'సాహో'తో ఆకట్టుకున్న డార్లింగ్ హీరో ప్రభాస్.. ప్రస్తుతం ఓ త్రిభాషా చిత్రం చేస్తున్నాడు. 'జిల్' వంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ను అందించిన కె.కె. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఇటలీలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. వచ్చే నెల హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. అందుకోసం భారీ సెట్ను రూపొందిస్తున్నారని సమాచారం.
ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. జాన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అమిత్ త్రివేది స్వరాలు సమకూర్చుతున్నాడు. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి : హీరో మంచు మనోజ్ కొత్త ప్రయాణం మొదలు..!