ETV Bharat / sports

స్వదేశీ క్రికెటర్లతోనే ఐపీఎల్-2020​ జరిగితే..?

author img

By

Published : Jun 5, 2020, 5:37 AM IST

Updated : Jun 5, 2020, 6:06 AM IST

కరోనా వల్ల నిరవధిక వాయిదా పడిన ఐపీఎల్ ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో టోర్నీ ఉంటుందా? రద్దవుతుందా? స్టేడియాల్లో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహిస్తారా? విదేశీ ఆటగాళ్లు ఆడతారా? అనేవి అందరి మదిలోనూ రేకెత్తుతున్న ప్రశ్నలు. ఈ నేపథ్యంలో పూర్తిగా భారత క్రికెటర్లతో టోర్నీనిర్వహించాలనుకుంటే ఆ జట్లు ఎలా ఉంటాయో ఓ సారి చూసేద్దామా!

IPL 2020: Strong XI of all eight teams for IPL 2020 without overseas players
విదేశీ ఆటగాళ్లు లేకుండా ఐపీఎల్​-2020 జట్లు చూద్దామా!

వేసవి వస్తోందంటే దేశంలోని క్రీడా ప్రేమికుల కళ్లన్నీ ఐపీఎల్‌పైనే ఉంటాయి. లీగ్‌ ఆరంభానికి కొన్ని వారాల ముందు నుంచే ఆ ఫీవర్​ మొదలైపోతుంది. దాదాపు నెలన్నర పాటు వినోదాల విందులో తడిసి ముద్దయిపోవడానికి సిద్ధమైపోతారు. లక్షల మంది స్టేడియాలకు వెళ్లి మ్యాచ్‌లు చూస్తే, కోట్ల మంది టీవీలకు అతుక్కుపోతారు. అయితే స్టేడియాల్లో అరుపులు, కేరింతల మధ్య మ్యాచ్‌ చూడటంలో ఉండే మజానే వేరు. కానీ ఈసారి ఆ మజాను అభిమానులకు అందకుండా దూరం చేసింది ప్రాణాంతక కరోనా. అయితే వైరస్​ దెబ్బకు ఐపీఎల్‌ జరుగుతుందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

IPL 2020
ఐపీఎల్​ ట్రోఫీ

ఒకవేళ లీగ్‌ పూర్తిగా రద్దు కాకపోయినా.. టోర్నీని కుదించినా, మరే విధమైన మార్పులు జరిగినా ఐపీఎల్ కళ తప్పడం ఖాయం. అయితే కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. ప్రేక్షకుల్ని స్టేడియాల్లోకి అనుమతించే పరిస్థితి కనిపించడం లేదు. అసలు వీక్షకులు లేకుండా మ్యాచ్‌ జరిగితే ఎలా ఉంటుందన్నది ఓ ప్రశ్న. ఇక విదేశీ క్రికెటర్లు లేకుండా లీగ్ నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనేది మరో ప్రశ్న. ఈ క్రమంలో రెండో దానికి సమాధానమే ఈ కథనం. కేవలం స్వదేశీ స్టార్లతో జట్లను రూపొందిస్తే ఎలా ఉంటుందో చూసేయండి.

రాజస్థాన్​ రాయల్స్​...

విదేశీ ఆటగాళ్లపైనే ఎక్కువ ఆధారపడిన జట్లలో ఒకటి రాజస్థాన్​ రాయల్స్​. స్టీవ్​ స్మిత్​, బట్లర్​, బెన్​ స్టోక్స్​ వంటి ఎందరో స్టార్ క్రికెటర్లను కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిందీ జట్టు యాజమాన్యం. వాళ్లు లేకుండా మ్యాచ్​లు జరిగితే ఆ జట్టు సగం బలం కోల్పోయినట్లే.

దేశీయ ఆటగాళ్లలో రాబిన్​ ఊతప్ప, సంజూ శాంసన్​, శ్రేయస్​ గోపాల్​ కీలకంగా ఉన్నారు. రాజస్థాన్​ కుర్రాడు మహిపాల్​ లోమర్​ తుది జట్టులో అవకాశం దక్కించుకునే వీలుంటుంది. ముంబయి యువ సంచలనం యశస్వి జైస్వాల్​పై ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. నిజంగా స్వదేశీ ఆటగాళ్లతో జరిగితే... ఊతప్ప జట్టుకు సారథ్యం వహించొచ్చు.

జట్టు ఇదే...

యశస్వి జైస్వాల్​, మనన్​ వోహ్రా, సంజూ శాంసన్​(కీపర్​), రాబిన్​ ఊతప్ప(కెప్టెన్​), రియాన్​ పరాగ్​, మహిపాల్​ లామర్​, శ్రేయస్​ గోపాల్​, జయదేవ్​ ఉనద్కత్​, మయాంక్​ మార్కండ్​, అనికేత్​ రాజ్​పుత్​, వరుణ్​ అరోన్​.

కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​..

పంజాబ్​ జట్టుకు మిగతావాళ్లతో పోలిస్తే స్వదేశీ బలం ఎక్కువగానే ఉంది. కెప్టెన్​ కేఎల్​ రాహుల్​ మంచి ఫామ్​లో ఉన్నాడు. మయాంక్​ అగర్వాల్​, కరుణ్​​ నాయర్​, మన్​దీప్​ సింగ్​ వంటి స్వదేశీ ప్లేయర్లు బాగా ఆడగలిగే సత్తా ఉన్నవాళ్లు.

విదేశీ ఆటగాళ్లు లేకపోవడం వల్ల జట్టు బౌలింగ్​ విభాగం బలహీనంగా కనిపిస్తోంది. మహ్మద్​ షమి మినహాయిస్తే చెప్పుకోదగ్గ ప్లేయర్ లేడు. ఇషాన్​ పోరెల్​, అండర్​-19 సంచలనం రవి బిష్ణోయ్​ ఆశలు రేకెత్తించొచ్చు.

జట్టు ఇదే..

కేఎల్​ రాహల్​(కెప్టెన్​, కీపర్​), మయాంక్​ అగర్వాల్​, కరుణ్​ నాయర్​, మన్​దీప్​ సింగ్​, సర్ఫరాజ్​ ఖాన్​, దీపక్​ హుడా, కే గౌతమ్​, మురుగన్​ అశ్విన్​, మహ్మద్​ షమి, రవి బిష్ణోయ్​, ఇషాన్​ పోరెల్​.

సన్​రైజర్స్​ హైదరాబాద్​.

విదేశీ ఆటగాళ్లు లేకుండా ఆడితే ఎక్కువగా ఇబ్బంది పడే జట్లలో ముందుటుంది సన్​రైజర్స్​. డేవిడ్​ వార్నర్​, కేన్​ విలియమ్సన్​, బెయిర్​స్టో వంటి వారే ఆ జట్టుకు వెన్నెముక. బౌలింగ్​లోనూ రషీద్​ ఖాన్​ వంటి బౌలర్లు లేకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది.

అభిషేక్​ శర్మ, విరాట్​ సింగ్​, ప్రియమ్​ గార్గ్​ వంటి కుర్రాళ్లు ఉన్నా... వాళ్లను నడిపించే సరైన నాయకుడు లేడు. అప్పడు బ్యాటింగ్​ భారం మనీశ్​ పాండే లేదా విజయ్​ శంకర్​ తీసుకోవచ్చు. భువనేశ్వర్​ జట్టు బౌలింగ్​ విభాగాన్ని నడిపించడమే కాకుండా కెప్టెన్​గానూ బాధ్యతలు చేపట్టాలి.

జట్టు ఇదే..

వృద్ధిమాన్​ సాహ(కీపర్​), అభిషేక్​ శర్మ, మనీశ్​ పాండే, ప్రియమ్​ గార్గ్​, విజయ్​ శంకర్​, విరాట్​ సింగ్​, అబ్దుల్​ షమాద్, షహబాజ్​ నదీమ్​, భువనేశ్వర్​ కుమార్​(కెప్టెన్​), ఖలీల్​ అహ్మద్​, శిద్ధార్థ్​ కౌల్​.

కోల్​కతా నైట్​రైడర్స్​...

ఇప్పటికే రసెల్ అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న కోల్​కతా జట్టు.. సునీల్​ నరేన్​, టామ్​ బాంటన్​, ఇయాన్​ మోర్గాన్​, వేలంలో అత్యధిక ధరకు పలికిన పాట్​ కమిన్స్​​ లేకపోవడం ఆ జట్టుకు తీరని నష్టమే. శుభ్​మన్​ గిల్​, నితీశ్​ రాణా, సిద్ధేశ్​ లాడ్​ వంటి యువ ఆటగాళ్లు జట్టును ఆదుకోవాలి. వీళ్లు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు ప్రయత్నించొచ్చు. దినేశ్​ కార్తీక్​ జట్టును నడిపించాలి.

జట్టు ఇదే..

శుభ్​మన్​ గిల్​, సిద్ధేశ్​​ లాడ్​, నితీశ్​ రాణా, దినేశ్​ కార్తీక్​(కెప్టెన్​, కీపర్​), రాహుల్​ త్రిపాఠి, రింకూ సింగ్​, వరుణ్​ చక్రవర్తి, కమలేశ్​ నాగర్​కోటి, కుల్దీప్​ యాదవ్​, సందీప్​ వారియర్​, ప్రసిద్ధ్​ కృష్ణ

దిల్లీ క్యాపిటల్స్​...

దిల్లీ జట్టులో ప్రతీ ఆటగాడికి ప్రత్యామ్నాయంగా మరో ఆటగాడు ఉన్నాడు. ఆ విధంగా ప్రణాళిక రచించింది ఆ ఫ్రాంఛైజీ.

బ్యాటింగ్​లో శిఖర్​ ధావన్​, అజింక్యా రహానే, శ్రేయస్​ అయ్యర్​, రిషబ్​ పంత్​, పృథ్వీ షా ఉన్నారు. బౌలింగ్​లో అశ్విన్​, అమిత్​ శర్మ ఉండగా.. ఆల్​రౌండర్​గా అక్షర్​ పటేల్​ ఉన్నాడు. ఇషాంత్​ శర్మ ఈ సీజన్​లో రావడం వల్ల జట్టుకు మరింత బలం.

జట్టు ఇదే...

శిఖర్​ ధావన్​, పృథ్వీ షా,అజింక్యా రహనే, శ్రేయస్​ అయ్యర్​(కెప్టెన్​), రిషబ్​ పంత్​(కీపర్​), అక్షర్​ పటేల్​, హర్షల్​ పటేల్​, రవిచంద్రన్​ అశ్విన్​, అమిత్​ మిశ్రా, మోహిత్​ శర్మ, ఇషాంత్​ శర్మ.

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు..

ఈ జట్టులో కీలక ఆటగాడు ఏబీ డివిలియర్స్​ లేకపోతే అతడి స్థానం కోసం చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది. విరాట్​ కోహ్లీ వికెట్లు కాపాడుకొంటూ దూకుడైన ఆట ఆడాలి. ఇందుకోసం మిడిలార్డర్​లో ఆడాల్సి రావచ్చు.

విదేశీ ఆటగాళ్లు లేకుండా మ్యాచ్​లు జరిగితే ఈ జట్టుకు పెద్దగా నష్టమేమి లేదు. యజువేంద్ర చాహల్​, నవదీప్​ సైనీ, ఉమేశ్​ యాదవ్​ జట్టులో ఉన్నారు. వాషింగ్టన్​ సుందర్​, శివమ్​ దూబే, పవన్​ నేగీ వంటి యువ ఆల్​రౌండర్లూ ఉన్నారు.

జట్టు ఇదే..

పార్థివ్​ పటేల్​(కీపర్​), దేవదత్​ పడిక్కల్​, విరాట్​ కోహ్లీ(కెప్టెన్​),గుర్​కీరత్​ సింగ్​, శివమ్​ దూబే, పవన్​ నేగి, వాషింగ్టన్​ సుందర్​, నవదీప్​ సైనీ, ఉమేశ్​ యాదవ్​, మహ్మద్​ సిరాజ్​, యజువేంద్ర చాహల్​.

ముంబయి ఇండియన్స్​...

ఈ జట్టులో బ్యాటింగ్​ విభాగాన్ని రోహిత్​ నడిపించాలి. అందుకోసం అతడు మిడిలార్డర్​లో ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే క్వింటన్​ డికాక్​, కీరన్​ పొలార్డ్​ల స్థానాలు భర్తీ చేసే ఆటగాడు లేకపోవడమే కారణం. ఇక బౌలింగ్​లో అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

ట్రెంట్​ బౌల్ట్​, లసిత్​ మలింగ, నాథన్​ కల్టర్​నైల్​, మిచెల్​ మెక్లెనగాన్​ వంటి ఆటగాళ్లు లేకపోవడం తీరని లోటు. అయితే బుమ్రా బౌలింగ్​ విభాగాన్ని నడిపించాల్సి ఉంటుంది.

జట్టు ఇదే..

ఇషాన్​ కిషన్​(కీపర్​), అనుమోల్​ ప్రీత్​ సింగ్​, సూర్యకుమార్​ యాదవ్​, రోహిత్​శర్మ(కెప్టెన్​), హార్దిక్​ పాండ్య, కృనాల్​ పాండ్య, అనుకుల్​ రాయ్​, రాహుల్​ చాహర్​, ధావల్​ కులకర్ణి, మోహ్షిన్​ ఖాన్​, జస్ప్రీత్​ బుమ్రా.

చెన్నై సూపర్​కింగ్స్​...

విదేశీ ఆటగాళ్లు లేకపోయినా బలంగా ఉన్న జట్టు ఇదే. ఎక్కువమంది స్వదేశీ ఆటగాళ్లు, అంతర్జాతీయ క్రికెట్​ ఆడిన అనుభవం ఉన్నవాళ్లు ఈ జట్టు సొంతం. ఇప్పటివరకు 3 సార్లు ఛాంపియన్లుగా నిలిచిన జట్టులోని సభ్యులే దాదాపు కొనసాగుతున్నారు. కాబట్టి స్వదేశీ ఆటగాళ్లతో ఐపీఎల్​ చెన్నై జట్టుకే లాభం.

షేన్​ వాట్సన్​, డుప్లెసిస్​ లేకపోవడం వల్ల ఓపెనర్​గా మురళీ విజయ్​ రావచ్చు. మరో ఆటగాడిగా మహారాష్ట్ర దేశవాళీ ఓపెనర్​ రుతురాజ్​ గైక్వాడ్​ బరిలోకి దిగొచ్చు. ఈ జట్టుకు స్పిన్​ ప్రధానబలం.

జట్టు ఇదే..

మురళీ విజయ్​, రుతురాజ్​ గైక్వాడ్​, సురేశ్​ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్​ ధోనీ(కెప్టెన్​, కీపర్​), కేదార్​ జాదవ్​, రవీంద్ర జడేజా, శార్దుల్​ ఠాకుర్​, దీపక్​ చాహర్​, పియూష్​ చావ్లా, హర్భజన్​ సింగ్​

  • విదేశీ స్టార్లు లేకుండా టోర్నీ జరిగించే అవకాశాలను బీసీసీఐ పరిశీలించగా.. బలంగా ఉన్న చెన్నై సూపర్​కింగ్స్​, కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ జట్లు ఆ నిర్ణయాన్ని తిరస్కరించాయి. ఎక్కువగా విదేశీ ఆటగాళ్లపై ఆధారపడిన రాజస్థాన్​ జట్టు అందుకు మద్దతిచ్చింది.

టీ20 ప్రపంచకప్​ విండోలో..?

ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడితే.. ఆ విండోలో ఐపీఎల్‌ను నిర్వహించాలని భావిస్తోంది బీసీసీఐ. ప్రయాణ ఆంక్షలున్న నేపథ్యంలో విదేశీ ఆటగాళ్లు రాకపోతే ఏం చేయాలన్నదానిపై తర్జనభర్జన పడుతోంది. వైరస్‌ తగ్గాకే ఐపీఎల్‌ ఎప్పుడు నిర్వహించాలో స్పష్టత వస్తుంది. ఈ సీజన్‌ ఐపీఎల్‌ రద్దుచేస్తే బీసీసీఐకి కనీసం రూ.4000 కోట్లు నష్టం వస్తుందని అంచనా.

ఇదీ చూడండి... కన్నీటి 'పరుగు': అప్పుడు పతకం కోసం.. ఇప్పుడు నీటి కోసం

వేసవి వస్తోందంటే దేశంలోని క్రీడా ప్రేమికుల కళ్లన్నీ ఐపీఎల్‌పైనే ఉంటాయి. లీగ్‌ ఆరంభానికి కొన్ని వారాల ముందు నుంచే ఆ ఫీవర్​ మొదలైపోతుంది. దాదాపు నెలన్నర పాటు వినోదాల విందులో తడిసి ముద్దయిపోవడానికి సిద్ధమైపోతారు. లక్షల మంది స్టేడియాలకు వెళ్లి మ్యాచ్‌లు చూస్తే, కోట్ల మంది టీవీలకు అతుక్కుపోతారు. అయితే స్టేడియాల్లో అరుపులు, కేరింతల మధ్య మ్యాచ్‌ చూడటంలో ఉండే మజానే వేరు. కానీ ఈసారి ఆ మజాను అభిమానులకు అందకుండా దూరం చేసింది ప్రాణాంతక కరోనా. అయితే వైరస్​ దెబ్బకు ఐపీఎల్‌ జరుగుతుందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

IPL 2020
ఐపీఎల్​ ట్రోఫీ

ఒకవేళ లీగ్‌ పూర్తిగా రద్దు కాకపోయినా.. టోర్నీని కుదించినా, మరే విధమైన మార్పులు జరిగినా ఐపీఎల్ కళ తప్పడం ఖాయం. అయితే కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. ప్రేక్షకుల్ని స్టేడియాల్లోకి అనుమతించే పరిస్థితి కనిపించడం లేదు. అసలు వీక్షకులు లేకుండా మ్యాచ్‌ జరిగితే ఎలా ఉంటుందన్నది ఓ ప్రశ్న. ఇక విదేశీ క్రికెటర్లు లేకుండా లీగ్ నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనేది మరో ప్రశ్న. ఈ క్రమంలో రెండో దానికి సమాధానమే ఈ కథనం. కేవలం స్వదేశీ స్టార్లతో జట్లను రూపొందిస్తే ఎలా ఉంటుందో చూసేయండి.

రాజస్థాన్​ రాయల్స్​...

విదేశీ ఆటగాళ్లపైనే ఎక్కువ ఆధారపడిన జట్లలో ఒకటి రాజస్థాన్​ రాయల్స్​. స్టీవ్​ స్మిత్​, బట్లర్​, బెన్​ స్టోక్స్​ వంటి ఎందరో స్టార్ క్రికెటర్లను కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిందీ జట్టు యాజమాన్యం. వాళ్లు లేకుండా మ్యాచ్​లు జరిగితే ఆ జట్టు సగం బలం కోల్పోయినట్లే.

దేశీయ ఆటగాళ్లలో రాబిన్​ ఊతప్ప, సంజూ శాంసన్​, శ్రేయస్​ గోపాల్​ కీలకంగా ఉన్నారు. రాజస్థాన్​ కుర్రాడు మహిపాల్​ లోమర్​ తుది జట్టులో అవకాశం దక్కించుకునే వీలుంటుంది. ముంబయి యువ సంచలనం యశస్వి జైస్వాల్​పై ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. నిజంగా స్వదేశీ ఆటగాళ్లతో జరిగితే... ఊతప్ప జట్టుకు సారథ్యం వహించొచ్చు.

జట్టు ఇదే...

యశస్వి జైస్వాల్​, మనన్​ వోహ్రా, సంజూ శాంసన్​(కీపర్​), రాబిన్​ ఊతప్ప(కెప్టెన్​), రియాన్​ పరాగ్​, మహిపాల్​ లామర్​, శ్రేయస్​ గోపాల్​, జయదేవ్​ ఉనద్కత్​, మయాంక్​ మార్కండ్​, అనికేత్​ రాజ్​పుత్​, వరుణ్​ అరోన్​.

కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​..

పంజాబ్​ జట్టుకు మిగతావాళ్లతో పోలిస్తే స్వదేశీ బలం ఎక్కువగానే ఉంది. కెప్టెన్​ కేఎల్​ రాహుల్​ మంచి ఫామ్​లో ఉన్నాడు. మయాంక్​ అగర్వాల్​, కరుణ్​​ నాయర్​, మన్​దీప్​ సింగ్​ వంటి స్వదేశీ ప్లేయర్లు బాగా ఆడగలిగే సత్తా ఉన్నవాళ్లు.

విదేశీ ఆటగాళ్లు లేకపోవడం వల్ల జట్టు బౌలింగ్​ విభాగం బలహీనంగా కనిపిస్తోంది. మహ్మద్​ షమి మినహాయిస్తే చెప్పుకోదగ్గ ప్లేయర్ లేడు. ఇషాన్​ పోరెల్​, అండర్​-19 సంచలనం రవి బిష్ణోయ్​ ఆశలు రేకెత్తించొచ్చు.

జట్టు ఇదే..

కేఎల్​ రాహల్​(కెప్టెన్​, కీపర్​), మయాంక్​ అగర్వాల్​, కరుణ్​ నాయర్​, మన్​దీప్​ సింగ్​, సర్ఫరాజ్​ ఖాన్​, దీపక్​ హుడా, కే గౌతమ్​, మురుగన్​ అశ్విన్​, మహ్మద్​ షమి, రవి బిష్ణోయ్​, ఇషాన్​ పోరెల్​.

సన్​రైజర్స్​ హైదరాబాద్​.

విదేశీ ఆటగాళ్లు లేకుండా ఆడితే ఎక్కువగా ఇబ్బంది పడే జట్లలో ముందుటుంది సన్​రైజర్స్​. డేవిడ్​ వార్నర్​, కేన్​ విలియమ్సన్​, బెయిర్​స్టో వంటి వారే ఆ జట్టుకు వెన్నెముక. బౌలింగ్​లోనూ రషీద్​ ఖాన్​ వంటి బౌలర్లు లేకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది.

అభిషేక్​ శర్మ, విరాట్​ సింగ్​, ప్రియమ్​ గార్గ్​ వంటి కుర్రాళ్లు ఉన్నా... వాళ్లను నడిపించే సరైన నాయకుడు లేడు. అప్పడు బ్యాటింగ్​ భారం మనీశ్​ పాండే లేదా విజయ్​ శంకర్​ తీసుకోవచ్చు. భువనేశ్వర్​ జట్టు బౌలింగ్​ విభాగాన్ని నడిపించడమే కాకుండా కెప్టెన్​గానూ బాధ్యతలు చేపట్టాలి.

జట్టు ఇదే..

వృద్ధిమాన్​ సాహ(కీపర్​), అభిషేక్​ శర్మ, మనీశ్​ పాండే, ప్రియమ్​ గార్గ్​, విజయ్​ శంకర్​, విరాట్​ సింగ్​, అబ్దుల్​ షమాద్, షహబాజ్​ నదీమ్​, భువనేశ్వర్​ కుమార్​(కెప్టెన్​), ఖలీల్​ అహ్మద్​, శిద్ధార్థ్​ కౌల్​.

కోల్​కతా నైట్​రైడర్స్​...

ఇప్పటికే రసెల్ అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న కోల్​కతా జట్టు.. సునీల్​ నరేన్​, టామ్​ బాంటన్​, ఇయాన్​ మోర్గాన్​, వేలంలో అత్యధిక ధరకు పలికిన పాట్​ కమిన్స్​​ లేకపోవడం ఆ జట్టుకు తీరని నష్టమే. శుభ్​మన్​ గిల్​, నితీశ్​ రాణా, సిద్ధేశ్​ లాడ్​ వంటి యువ ఆటగాళ్లు జట్టును ఆదుకోవాలి. వీళ్లు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు ప్రయత్నించొచ్చు. దినేశ్​ కార్తీక్​ జట్టును నడిపించాలి.

జట్టు ఇదే..

శుభ్​మన్​ గిల్​, సిద్ధేశ్​​ లాడ్​, నితీశ్​ రాణా, దినేశ్​ కార్తీక్​(కెప్టెన్​, కీపర్​), రాహుల్​ త్రిపాఠి, రింకూ సింగ్​, వరుణ్​ చక్రవర్తి, కమలేశ్​ నాగర్​కోటి, కుల్దీప్​ యాదవ్​, సందీప్​ వారియర్​, ప్రసిద్ధ్​ కృష్ణ

దిల్లీ క్యాపిటల్స్​...

దిల్లీ జట్టులో ప్రతీ ఆటగాడికి ప్రత్యామ్నాయంగా మరో ఆటగాడు ఉన్నాడు. ఆ విధంగా ప్రణాళిక రచించింది ఆ ఫ్రాంఛైజీ.

బ్యాటింగ్​లో శిఖర్​ ధావన్​, అజింక్యా రహానే, శ్రేయస్​ అయ్యర్​, రిషబ్​ పంత్​, పృథ్వీ షా ఉన్నారు. బౌలింగ్​లో అశ్విన్​, అమిత్​ శర్మ ఉండగా.. ఆల్​రౌండర్​గా అక్షర్​ పటేల్​ ఉన్నాడు. ఇషాంత్​ శర్మ ఈ సీజన్​లో రావడం వల్ల జట్టుకు మరింత బలం.

జట్టు ఇదే...

శిఖర్​ ధావన్​, పృథ్వీ షా,అజింక్యా రహనే, శ్రేయస్​ అయ్యర్​(కెప్టెన్​), రిషబ్​ పంత్​(కీపర్​), అక్షర్​ పటేల్​, హర్షల్​ పటేల్​, రవిచంద్రన్​ అశ్విన్​, అమిత్​ మిశ్రా, మోహిత్​ శర్మ, ఇషాంత్​ శర్మ.

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు..

ఈ జట్టులో కీలక ఆటగాడు ఏబీ డివిలియర్స్​ లేకపోతే అతడి స్థానం కోసం చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది. విరాట్​ కోహ్లీ వికెట్లు కాపాడుకొంటూ దూకుడైన ఆట ఆడాలి. ఇందుకోసం మిడిలార్డర్​లో ఆడాల్సి రావచ్చు.

విదేశీ ఆటగాళ్లు లేకుండా మ్యాచ్​లు జరిగితే ఈ జట్టుకు పెద్దగా నష్టమేమి లేదు. యజువేంద్ర చాహల్​, నవదీప్​ సైనీ, ఉమేశ్​ యాదవ్​ జట్టులో ఉన్నారు. వాషింగ్టన్​ సుందర్​, శివమ్​ దూబే, పవన్​ నేగీ వంటి యువ ఆల్​రౌండర్లూ ఉన్నారు.

జట్టు ఇదే..

పార్థివ్​ పటేల్​(కీపర్​), దేవదత్​ పడిక్కల్​, విరాట్​ కోహ్లీ(కెప్టెన్​),గుర్​కీరత్​ సింగ్​, శివమ్​ దూబే, పవన్​ నేగి, వాషింగ్టన్​ సుందర్​, నవదీప్​ సైనీ, ఉమేశ్​ యాదవ్​, మహ్మద్​ సిరాజ్​, యజువేంద్ర చాహల్​.

ముంబయి ఇండియన్స్​...

ఈ జట్టులో బ్యాటింగ్​ విభాగాన్ని రోహిత్​ నడిపించాలి. అందుకోసం అతడు మిడిలార్డర్​లో ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే క్వింటన్​ డికాక్​, కీరన్​ పొలార్డ్​ల స్థానాలు భర్తీ చేసే ఆటగాడు లేకపోవడమే కారణం. ఇక బౌలింగ్​లో అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

ట్రెంట్​ బౌల్ట్​, లసిత్​ మలింగ, నాథన్​ కల్టర్​నైల్​, మిచెల్​ మెక్లెనగాన్​ వంటి ఆటగాళ్లు లేకపోవడం తీరని లోటు. అయితే బుమ్రా బౌలింగ్​ విభాగాన్ని నడిపించాల్సి ఉంటుంది.

జట్టు ఇదే..

ఇషాన్​ కిషన్​(కీపర్​), అనుమోల్​ ప్రీత్​ సింగ్​, సూర్యకుమార్​ యాదవ్​, రోహిత్​శర్మ(కెప్టెన్​), హార్దిక్​ పాండ్య, కృనాల్​ పాండ్య, అనుకుల్​ రాయ్​, రాహుల్​ చాహర్​, ధావల్​ కులకర్ణి, మోహ్షిన్​ ఖాన్​, జస్ప్రీత్​ బుమ్రా.

చెన్నై సూపర్​కింగ్స్​...

విదేశీ ఆటగాళ్లు లేకపోయినా బలంగా ఉన్న జట్టు ఇదే. ఎక్కువమంది స్వదేశీ ఆటగాళ్లు, అంతర్జాతీయ క్రికెట్​ ఆడిన అనుభవం ఉన్నవాళ్లు ఈ జట్టు సొంతం. ఇప్పటివరకు 3 సార్లు ఛాంపియన్లుగా నిలిచిన జట్టులోని సభ్యులే దాదాపు కొనసాగుతున్నారు. కాబట్టి స్వదేశీ ఆటగాళ్లతో ఐపీఎల్​ చెన్నై జట్టుకే లాభం.

షేన్​ వాట్సన్​, డుప్లెసిస్​ లేకపోవడం వల్ల ఓపెనర్​గా మురళీ విజయ్​ రావచ్చు. మరో ఆటగాడిగా మహారాష్ట్ర దేశవాళీ ఓపెనర్​ రుతురాజ్​ గైక్వాడ్​ బరిలోకి దిగొచ్చు. ఈ జట్టుకు స్పిన్​ ప్రధానబలం.

జట్టు ఇదే..

మురళీ విజయ్​, రుతురాజ్​ గైక్వాడ్​, సురేశ్​ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్​ ధోనీ(కెప్టెన్​, కీపర్​), కేదార్​ జాదవ్​, రవీంద్ర జడేజా, శార్దుల్​ ఠాకుర్​, దీపక్​ చాహర్​, పియూష్​ చావ్లా, హర్భజన్​ సింగ్​

  • విదేశీ స్టార్లు లేకుండా టోర్నీ జరిగించే అవకాశాలను బీసీసీఐ పరిశీలించగా.. బలంగా ఉన్న చెన్నై సూపర్​కింగ్స్​, కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ జట్లు ఆ నిర్ణయాన్ని తిరస్కరించాయి. ఎక్కువగా విదేశీ ఆటగాళ్లపై ఆధారపడిన రాజస్థాన్​ జట్టు అందుకు మద్దతిచ్చింది.

టీ20 ప్రపంచకప్​ విండోలో..?

ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడితే.. ఆ విండోలో ఐపీఎల్‌ను నిర్వహించాలని భావిస్తోంది బీసీసీఐ. ప్రయాణ ఆంక్షలున్న నేపథ్యంలో విదేశీ ఆటగాళ్లు రాకపోతే ఏం చేయాలన్నదానిపై తర్జనభర్జన పడుతోంది. వైరస్‌ తగ్గాకే ఐపీఎల్‌ ఎప్పుడు నిర్వహించాలో స్పష్టత వస్తుంది. ఈ సీజన్‌ ఐపీఎల్‌ రద్దుచేస్తే బీసీసీఐకి కనీసం రూ.4000 కోట్లు నష్టం వస్తుందని అంచనా.

ఇదీ చూడండి... కన్నీటి 'పరుగు': అప్పుడు పతకం కోసం.. ఇప్పుడు నీటి కోసం

Last Updated : Jun 5, 2020, 6:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.