బిహార్ ప్రభుత్వం విజ్ఞప్తిని కేంద్రం అంగీకరించింది. సుశాంత్ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు సుప్రీంకోర్టుకు బుధవారం సమాచారమిచ్చింది. ఇదే విషయాన్ని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం నటుడి మరణం వెనుకున్న నిజం బయటకు రావాలని అభిప్రాయపడింది.
సీబీఐకి సుశాంత్ కేసు.. సుప్రీంకు చెప్పిన కేంద్రం
బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపింది.
![సీబీఐకి సుశాంత్ కేసు.. సుప్రీంకు చెప్పిన కేంద్రం సీబీఐకి సుశాంత్ కేసు.. సుప్రీంకు చెప్పిన కేంద్రం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8301294-1028-8301294-1596610999141.jpg?imwidth=3840)
దీనితో పాటే పట్నాలో తనపై వేసిన పిటిషన్ను ముంబయికి మార్చాలని కోరిన రియా విజ్ఞప్తిని సుప్రీం కోర్టు పరిశీలిస్తోంది.
![Sushant Singh Rajput- Riya chakravarthi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rhea-locate_0108newsroom_1596294152_868.jpg)
జూన్ 14న బాంద్రాలోని తన సొంత ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు సుశాంత్. అప్పటి నుంచి ముంబయి పోలీసులు రకరకాల కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ నటుడి స్నేహితులు, కుటుంబ సభ్యులతో పాటు పలువురిని ప్రశ్నించారు.
బిహార్ ప్రభుత్వం విజ్ఞప్తిని కేంద్రం అంగీకరించింది. సుశాంత్ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు సుప్రీంకోర్టుకు బుధవారం సమాచారమిచ్చింది. ఇదే విషయాన్ని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం నటుడి మరణం వెనుకున్న నిజం బయటకు రావాలని అభిప్రాయపడింది.
దీనితో పాటే పట్నాలో తనపై వేసిన పిటిషన్ను ముంబయికి మార్చాలని కోరిన రియా విజ్ఞప్తిని సుప్రీం కోర్టు పరిశీలిస్తోంది.
![Sushant Singh Rajput- Riya chakravarthi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rhea-locate_0108newsroom_1596294152_868.jpg)
జూన్ 14న బాంద్రాలోని తన సొంత ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు సుశాంత్. అప్పటి నుంచి ముంబయి పోలీసులు రకరకాల కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ నటుడి స్నేహితులు, కుటుంబ సభ్యులతో పాటు పలువురిని ప్రశ్నించారు.