దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 17 నుంచి ప్రారంభంకానున్న అండర్-19 ప్రపంచకప్లో మొత్తం 16 మంది అంపైర్లు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ జాబితాలో ఒకే ఒక్క భారత అంపైర్ చోటు దక్కించుకున్నాడు. అనిల్ చౌదరి ఒక్కడే భారత్ నుంచి అంపైరింగ్ చేయనున్నాడు.
54 ఏళ్ల అనిల్ 20 వన్డేలు, 27 టీ20లకు అంపైరింగ్ చేశాడు. ప్రస్తుతం శ్రీలంక - భారత్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్లోనూ ఇతడే బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇప్పటివరకు అనిల్ రెండు సార్లు అండర్-19 ప్రపంచకప్కు ప్రాతినిధ్యం వహించారు.
ఈ టోర్నీల్లో మొత్తం 19 మ్యాచ్లు నిర్వహిస్తుండగా.. 12 దేశాల నుంచి 16 మంది అంపైర్లను ఎంపిక చేసింది ఐసీసీ. వీరితో పాటు 8 మంది టీవీ అంపైర్లునూ తీసుకుంది. ఈ టోర్నీకి ముగ్గురు మ్యాచ్ రిఫరీలు ఉన్నారు. శ్రీలంక మాజీ ఆటగాడు గ్రేమ్ లాబ్రోయ్, దక్షిణాఫ్రికాకు చెందిన షాహిద్ వాడ్వాల్లా, ఇంగ్లాండ్కు చెందిన ఫిలాండ్ విట్కేస్ను రిఫరీలుగా ఎంపిక చేసింది ఐసీసీ.
ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతోంది టీమిండియా.
ఇదీ చదవండి: కార్టూన్తో 'లియో కార్టర్'కు యువీ స్వాగతం