ETV Bharat / sports

తొలి సెషన్​ భారత్​దే.. లంచ్​ విరామానికి 85/2

author img

By

Published : Feb 29, 2020, 7:10 AM IST

Updated : Mar 2, 2020, 10:28 PM IST

కివీస్​తో రెండో టెస్టులో కోహ్లీ సేన నిలకడగా బ్యాటింగ్​ చేస్తోంది. లంచ్​ విరామానికి 2 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది. పుజారా(15), కెప్టెన్​ కోహ్లీ(3) పరుగులతో క్రీజులో ఉన్నారు. ధాటిగా ఆడిన ఓపెనర్​ పృథ్వీ షా 54 పరుగులు చేశాడు. మయాంక్​ 7 పరుగులే చేసి నిరాశ పర్చాడు.

india vs new zealand test: India scored 85/2 at lunch in Christchurch
తొలి సెషన్​ భారత్​దే.. లంచ్​ విరామానికి 85/2

న్యూజిలాండ్​తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్​ నిలకడగా ఆడుతోంది. టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన టీమిండియా.. లంచ్​ విరామానికి 23 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది.

ఆచితూచి ఆడిన ఓపెనర్లు మయాంక్​ అగర్వాల్​(7), పృథ్వీ షా(54) తొలి వికెట్​కు 30 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. మయాంక్​ ఇబ్బందిపడినా.. మరో ఎండ్​లో పృథ్వీ షా చూడచక్కని షాట్​లతో అలరించాడు. చెత్త బంతులను బౌండరీలకు తరలించాడు.

విదేశాల్లో తొలి 'హాఫ్​'

మయాంక్​... ఇన్నింగ్స్​ ఆరో ఓవర్లో బౌల్ట్​ బౌలింగ్​లో ఎల్బీగా వెనుదిరిగాడు​. అగర్వాల్​ ఔటైనా పుజారాతో కలిసి స్కోరు బోర్డును మరింత పరుగులు పెట్టించాడు పృథ్వీషా. వన్డే తరహాలో బ్యాటింగ్​ చేసిన షా.. ఇన్నింగ్స్​లో 8 ఫోర్లు, ఓ సిక్సర్​ బాదేశాడు. ఈ క్రమంలో విదేశాల్లో తన తొలి అర్ధశతకాన్ని నమోదు చేసుకున్నాడు.

రెండో వికెట్​కు పుజారాతో కలిసి 50 పరుగులు జత చేసిన పృథ్వీ.. జేమిసన్​ బౌలింగ్​లో లాథమ్​ అద్భుత క్యాచ్​కు పెవిలియన్​ చేరాడు.

క్రీజులో పుజారా, కోహ్లీ..

ప్రస్తుతం పుజారా 15, కోహ్లీ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. బౌల్ట్​, జేమిసన్​ చెరో వికెట్​ తీశారు. ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో రెండు మార్పులు చేసింది టీమిండియా. ఇశాంత్​ శర్మ స్థానంలో ఉమేశ్​, అశ్విన్​ బదులు జడేజా జట్టులోకి వచ్చారు. న్యూజిలాండ్​లో వాగ్నర్​ చోటు దక్కించుకున్నాడు.

న్యూజిలాండ్​తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్​ నిలకడగా ఆడుతోంది. టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన టీమిండియా.. లంచ్​ విరామానికి 23 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది.

ఆచితూచి ఆడిన ఓపెనర్లు మయాంక్​ అగర్వాల్​(7), పృథ్వీ షా(54) తొలి వికెట్​కు 30 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. మయాంక్​ ఇబ్బందిపడినా.. మరో ఎండ్​లో పృథ్వీ షా చూడచక్కని షాట్​లతో అలరించాడు. చెత్త బంతులను బౌండరీలకు తరలించాడు.

విదేశాల్లో తొలి 'హాఫ్​'

మయాంక్​... ఇన్నింగ్స్​ ఆరో ఓవర్లో బౌల్ట్​ బౌలింగ్​లో ఎల్బీగా వెనుదిరిగాడు​. అగర్వాల్​ ఔటైనా పుజారాతో కలిసి స్కోరు బోర్డును మరింత పరుగులు పెట్టించాడు పృథ్వీషా. వన్డే తరహాలో బ్యాటింగ్​ చేసిన షా.. ఇన్నింగ్స్​లో 8 ఫోర్లు, ఓ సిక్సర్​ బాదేశాడు. ఈ క్రమంలో విదేశాల్లో తన తొలి అర్ధశతకాన్ని నమోదు చేసుకున్నాడు.

రెండో వికెట్​కు పుజారాతో కలిసి 50 పరుగులు జత చేసిన పృథ్వీ.. జేమిసన్​ బౌలింగ్​లో లాథమ్​ అద్భుత క్యాచ్​కు పెవిలియన్​ చేరాడు.

క్రీజులో పుజారా, కోహ్లీ..

ప్రస్తుతం పుజారా 15, కోహ్లీ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. బౌల్ట్​, జేమిసన్​ చెరో వికెట్​ తీశారు. ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో రెండు మార్పులు చేసింది టీమిండియా. ఇశాంత్​ శర్మ స్థానంలో ఉమేశ్​, అశ్విన్​ బదులు జడేజా జట్టులోకి వచ్చారు. న్యూజిలాండ్​లో వాగ్నర్​ చోటు దక్కించుకున్నాడు.

Last Updated : Mar 2, 2020, 10:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.