ETV Bharat / sitara

సీబీఐకి సుశాంత్ కేసు.. సుప్రీంకు చెప్పిన కేంద్రం

author img

By

Published : Aug 5, 2020, 12:41 PM IST

బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపింది.

సీబీఐకి సుశాంత్ కేసు.. సుప్రీంకు చెప్పిన కేంద్రం
సుశాంత్ సింగ్ రాజ్​పుత్

బిహార్ ప్రభుత్వం విజ్ఞప్తిని కేంద్రం అంగీకరించింది. సుశాంత్ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు సుప్రీంకోర్టుకు బుధవారం సమాచారమిచ్చింది. ఇదే విషయాన్ని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం నటుడి మరణం వెనుకున్న నిజం బయటకు రావాలని అభిప్రాయపడింది.

దీనితో పాటే పట్నాలో తనపై వేసిన పిటిషన్​ను ముంబయికి మార్చాలని కోరిన రియా విజ్ఞప్తిని సుప్రీం కోర్టు పరిశీలిస్తోంది.

Sushant Singh Rajput- Riya chakravarthi
సుశాంత్ సింగ్-రియా చక్రవర్తి

జూన్ 14న బాంద్రాలోని తన సొంత ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు సుశాంత్. అప్పటి నుంచి ముంబయి పోలీసులు రకరకాల కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ నటుడి స్నేహితులు, కుటుంబ సభ్యులతో పాటు పలువురిని ప్రశ్నించారు.

బిహార్ ప్రభుత్వం విజ్ఞప్తిని కేంద్రం అంగీకరించింది. సుశాంత్ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు సుప్రీంకోర్టుకు బుధవారం సమాచారమిచ్చింది. ఇదే విషయాన్ని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం నటుడి మరణం వెనుకున్న నిజం బయటకు రావాలని అభిప్రాయపడింది.

దీనితో పాటే పట్నాలో తనపై వేసిన పిటిషన్​ను ముంబయికి మార్చాలని కోరిన రియా విజ్ఞప్తిని సుప్రీం కోర్టు పరిశీలిస్తోంది.

Sushant Singh Rajput- Riya chakravarthi
సుశాంత్ సింగ్-రియా చక్రవర్తి

జూన్ 14న బాంద్రాలోని తన సొంత ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు సుశాంత్. అప్పటి నుంచి ముంబయి పోలీసులు రకరకాల కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ నటుడి స్నేహితులు, కుటుంబ సభ్యులతో పాటు పలువురిని ప్రశ్నించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.