ETV Bharat / sports

Ind vs Sl T20 Series: టీమ్​ఇండియాలో మరో ఇద్దరికి కరోనా

author img

By

Published : Jul 30, 2021, 1:19 PM IST

కృనాల్​ పాండ్యాకు కరోనా సోకిన 3 రోజులకు.. అక్కడే ఉన్న భారత జట్టులోని మరో ఇద్దరికి కరోనా సోకింది. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

CHAHAL GOWTHAM CORONA
చాహల్​, గౌతమ్​ కరోనా

శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టులోని స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్​, కృష్ణప్ప గౌతమ్​లకూ కరోనా సోకింది. కృనాల్​ పాండ్యాకు కొవిడ్​ పాజిటివ్​గా తేలిన 3 రోజులకు ఈ విషయం బయటకొచ్చింది.

''దురదృష్టవశాత్తు చాహల్​, గౌతమ్​లకు కరోనా సోకింది. వారు కృనాల్​తో సన్నిహితంగా ఉన్నారు. ప్రస్తుతం లంకలో హోటల్​లో ఉన్న మిగతా జట్టు సభ్యులకు వీరు దూరంగానే ఉన్నారు.''

- అధికారిక​ వర్గాలు.

ఈ నెల 27న శ్రీలంకతో జరగాల్సిన రెండో టీ20కి ముందు.. టీమ్​ ఇండియాలోని కృనాల్​ పాండ్యాకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. అతనితో సన్నిహితంగా ఉన్న పృథ్వీ షా, సూర్యకుమార్​ యాదవ్​, హార్దిక్​ పాండ్య, యుజ్వేంద్ర చాహల్​, దీపక్​ చాహర్​, మనీశ్​ పాండే, ఇషాన్​ కిషన్​, కృష్ణప్ప గౌతమ్​లనూ ఐసోలేషన్​లో ఉంచారు. వీరంతా సిరీస్​కు దూరమయ్యారు.

స్వ్కాడ్​లో ఎక్కువమంది ఉన్న కారణంగా.. ఒక బ్యాట్స్​మెన్​ను తగ్గించుకుని అందరికీ మిగతా టీ-20 మ్యాచ్​లకు అవకాశం వచ్చింది. నెట్​బౌలర్లను కూడా టీంలో చేర్చారు. అయితే.. అనుభవలేమి, ఒత్తిడి కారణంగా అంతలా ఆకట్టుకోలేకపోయారు. చివరి రెండు టీ-20ల్లో ఓడి.. సిరీస్​ కోల్పోయింది టీమ్​ ఇండియా.

అంతకుముందు వన్డే సిరీస్​ను 2-1 తేడాతో నెగ్గింది మెన్​ ఇన్​ బ్లూ.

ఇవీ చదవండి: IND VS SL: మూడో టీ20లో లంక విజయం.. సిరీస్​ కైవసం

21వ ప్రయత్నంలో లంక సక్సెస్​- భారత్​ వరుస విజయాలకు బ్రేక్​

శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టులోని స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్​, కృష్ణప్ప గౌతమ్​లకూ కరోనా సోకింది. కృనాల్​ పాండ్యాకు కొవిడ్​ పాజిటివ్​గా తేలిన 3 రోజులకు ఈ విషయం బయటకొచ్చింది.

''దురదృష్టవశాత్తు చాహల్​, గౌతమ్​లకు కరోనా సోకింది. వారు కృనాల్​తో సన్నిహితంగా ఉన్నారు. ప్రస్తుతం లంకలో హోటల్​లో ఉన్న మిగతా జట్టు సభ్యులకు వీరు దూరంగానే ఉన్నారు.''

- అధికారిక​ వర్గాలు.

ఈ నెల 27న శ్రీలంకతో జరగాల్సిన రెండో టీ20కి ముందు.. టీమ్​ ఇండియాలోని కృనాల్​ పాండ్యాకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. అతనితో సన్నిహితంగా ఉన్న పృథ్వీ షా, సూర్యకుమార్​ యాదవ్​, హార్దిక్​ పాండ్య, యుజ్వేంద్ర చాహల్​, దీపక్​ చాహర్​, మనీశ్​ పాండే, ఇషాన్​ కిషన్​, కృష్ణప్ప గౌతమ్​లనూ ఐసోలేషన్​లో ఉంచారు. వీరంతా సిరీస్​కు దూరమయ్యారు.

స్వ్కాడ్​లో ఎక్కువమంది ఉన్న కారణంగా.. ఒక బ్యాట్స్​మెన్​ను తగ్గించుకుని అందరికీ మిగతా టీ-20 మ్యాచ్​లకు అవకాశం వచ్చింది. నెట్​బౌలర్లను కూడా టీంలో చేర్చారు. అయితే.. అనుభవలేమి, ఒత్తిడి కారణంగా అంతలా ఆకట్టుకోలేకపోయారు. చివరి రెండు టీ-20ల్లో ఓడి.. సిరీస్​ కోల్పోయింది టీమ్​ ఇండియా.

అంతకుముందు వన్డే సిరీస్​ను 2-1 తేడాతో నెగ్గింది మెన్​ ఇన్​ బ్లూ.

ఇవీ చదవండి: IND VS SL: మూడో టీ20లో లంక విజయం.. సిరీస్​ కైవసం

21వ ప్రయత్నంలో లంక సక్సెస్​- భారత్​ వరుస విజయాలకు బ్రేక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.