ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్ 2022కు​ వాయిదా!

author img

By

Published : May 16, 2020, 11:57 AM IST

ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్​ నిర్వహణను 2022కు వాయిదా వేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఐసీసీకి చెందిన ఓ సీనియర్​ అధికారి వెల్లడించారు. ఈ నెల 28న జరగనున్న సమావేశంలో టీ20 భవితవ్యంతో పాటు ఆటగాళ్లు పాటించాల్సిన పలు నియమాలను విడుదల చేయనున్నామని తెలిపారు.

ICC Board members may discuss shifting T20 World Cup to 2022
టీ20 ప్రపంచకప్ 2022కు​ వాయిదా!

ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరులో జరగాల్సిన టీ20 ప్రపంచకప్​ నిర్వహణను 2022కు వాయిదా వేసే అంశాన్ని అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ) పరిశీలిస్తున్నట్లు సమాచారం. కరోనా సంక్షోభం కారణంగా టోర్నీని వాయిదా వేయాల్సిన పరిస్థితి రావచ్చని తెలుస్తోంది. ఈ నెల 28న జరగనున్న సమావేశంలో దీనిపై ఓ నిర్ణయానికి రానున్నట్లు ఐసీసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బంతికి చెమట, ఉమ్మిని రాయడాన్ని నిషేధించడం సహా మరికొన్ని సరికొత్త నియమాలను ప్రకటిస్తామన్నారు.

"ఐసీసీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ముందు మూడు అంశాలు పరిశీలనలో ఉన్నాయి. ఆటగాళ్లను 14 రోజుల నిర్బంధంతో పాటు స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించాలనేది అందులో మొదటి అంశం. ప్రేక్షకులను అనుమతించకుండా టోర్నీ నిర్వహించాలనేది రెండో అంశం. ఇవి కుదరని పక్షంలో టోర్నీని 2022కు వాయిదా వేయడమనేది చివరి అంశం". - ఐసీసీ సీనియర్​ అధికారి

బోర్డు మీటింగ్​లో ప్రస్తుత ఛైర్మన్​ శశాంక్​ మనోహర్​ పదవిని మరో రెండు నెలలు కొనసాగించేలా నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతానికి టీ20 ప్రపంచకప్​ నిర్వహణపైనే ముఖ్యంగా దృష్టిసారించనున్నారు.

ప్రపంచకప్​ వాయిదాపై ఆస్ట్రేలియా నిరాశ చెందడం లేదని ఈ ఏడాది చివర్లో భారత్​తో జరగాల్సిన ద్వైపాక్షిక టెస్టు సిరీస్​పైనే క్రికెట్​ ఆస్ట్రేలియా భారీగా ఆశలు పెట్టుకుందని తెలుస్తోంది. ఆర్థికంగా కోలుకోవడానికి ఈ సిరీస్​ ముఖ్యమని ఆ దేశ క్రికెట్​ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి.. 'అంతర్జాతీయ టోర్నీల్లో భారత అథ్లెట్లు పాల్గొనరు'

ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరులో జరగాల్సిన టీ20 ప్రపంచకప్​ నిర్వహణను 2022కు వాయిదా వేసే అంశాన్ని అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ) పరిశీలిస్తున్నట్లు సమాచారం. కరోనా సంక్షోభం కారణంగా టోర్నీని వాయిదా వేయాల్సిన పరిస్థితి రావచ్చని తెలుస్తోంది. ఈ నెల 28న జరగనున్న సమావేశంలో దీనిపై ఓ నిర్ణయానికి రానున్నట్లు ఐసీసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బంతికి చెమట, ఉమ్మిని రాయడాన్ని నిషేధించడం సహా మరికొన్ని సరికొత్త నియమాలను ప్రకటిస్తామన్నారు.

"ఐసీసీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ముందు మూడు అంశాలు పరిశీలనలో ఉన్నాయి. ఆటగాళ్లను 14 రోజుల నిర్బంధంతో పాటు స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించాలనేది అందులో మొదటి అంశం. ప్రేక్షకులను అనుమతించకుండా టోర్నీ నిర్వహించాలనేది రెండో అంశం. ఇవి కుదరని పక్షంలో టోర్నీని 2022కు వాయిదా వేయడమనేది చివరి అంశం". - ఐసీసీ సీనియర్​ అధికారి

బోర్డు మీటింగ్​లో ప్రస్తుత ఛైర్మన్​ శశాంక్​ మనోహర్​ పదవిని మరో రెండు నెలలు కొనసాగించేలా నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతానికి టీ20 ప్రపంచకప్​ నిర్వహణపైనే ముఖ్యంగా దృష్టిసారించనున్నారు.

ప్రపంచకప్​ వాయిదాపై ఆస్ట్రేలియా నిరాశ చెందడం లేదని ఈ ఏడాది చివర్లో భారత్​తో జరగాల్సిన ద్వైపాక్షిక టెస్టు సిరీస్​పైనే క్రికెట్​ ఆస్ట్రేలియా భారీగా ఆశలు పెట్టుకుందని తెలుస్తోంది. ఆర్థికంగా కోలుకోవడానికి ఈ సిరీస్​ ముఖ్యమని ఆ దేశ క్రికెట్​ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి.. 'అంతర్జాతీయ టోర్నీల్లో భారత అథ్లెట్లు పాల్గొనరు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.