ETV Bharat / sports

పాకిస్థాన్ విజయం.. ఇంగ్లాండ్​తో సిరీస్​ డ్రా

author img

By

Published : Sep 2, 2020, 9:33 AM IST

టీ20 సిరీస్​లోని చివరి మ్యాచ్​లో పాక్ ఐదు పరుగుల తేడాతో గెల్చింది. 86 పరుగులు చేసిన మహ్మద్ హఫీజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​గా ఎంపికయ్యాడు. తద్వారా సిరీస్​ 1-1తో సమమైంది.

పాకిస్థాన్ విజయం.. ఇంగ్లాండ్​తో సిరీస్​ డ్రా
పాకిస్థాన్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్

ఇంగ్లాండ్​ పర్యటనలో భాగంగా ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది పాకిస్థాన్. మాంచెస్టర్​లో మంగళవారం జరిగిన చివరిదైన మూడో టీ20లో ఐదు పరుగుల తేడాతో గెలిచింది. ఫలితంగా 1-1తో సిరీస్​ డ్రా అయింది. అంతకు ముందు జరిగిన టెస్టు సిరీస్​ను 0-1 తేడాతో కోల్పోయింది పాక్.

ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరిగిన చివరి టీ20లో టాస్ గెలిచి ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లో పాక్ 4 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. హైదర్ అలీ(54) ఆకట్టుకోగా, హఫీజ్ 86 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు.

అనంతరం ఛేదనలో ఇంగ్లాండ్ తడబడింది. ప్రారంభం నుంచి వరుసగా వికెట్లు కోల్పోయింది. మొత్తంగా 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు మాత్రమే చేయగలిగింది. మొయిన్ అలీ (61), టామ్ బాంటన్ (46) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు.

ఇంగ్లాండ్​ పర్యటనలో భాగంగా ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది పాకిస్థాన్. మాంచెస్టర్​లో మంగళవారం జరిగిన చివరిదైన మూడో టీ20లో ఐదు పరుగుల తేడాతో గెలిచింది. ఫలితంగా 1-1తో సిరీస్​ డ్రా అయింది. అంతకు ముందు జరిగిన టెస్టు సిరీస్​ను 0-1 తేడాతో కోల్పోయింది పాక్.

ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరిగిన చివరి టీ20లో టాస్ గెలిచి ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లో పాక్ 4 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. హైదర్ అలీ(54) ఆకట్టుకోగా, హఫీజ్ 86 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు.

అనంతరం ఛేదనలో ఇంగ్లాండ్ తడబడింది. ప్రారంభం నుంచి వరుసగా వికెట్లు కోల్పోయింది. మొత్తంగా 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు మాత్రమే చేయగలిగింది. మొయిన్ అలీ (61), టామ్ బాంటన్ (46) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.