ETV Bharat / sports

బంగ్లాదేశ్​ కెప్టెన్​ పదవి నుంచి తప్పుకున్న మొర్తాజా

author img

By

Published : Mar 5, 2020, 8:57 PM IST

బంగ్లాదేశ్​ క్రికెట్​ జట్టు కెప్టెన్​ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు మష్రఫే మొర్తాజా. శుక్రవారం జింబాబ్వేతో జరిగే వన్డే మ్యాచ్​ సారథిగా చివరిదని అతడు తెలిపాడు.

Mashrafe steps down as Bangladesh one-day captain
బంగ్లాదేశ్​ వన్డే కెప్టెన్​ పదవి నుంచి తప్పుకున్న మోర్తజా

బంగ్లాదేశ్​ పేసర్​ మష్రఫే మొర్తాజా వన్డే జట్టు కెప్టెన్​ పదవికి రాజీనామా చేశాడు. ఈ విషయాన్ని గురువారం వెల్లడించాడు. ఈ నేపథ్యంలో పరిమిత ఓవర్లకు త్వరలోనే అతడు రిటైర్​మెంట్​ ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. శుక్రవారం జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్​ కెప్టెన్​గా మొర్తాజాకు చివరి వన్డే అవుతుంది.

"ఇన్నాళ్లు నాపై నమ్మకముంచిన బంగ్లాదేశ్​ క్రికెట్​ బోర్డుకు ధన్యవాదాలు. ఆటగాడిగా జట్టులో స్థానమిస్తే ఉత్తమ ప్రదర్శన చేస్తా."

- మష్రఫే మొర్తాజా, బంగ్లాదేశ్​ వన్డే కెప్టెన్​

బంగ్లాదేశ్​ జట్టు కాంట్రాక్ట్​ నుంచి ఈ ఏడాది జనవరిలో తప్పకున్నాడు మొర్తాజా. దీనివల్ల వచ్చే ప్రపంచకప్ దృష్ట్యా యువకులకు అవకాశం దొరకుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇప్పటికే అతడి మోకాలికి ఏడు సార్లు ఆపరేషన్లు జరిగిన కారణంగా ఎక్కువకాలం జట్టులో కొనసాగలేనని పరోక్షంగా సూచించాడు.

మొర్తాజా 87 మ్యాచ్​ల్లో జట్టుకు సారథ్యం వహించి 49 సార్లు విజయాన్ని అందించి అత్యంత విజయవంతమైన సారథిగా ఘనత సాధించాడు. 2018లో జరిగిన బంగ్లాదేశ్​ ఎన్నికల్లో అవామీ లీగ్​ పార్టీ తరఫున పోటీ చేసి పార్లమెంట్​ అభ్యర్ధిగా గెలుపొందాడు.

ఇదీ చూడండి.. ఈ పదవి నాకు దక్కిన గౌరవం: జోషీ

బంగ్లాదేశ్​ పేసర్​ మష్రఫే మొర్తాజా వన్డే జట్టు కెప్టెన్​ పదవికి రాజీనామా చేశాడు. ఈ విషయాన్ని గురువారం వెల్లడించాడు. ఈ నేపథ్యంలో పరిమిత ఓవర్లకు త్వరలోనే అతడు రిటైర్​మెంట్​ ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. శుక్రవారం జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్​ కెప్టెన్​గా మొర్తాజాకు చివరి వన్డే అవుతుంది.

"ఇన్నాళ్లు నాపై నమ్మకముంచిన బంగ్లాదేశ్​ క్రికెట్​ బోర్డుకు ధన్యవాదాలు. ఆటగాడిగా జట్టులో స్థానమిస్తే ఉత్తమ ప్రదర్శన చేస్తా."

- మష్రఫే మొర్తాజా, బంగ్లాదేశ్​ వన్డే కెప్టెన్​

బంగ్లాదేశ్​ జట్టు కాంట్రాక్ట్​ నుంచి ఈ ఏడాది జనవరిలో తప్పకున్నాడు మొర్తాజా. దీనివల్ల వచ్చే ప్రపంచకప్ దృష్ట్యా యువకులకు అవకాశం దొరకుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇప్పటికే అతడి మోకాలికి ఏడు సార్లు ఆపరేషన్లు జరిగిన కారణంగా ఎక్కువకాలం జట్టులో కొనసాగలేనని పరోక్షంగా సూచించాడు.

మొర్తాజా 87 మ్యాచ్​ల్లో జట్టుకు సారథ్యం వహించి 49 సార్లు విజయాన్ని అందించి అత్యంత విజయవంతమైన సారథిగా ఘనత సాధించాడు. 2018లో జరిగిన బంగ్లాదేశ్​ ఎన్నికల్లో అవామీ లీగ్​ పార్టీ తరఫున పోటీ చేసి పార్లమెంట్​ అభ్యర్ధిగా గెలుపొందాడు.

ఇదీ చూడండి.. ఈ పదవి నాకు దక్కిన గౌరవం: జోషీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.