ETV Bharat / sitara

థియేటర్లు రీ ఓపెన్.. 74 శాతం మంది వెళ్లనంటున్నారు! - theatre latest news

దేశవ్యాప్తంగా నిర్వహించిన ఓ సర్వేలో ఆసక్తికర నిజాలు బయటకొచ్చాయి. రానున్న రెండు నెలల్లో థియేటర్లకు వెళ్లేది 10 శాతం లోపే అని తేలింది. కరోనా ప్రభావం ఇంకా ఉండటం వల్ల ఇంట్లోనే వినోదాన్ని(టీవీ, మొబైల్​లో) ఆస్వాదిస్తామని అంటున్నారు.

థియేటర్లు రీ ఓపెన్.. 74 శాతం మంది వెళ్లనంటున్నారు!
Only 7 percent plan on visiting cinema halls soon, says survey
author img

By

Published : Oct 26, 2020, 7:29 PM IST

Updated : Oct 26, 2020, 7:35 PM IST

అన్​లాక్ 5.0 ప్రక్రియలో భాగంగా గతనెలలో సినిమా థియేటర్లు తెరుచుకున్నాయి. కానీ ప్రజలు మాత్రం వెళ్లాలా? వద్దా? అనే ఆలోచనతో ఇంకా ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ సర్వేలో జరపగా, కేవలం ఏడు శాతం మంది మాత్రమే హాల్​కు వెళ్లి సినిమా చూడాలనే ఆసక్తి చూపారు!

ఏడు నెలల తర్వాత తెరుచుకున్నా సరే..

కరోనా ప్రభావంతో మార్చి మూడో వారంలో దేశవ్యాప్తంగా థియేటర్లను మూసేశారు. అన్​లాక్ ప్రక్రియలో భాగంగా సెప్టెంబరు 15 నుంచి తెరుచుకోవచ్చని ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో పలు రాష్ట్రాలో నిబంధనలు పాటిస్తూనే వాటిని తెరిచారు. జనాలు మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నారు.

cinema halls
థియేటర్లలో భౌతిక దూరం పాటిస్తూ కూర్చున్నప్రేక్షకులు

ఏడు శాతం మందే

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిపిన సర్వేలో భాగంగా 'రానున్న రెండు నెలలో థియేటర్లకు వెళ్తారా?' అని 8274 మంది నుంచి అభిప్రాయాల్ని సేకరించారు.

cinema halls
థియేటర్​లో ప్రేక్షకులు(పాత చిత్రం)

ఏదైనా కొత్త సినిమా విడుదలైతే వెళ్తామని 4 శాతం మంది చెప్పగా, కొత్త పాతతో సంబంధం లేకుండా థియేటర్​కు వెళ్తామని 3 శాతం మంది అన్నారు. 74 శాతం వెళ్లమని, 2 శాతం ఆలోచిస్తామని, 17 శాతం మంది మాత్రం థియేటర్​లో సినిమా చూడాలనుకోవట్లేదని వెల్లడించారు.

ప్రేక్షకుల ఆరోగ్యమే మా ధ్యేయం

ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం సీటు సీటుకు మధ్య దూరం, షో టైమింగ్స్​లో మార్పు, థర్మల్ స్క్రీనింగ్, భౌతిక దూరం పాటిస్తున్నట్లు పలు థియేటర్ల యాజమాన్యాలు తెలిపాయి. ప్రేక్షకుల ఆరోగ్యమే తమ ధ్యేయమని అంటున్నాయి.

cinema halls
థియేటర్​ను శానిటైజేషన్ చేస్తున్న సిబ్బంది

దిల్లీ, హరియాణా, ఉత్తర్​ప్రదేశ్, పశ్చిమ బంగాల్, మధ్య ప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో థియేటర్లు తెరుచుకోగా.. మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, చత్తీస్​ఘడ్, ఈశాన్య రాష్ట్రాల్లో ఇంకా వాటిని ఓపెన్ చేయలేదు.

ఇవీ చదవండి:

అన్​లాక్ 5.0 ప్రక్రియలో భాగంగా గతనెలలో సినిమా థియేటర్లు తెరుచుకున్నాయి. కానీ ప్రజలు మాత్రం వెళ్లాలా? వద్దా? అనే ఆలోచనతో ఇంకా ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ సర్వేలో జరపగా, కేవలం ఏడు శాతం మంది మాత్రమే హాల్​కు వెళ్లి సినిమా చూడాలనే ఆసక్తి చూపారు!

ఏడు నెలల తర్వాత తెరుచుకున్నా సరే..

కరోనా ప్రభావంతో మార్చి మూడో వారంలో దేశవ్యాప్తంగా థియేటర్లను మూసేశారు. అన్​లాక్ ప్రక్రియలో భాగంగా సెప్టెంబరు 15 నుంచి తెరుచుకోవచ్చని ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో పలు రాష్ట్రాలో నిబంధనలు పాటిస్తూనే వాటిని తెరిచారు. జనాలు మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నారు.

cinema halls
థియేటర్లలో భౌతిక దూరం పాటిస్తూ కూర్చున్నప్రేక్షకులు

ఏడు శాతం మందే

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిపిన సర్వేలో భాగంగా 'రానున్న రెండు నెలలో థియేటర్లకు వెళ్తారా?' అని 8274 మంది నుంచి అభిప్రాయాల్ని సేకరించారు.

cinema halls
థియేటర్​లో ప్రేక్షకులు(పాత చిత్రం)

ఏదైనా కొత్త సినిమా విడుదలైతే వెళ్తామని 4 శాతం మంది చెప్పగా, కొత్త పాతతో సంబంధం లేకుండా థియేటర్​కు వెళ్తామని 3 శాతం మంది అన్నారు. 74 శాతం వెళ్లమని, 2 శాతం ఆలోచిస్తామని, 17 శాతం మంది మాత్రం థియేటర్​లో సినిమా చూడాలనుకోవట్లేదని వెల్లడించారు.

ప్రేక్షకుల ఆరోగ్యమే మా ధ్యేయం

ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం సీటు సీటుకు మధ్య దూరం, షో టైమింగ్స్​లో మార్పు, థర్మల్ స్క్రీనింగ్, భౌతిక దూరం పాటిస్తున్నట్లు పలు థియేటర్ల యాజమాన్యాలు తెలిపాయి. ప్రేక్షకుల ఆరోగ్యమే తమ ధ్యేయమని అంటున్నాయి.

cinema halls
థియేటర్​ను శానిటైజేషన్ చేస్తున్న సిబ్బంది

దిల్లీ, హరియాణా, ఉత్తర్​ప్రదేశ్, పశ్చిమ బంగాల్, మధ్య ప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో థియేటర్లు తెరుచుకోగా.. మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, చత్తీస్​ఘడ్, ఈశాన్య రాష్ట్రాల్లో ఇంకా వాటిని ఓపెన్ చేయలేదు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 26, 2020, 7:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.