ETV Bharat / sitara

ఆమిర్​ 'పీకే' సీక్వెల్​ వచ్చేది అప్పుడే - aamir pk sequel

బాలీవుడ్​ స్టార్​ హీరో ఆమిర్​ఖాన్​ ప్రధాన పాత్రలో వచ్చిన 'పీకే' సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్​ కచ్చితంగా ఉంటుందని చెప్పారు నిర్మాత విధు వినోద్​ చోప్రా, దర్శకుడు రాజ్​కుమార్ హిరానీ​. కానీ ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేమని వెల్లడించారు.

pk
పీకే
author img

By

Published : Feb 21, 2021, 5:31 AM IST

2014లో బాలీవుడ్​ మిస్టర్​ పర్ఫెక్షనిస్ట్​ ఆమిర్‌ఖాన్‌ నటించిన 'పీకే' సినిమా ఏ రేంజ్​లో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రం ప్రతి సినీప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్​ వస్తుందని అప్పట్లో అందరూ భావించారు. ఎందుకంటే క్లైమాక్స్​లో తన గ్రహానికి తిరిగి వెళ్లిపోయిన ఆమిర్.. రణ్‌బీర్ కపూర్​తో కలిసి మళ్లీ భూమి మీదకు వస్తాడు. అంతటితో సినిమా ముగుస్తుంది. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా కొనసాగింపు​ గురించి ఎటువంటి అప్​డేట్​ రాలేదు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిత్ర నిర్మాత విధు వినోద్​ చోప్రా.. ఈ విషయమై స్పందించారు. తప్పకుండా 'పీకే' సీక్వెల్​ ఉంటుందని స్పష్టతనిచ్చారు. "ఈ సినిమాకు కొనసాగింపు కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మేము సినిమాను అలానే ముగించాం. అయితే ఈ సీక్వెల్ ఎప్పుడు వస్తుందనేది చెప్పలేను. కథ సిద్ధమయితే చిత్రాన్ని రూపొందిస్తాం. అయితే ఈ కథ రచయిత ఇంకా స్క్పిప్టును రాయలేదు. అతడు ఎప్పుడు కథ రాయడం ముగిస్తే ఆ రోజు చిత్రాన్ని తెరకెక్కిస్తాం." అని అన్నారు. దర్శకుడు రాజ్​కుమార్ హిరానీ​ కూడా ఈ సినిమాకు సీక్వెల్ పక్కాగా​ ఉంటుందని చెప్పారు. ఇందులో రణ్​బీర్​ కపూర్​ ప్రధాన పాత్ర పోషించే అవకాశముంది.

2014లో బాలీవుడ్​ మిస్టర్​ పర్ఫెక్షనిస్ట్​ ఆమిర్‌ఖాన్‌ నటించిన 'పీకే' సినిమా ఏ రేంజ్​లో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రం ప్రతి సినీప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్​ వస్తుందని అప్పట్లో అందరూ భావించారు. ఎందుకంటే క్లైమాక్స్​లో తన గ్రహానికి తిరిగి వెళ్లిపోయిన ఆమిర్.. రణ్‌బీర్ కపూర్​తో కలిసి మళ్లీ భూమి మీదకు వస్తాడు. అంతటితో సినిమా ముగుస్తుంది. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా కొనసాగింపు​ గురించి ఎటువంటి అప్​డేట్​ రాలేదు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిత్ర నిర్మాత విధు వినోద్​ చోప్రా.. ఈ విషయమై స్పందించారు. తప్పకుండా 'పీకే' సీక్వెల్​ ఉంటుందని స్పష్టతనిచ్చారు. "ఈ సినిమాకు కొనసాగింపు కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మేము సినిమాను అలానే ముగించాం. అయితే ఈ సీక్వెల్ ఎప్పుడు వస్తుందనేది చెప్పలేను. కథ సిద్ధమయితే చిత్రాన్ని రూపొందిస్తాం. అయితే ఈ కథ రచయిత ఇంకా స్క్పిప్టును రాయలేదు. అతడు ఎప్పుడు కథ రాయడం ముగిస్తే ఆ రోజు చిత్రాన్ని తెరకెక్కిస్తాం." అని అన్నారు. దర్శకుడు రాజ్​కుమార్ హిరానీ​ కూడా ఈ సినిమాకు సీక్వెల్ పక్కాగా​ ఉంటుందని చెప్పారు. ఇందులో రణ్​బీర్​ కపూర్​ ప్రధాన పాత్ర పోషించే అవకాశముంది.

ఇదీ చూడండి: ఒక్క సినిమా కోసం 10 వేల కిళ్లీలు తిన్న ఆమిర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.