మూడో టీ20లో గెలిచిన ఆస్ట్రేలియా.. వైట్వాష్ నుంచి తప్పించుకుంది. సౌథాంప్టన్లో జరిగిన ఈ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్పై 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే 2-1 తేడాతో ఇంగ్లీష్ జట్టు సిరీస్ సొంతం చేసుకుంది.
మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ20లో తొలుత ఓడి, బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. బెయిర్స్టో(55), మొయిన్ అలీ(23), జో డెన్లీ(29 నాటౌట్) రాణించారు.
![England vs Australia 3rd T20](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8733378_eng-vs-aus-1.jpg)
ఛేదనలో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ బాధ్యతాయుతంగా ఆడారు. కెప్టెన్ ఫించ్ 39, మిచెల్ మార్ష్ 39 నాటౌట్, స్టాయినిస్ 26 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించారు. దీంతో 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది కంగారూ జట్టు. శుక్రవారం నుంచి ఈ రెండు జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా వన్డే సిరీస్ జరగనుంది.