ETV Bharat / sports

'మరీ అంత ఘోరమా.. స్లెడ్జింగ్​, అంపైరింగ్​పై ఐసీసీకి ఫిర్యాదు!'

author img

By

Published : Apr 5, 2022, 7:50 AM IST

Bangladesh Complaint ICC: సౌతాఫ్రికాతో తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైంది బంగ్లాదేశ్​. రెండో ఇన్నింగ్స్​లో దారుణంగా 53 పరుగులకే ఆలౌటైంది. అయితే.. ఈ మ్యాచ్​లో అంపైరింగ్​పై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై ఐసీసీని ఆశ్రయించనున్నట్లు బంగ్లాదేశ్​ బోర్డు పేర్కొంది. వన్డే సిరీస్​కు సంబంధించి ఇప్పటికే ఫిర్యాదు నమోదుచేసినట్లు తెలిపింది.

Bangladesh to lodge official complaint about sledging
Bangladesh to lodge official complaint about sledging

Bangladesh Complaint ICC: బంగ్లాదేశ్​- సౌతాఫ్రికా మధ్య డర్బన్​లో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ప్రొటీస్​ జట్టు గెలుపొందింది. బంగ్లాదేశ్​ రెండో ఇన్నింగ్స్​ 53 పరుగులకే ఆలౌటై దారుణ పరాజయాన్ని ఎదుర్కొంది. అయితే.. ఈ మ్యాచ్​లో అంపైరింగ్​ తప్పుడు నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనిపై అంతర్జాతీయ క్రికెట్​ కౌన్సిల్​ను​(ఐసీసీ) ఆశ్రయించనున్నట్లు బంగ్లాదేశ్​ క్రికెట్​ బోర్డు(బీసీబీ) తెలిపింది. మైదానంలో తమ ఫిర్యాదులను కూడా అంపైర్లు పట్టించుకోలేదని బోర్డు ఆరోపించింది. వన్డే సిరీస్​కు సంబంధించి ఇప్పటికే రాతపూర్వక ఫిర్యాదు చేసినట్లు బీసీబీ క్రికెట్​ వ్యవహారాల హెడ్​ జలాల్​ యూనస్​ వెల్లడించాడు. మ్యాచ్​ అంపైర్లు.. బంగ్లాదేశ్​ టీమ్​ మేనేజర్​ నఫీజ్​ ఇక్బాల్​ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని అన్నాడు. టెస్టు మ్యాచ్​కు సంబంధించి కూడా ఇప్పుడు ఐసీసీకి అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు వివరించాడు.

''మ్యాచ్​ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్​.. మా మేనేజర్​ నఫీజ్​ ఇక్బాల్​తో అనుచితంగా ప్రవర్తించాడు. మేం దీనిపై లిఖితపూర్వత ఫిర్యాదు చేశాం. ఇప్పుడు టెస్టు మ్యాచ్​పై కూడా ఐసీసీకి వెళ్తాం. స్లెడ్జింగ్​ రెండువైపులా ఉంది. కానీ ఎక్కడ మొదలైంది. అంపైరింగ్​ తప్పుడు నిర్ణయాలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావు. దీనిని మేం ఖండిస్తున్నాం. అంపైర్ల నిర్ణయాలను మేం అంగీకరిస్తాం. కానీ తటస్థ అంపైర్లను మళ్లీ తేవాల్సిందే.''

- జలాల్​ యూనస్​, బంగ్లా క్రికెట్​ బోర్డు హెడ్​

కరోనా వెలుగులోకి వచ్చిన అనంతరం.. అంపైర్ల భద్రత గురించి ఆలోచించిన ఐసీసీ తటస్థ అంపైర్లను ఎంపిక చేయట్లేదు. ఈ నేపథ్యంలో మరోసారి తటస్థ అంపైర్ల అంశం వెలుగులోకి వచ్చింది. అంపైరింగ్​ నిర్ణయాలు సరైనవిగా ఉండాలంటే.. తటస్థ అంపైర్లను నియమించాలని పలువురు పట్టుబడుతున్నారు. తొలి టెస్టులో బంగ్లాదేశ్​పై 220 పరుగుల తేడాతో గెలిచింది సౌతాఫ్రికా. రెండో ఇన్నింగ్స్​లో 7 వికెట్లతో చెలరేగిన స్పిన్నర్​ కేశవ్​ మహరాజ్​కు మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు దక్కింది.

Bangladesh to lodge official complaint about sledging
అంపైరింగ్​పై బంగ్లా ఆల్​రౌండర్​ షకిబ్​ అల్​ హసన్​ ట్వీట్​

ఇవీ చూడండి: ప్రపంచ ఛాంపియన్​కు షాక్​

ఈ కిక్​బాక్సర్​ పంచ్​లకే కాదు.. పరువాలకూ పతకాలివ్వాలేమో!

Bangladesh Complaint ICC: బంగ్లాదేశ్​- సౌతాఫ్రికా మధ్య డర్బన్​లో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ప్రొటీస్​ జట్టు గెలుపొందింది. బంగ్లాదేశ్​ రెండో ఇన్నింగ్స్​ 53 పరుగులకే ఆలౌటై దారుణ పరాజయాన్ని ఎదుర్కొంది. అయితే.. ఈ మ్యాచ్​లో అంపైరింగ్​ తప్పుడు నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనిపై అంతర్జాతీయ క్రికెట్​ కౌన్సిల్​ను​(ఐసీసీ) ఆశ్రయించనున్నట్లు బంగ్లాదేశ్​ క్రికెట్​ బోర్డు(బీసీబీ) తెలిపింది. మైదానంలో తమ ఫిర్యాదులను కూడా అంపైర్లు పట్టించుకోలేదని బోర్డు ఆరోపించింది. వన్డే సిరీస్​కు సంబంధించి ఇప్పటికే రాతపూర్వక ఫిర్యాదు చేసినట్లు బీసీబీ క్రికెట్​ వ్యవహారాల హెడ్​ జలాల్​ యూనస్​ వెల్లడించాడు. మ్యాచ్​ అంపైర్లు.. బంగ్లాదేశ్​ టీమ్​ మేనేజర్​ నఫీజ్​ ఇక్బాల్​ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని అన్నాడు. టెస్టు మ్యాచ్​కు సంబంధించి కూడా ఇప్పుడు ఐసీసీకి అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు వివరించాడు.

''మ్యాచ్​ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్​.. మా మేనేజర్​ నఫీజ్​ ఇక్బాల్​తో అనుచితంగా ప్రవర్తించాడు. మేం దీనిపై లిఖితపూర్వత ఫిర్యాదు చేశాం. ఇప్పుడు టెస్టు మ్యాచ్​పై కూడా ఐసీసీకి వెళ్తాం. స్లెడ్జింగ్​ రెండువైపులా ఉంది. కానీ ఎక్కడ మొదలైంది. అంపైరింగ్​ తప్పుడు నిర్ణయాలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావు. దీనిని మేం ఖండిస్తున్నాం. అంపైర్ల నిర్ణయాలను మేం అంగీకరిస్తాం. కానీ తటస్థ అంపైర్లను మళ్లీ తేవాల్సిందే.''

- జలాల్​ యూనస్​, బంగ్లా క్రికెట్​ బోర్డు హెడ్​

కరోనా వెలుగులోకి వచ్చిన అనంతరం.. అంపైర్ల భద్రత గురించి ఆలోచించిన ఐసీసీ తటస్థ అంపైర్లను ఎంపిక చేయట్లేదు. ఈ నేపథ్యంలో మరోసారి తటస్థ అంపైర్ల అంశం వెలుగులోకి వచ్చింది. అంపైరింగ్​ నిర్ణయాలు సరైనవిగా ఉండాలంటే.. తటస్థ అంపైర్లను నియమించాలని పలువురు పట్టుబడుతున్నారు. తొలి టెస్టులో బంగ్లాదేశ్​పై 220 పరుగుల తేడాతో గెలిచింది సౌతాఫ్రికా. రెండో ఇన్నింగ్స్​లో 7 వికెట్లతో చెలరేగిన స్పిన్నర్​ కేశవ్​ మహరాజ్​కు మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు దక్కింది.

Bangladesh to lodge official complaint about sledging
అంపైరింగ్​పై బంగ్లా ఆల్​రౌండర్​ షకిబ్​ అల్​ హసన్​ ట్వీట్​

ఇవీ చూడండి: ప్రపంచ ఛాంపియన్​కు షాక్​

ఈ కిక్​బాక్సర్​ పంచ్​లకే కాదు.. పరువాలకూ పతకాలివ్వాలేమో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.