ETV Bharat / sports

సచిన్ పేరు మీద స్టేడియం.. భాజపా ఎంపీ వెల్లడి

author img

By

Published : Dec 12, 2020, 9:54 PM IST

Updated : Dec 13, 2020, 5:40 PM IST

తన స్వగ్రామంలో సచిన్ పేరు పైన స్టేడియం నిర్మిస్తానని భాజపా ఎంపీ, నటుడు మనోజ్ తివారీ తెలిపారు. ప్రస్తుతం దీని కోసం భూమి సేకరణ జరుగుతుందని అన్నారు.

a stadium will be built on name of Sachin Tendulkar in Kaimur
సచిన్ పేరు మీద స్టేడియం నిర్మాణం

దిగ్గజ సచిన్​ తెందుల్కర్ పేరు మీద స్టేడియం కట్టించేందుకు భాజాపా ఎంపీ మనోజ్ తివారీ సిద్ధమవుతున్నారు. శనివారం తన సొంత ఊరిలో ఓ కార్యక్రమానికి హాజరైన ఈయన.. ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

సచిన్ పేరు మీద స్టేడియం.. భాజపా ఎంపీ వ్యాఖ్య

అసలు ఈ ఆలోచన ఎలా?

2011లో టీమ్ఇండియా వన్డే ప్రపంచకప్​ గెల్చుకుంది. అప్పట్లో భోజ్​పురి నటుడిగా ఉన్న మనోజ్ తివారీ.. ఆ ఆనందంలో తన ఇంటికి దగ్గర్లో సచిన్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఈయన.. తన గ్రామం అథర్వాలియాలో సచిన్ పేరు మీద ఏకంగా ఓ స్టేడియా​న్నే నిర్మించనున్నానని చెప్పారు. ఈ విషయమై ఊరి ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు.

"ప్రస్తుతం స్టేడియం నిర్మాణం కోసం భూమిని సేకరించే పనిలో ఉన్నాం. దీనికోసం 50 బిగాలు అవసరం, కానీ 30 బిగాలు లభ్యమయ్యాయి. మా ఊరిలో పొలాలంటే రైతులకు చాలా ఇష్టం. అలా అని మేం వారిని భూములు ఇవ్వమని ఇబ్బంది పెట్టం. అందుకు ప్రత్నామ్నాయాలు చూస్తున్నాం" -మనోజ్ తివారీ, దిల్లీ ఎంపీ

మరో ఏడాది తన కల నెరవేర్చి స్టేడియం నిర్మిస్తానని ఎంపీ మనోజ్ తివారీ అన్నారు. దీని వల్ల గ్రామ యువతకు ఆటల పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కుతుందని చెప్పారు.

దిగ్గజ సచిన్​ తెందుల్కర్ పేరు మీద స్టేడియం కట్టించేందుకు భాజాపా ఎంపీ మనోజ్ తివారీ సిద్ధమవుతున్నారు. శనివారం తన సొంత ఊరిలో ఓ కార్యక్రమానికి హాజరైన ఈయన.. ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

సచిన్ పేరు మీద స్టేడియం.. భాజపా ఎంపీ వ్యాఖ్య

అసలు ఈ ఆలోచన ఎలా?

2011లో టీమ్ఇండియా వన్డే ప్రపంచకప్​ గెల్చుకుంది. అప్పట్లో భోజ్​పురి నటుడిగా ఉన్న మనోజ్ తివారీ.. ఆ ఆనందంలో తన ఇంటికి దగ్గర్లో సచిన్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఈయన.. తన గ్రామం అథర్వాలియాలో సచిన్ పేరు మీద ఏకంగా ఓ స్టేడియా​న్నే నిర్మించనున్నానని చెప్పారు. ఈ విషయమై ఊరి ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు.

"ప్రస్తుతం స్టేడియం నిర్మాణం కోసం భూమిని సేకరించే పనిలో ఉన్నాం. దీనికోసం 50 బిగాలు అవసరం, కానీ 30 బిగాలు లభ్యమయ్యాయి. మా ఊరిలో పొలాలంటే రైతులకు చాలా ఇష్టం. అలా అని మేం వారిని భూములు ఇవ్వమని ఇబ్బంది పెట్టం. అందుకు ప్రత్నామ్నాయాలు చూస్తున్నాం" -మనోజ్ తివారీ, దిల్లీ ఎంపీ

మరో ఏడాది తన కల నెరవేర్చి స్టేడియం నిర్మిస్తానని ఎంపీ మనోజ్ తివారీ అన్నారు. దీని వల్ల గ్రామ యువతకు ఆటల పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కుతుందని చెప్పారు.

Last Updated : Dec 13, 2020, 5:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.