడమే కారణం. ఈ విషయాన్ని వీరిద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్న బార్బడోస్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ప్రస్తుతం వీరు స్వీయనిర్బంధంలో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
కరోనా వల్ల వాయిదా పడ్డ సూపర్ 50 కప్ను రీషెడ్యూల్ చేసి ఫిబ్రవరిలో నిర్వహించబోతుంది వెస్డిండీస్ క్రికెట్ బోర్డు. ఫిబ్రవరి 7నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది.
ఇదీ చూడండి: లేటు వయసులో టెస్టు అరంగేట్రం- కల సాకారం