ETV Bharat / sports

ఏడాది తర్వాత మైదానంలో అడుగుపెట్టిన ధోనీ!​

author img

By

Published : Aug 7, 2020, 7:54 PM IST

Updated : Aug 7, 2020, 8:21 PM IST

చెన్నై సూపర్​ కింగ్స్(సీఎస్కే) జట్టు కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ ఐపీఎల్​ కోసం నెట్​ ప్రాక్టీస్​ మొదలు పెట్టినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. తన స్వస్థలం రాంచీలో బౌలింగ్​ మిషన్​ను ఉపయోగించి ఇండోర్​ శిక్షణ తీసుకుంటున్నట్లు​ సమాచారం.

ipl
ధోనీ

గతేడాది ప్రపంచకప్​ సెమీఫైనల్​లో భారత్​ ఓడిపోయినప్పటి నుంచి క్రికెట్​కు దూరంగా ఉంటున్నాడు టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ మహేంద్రసింగ్​ ధోనీ. ఈ క్రమంలోనే అతని అభిమానులు మళ్లీ ఎప్పుడు మైదానంలో అడుగుపెడతాడా అని ఎదురుచూస్తున్న తరుణంలో.. ఐపీఎల్​తో తీపి కబురు తీసుకొచ్చాడు మహీ. యూఏఈ వేదికగా లీగ్​ నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్న వేళ.. తాజాగా, ధోనీ స్వస్థలం రాంచీలో నెట్​ ప్రాక్టీస్​ మొదలు పెట్టినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

"గతవారం ధోనీ జేఎస్​సీఏ అంతర్జాతీయ మైదానాన్ని సందర్శించాడు. బౌలింగ్​ మిషన్​ను ఉపయోగించి ఇండోర్​ ప్రాక్టీస్​ చేశాడు. అలా రెండు రోజులు ట్రైనింగ్​ తీసుకున్నాడు. ఇక మళ్లీ రాలేదు. శిక్షణకోసం తిరిగి వస్తాడో లేదో అతని ప్రణాళికలేమిటో ఎవ్వరికీ తెలియదు. అయితే, కచ్చితంగా ప్రాక్టీసు కోసం ఇక్కడికి వచ్చాడని మాత్రం చెప్పగలను" అని ఝార్ఖండ్​ క్రికెట్​ అసోసియేషన్​(జేఎస్సీఏ) అధికారి ఒకరు తెలిపారు.

యూఏఈకి బయలుదేరే ముందు సీఎస్కే బృందం చెన్నైలో సమావేశం కానున్నట్లు ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథన్​ స్పష్టం చేశారు. లీగ్​ ప్రారంభించే ముందు.. కనీసం మూడు వారాల పాటు ఆటగాళ్లు శిక్షణలో పాల్గొనేలా సమాలోచనలు చేస్తున్నట్లు వెల్లడించారు.

గతేడాది ప్రపంచకప్​ సెమీఫైనల్​లో భారత్​ ఓడిపోయినప్పటి నుంచి క్రికెట్​కు దూరంగా ఉంటున్నాడు టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ మహేంద్రసింగ్​ ధోనీ. ఈ క్రమంలోనే అతని అభిమానులు మళ్లీ ఎప్పుడు మైదానంలో అడుగుపెడతాడా అని ఎదురుచూస్తున్న తరుణంలో.. ఐపీఎల్​తో తీపి కబురు తీసుకొచ్చాడు మహీ. యూఏఈ వేదికగా లీగ్​ నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్న వేళ.. తాజాగా, ధోనీ స్వస్థలం రాంచీలో నెట్​ ప్రాక్టీస్​ మొదలు పెట్టినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

"గతవారం ధోనీ జేఎస్​సీఏ అంతర్జాతీయ మైదానాన్ని సందర్శించాడు. బౌలింగ్​ మిషన్​ను ఉపయోగించి ఇండోర్​ ప్రాక్టీస్​ చేశాడు. అలా రెండు రోజులు ట్రైనింగ్​ తీసుకున్నాడు. ఇక మళ్లీ రాలేదు. శిక్షణకోసం తిరిగి వస్తాడో లేదో అతని ప్రణాళికలేమిటో ఎవ్వరికీ తెలియదు. అయితే, కచ్చితంగా ప్రాక్టీసు కోసం ఇక్కడికి వచ్చాడని మాత్రం చెప్పగలను" అని ఝార్ఖండ్​ క్రికెట్​ అసోసియేషన్​(జేఎస్సీఏ) అధికారి ఒకరు తెలిపారు.

యూఏఈకి బయలుదేరే ముందు సీఎస్కే బృందం చెన్నైలో సమావేశం కానున్నట్లు ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథన్​ స్పష్టం చేశారు. లీగ్​ ప్రారంభించే ముందు.. కనీసం మూడు వారాల పాటు ఆటగాళ్లు శిక్షణలో పాల్గొనేలా సమాలోచనలు చేస్తున్నట్లు వెల్లడించారు.

Last Updated : Aug 7, 2020, 8:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.