ETV Bharat / science-and-technology

ఆండ్రాయిడ్ యూజర్లూ.. బ్లాక్​రాక్​ మాల్వేర్​తో భద్రం

ఆండ్రాయిడ్​ ఓఎస్​ లక్ష్యంగా చేసుకుని 'బ్లాక్​రాక్​' మాల్వేర్​ యూజర్ల సున్నితమైన డేటాను దొంగిలిస్తున్నట్లు సైబర్​ నిపుణులు గుర్తించారు. క్రెడిట్​ కార్డుల వివరాలు, సామాజిక మాధ్యమ యాప్​లలో డేటా చోరీకి ఈ మాల్వేర్​ను సైబర్ నేరగాళ్లు వినియోగిస్తున్నట్లు హెచ్చరిస్తున్నారు.

author img

By

Published : Jul 23, 2020, 1:53 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

careful with Blackrock
బ్లాక్​రాక్​ మాల్వేర్​తో జర భద్రం

సైబర్​ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆండ్రాయిడ్ ఓఎస్​ లక్ష్యంగా 'బ్లాక్​రాక్​' అనే కొత్త మాల్వేర్​ దాడులు చేస్తున్నట్లు సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

'బ్లాక్​రాక్​'ను మొదట మొబైల్ సెక్యూరిటీ సంస్థ 'థ్రెట్​ఫాబ్రిక్' మేలో గుర్తించింది.

ఎలా చొరబడుతుంది?

మీ ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్ యాప్స్​ అప్​డేట్​ చేసుకోమని తప్పుడు సందేశాలు పంపిస్తుంటారు సైబర్ నేరగాళ్లు. ఆ సందేశంలో ఉండే లింక్​ క్లిక్​ చేస్తే.. మాల్వేర్​ ఫోన్లోకి ప్రవేశిస్తుంది.

ఈ మాల్వేర్ ఫోన్లోకి ఒక్కసారి ఇన్​స్టాల్ అయ్యిందంటే డేటాను తస్కరించగలదని నిపుణులు అంటున్నారు. ఈ మాల్వేర్ ఆండ్రాయిడ్ సిస్టమ్​లోకి ప్రవేశించాక.. దానంతట అదే కావల్సిన అనుమతులు తీసుకుంటుంది. దీనితో ఆయా డివైజ్​లలోని సున్నితమైన డేటాను సులభంగా యాక్సెస్​ చేయగలుగుతుందని తెలిపారు.

వేటికి ముప్పు..

బ్లాక్​రాక్​ మాల్వేర్ క్రెడిట్ కార్డుల వివరాలతో పాటు సామాజిక మధ్యమాలైన ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్, స్కైప్, స్నాప్​చాట్, ట్విట్టర్ వంటి వాటి యాప్​లపై దాడి చేస్తున్నట్లు గుర్తించారు నిపుణులు. మొత్తం 337 వేరువేరు యాప్​లను ఈ మాల్వేర్ లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించారు. ఇంకా చాలా యాప్​లు ఈ మాల్వేర్​ లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించలేదని కూడా అనుమానం వ్యక్తం చేసుతున్నారు.

బ్లాక్​రాక్​ నుంచి రక్షణ ఎలా?

ఎప్పటికప్పుడు ఆండ్రాయిడ్ ఓఎస్​ను, యాప్స్​ను అప్​డేట్ చేసుకోవాలి. మొబైల్ ఫోన్లలో గుర్తింపు పొందిన యాంటీవైరస్​ టూల్స్ మాత్రమే వినియోగించాలి. యాప్​లకు అనవసర అనుమతులు ఇవ్వొద్దు. రక్షణ లేని థర్డ్ పార్టీ యాప్స్​ను డౌన్​లోడ్ చేసుకోవద్దని సైబర్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్​ ఇండియా ఛైర్మన్ ప్రొఫెసర్ ఎన్​.కె.గోయల్ సూచిస్తున్నారు.

మాల్వేర్​లు చూపించే మాయలో పడి భద్రత లేని యాప్​లు డౌన్​లోడ్​ చేసుకుంటే భారీ మూల్యం చెల్లిచుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి:'కేవైసీ అప్​డేట్​ అంటూ ఫోన్.. నిజమో కాదో తెలుసుకోండి'

సైబర్​ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆండ్రాయిడ్ ఓఎస్​ లక్ష్యంగా 'బ్లాక్​రాక్​' అనే కొత్త మాల్వేర్​ దాడులు చేస్తున్నట్లు సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

'బ్లాక్​రాక్​'ను మొదట మొబైల్ సెక్యూరిటీ సంస్థ 'థ్రెట్​ఫాబ్రిక్' మేలో గుర్తించింది.

ఎలా చొరబడుతుంది?

మీ ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్ యాప్స్​ అప్​డేట్​ చేసుకోమని తప్పుడు సందేశాలు పంపిస్తుంటారు సైబర్ నేరగాళ్లు. ఆ సందేశంలో ఉండే లింక్​ క్లిక్​ చేస్తే.. మాల్వేర్​ ఫోన్లోకి ప్రవేశిస్తుంది.

ఈ మాల్వేర్ ఫోన్లోకి ఒక్కసారి ఇన్​స్టాల్ అయ్యిందంటే డేటాను తస్కరించగలదని నిపుణులు అంటున్నారు. ఈ మాల్వేర్ ఆండ్రాయిడ్ సిస్టమ్​లోకి ప్రవేశించాక.. దానంతట అదే కావల్సిన అనుమతులు తీసుకుంటుంది. దీనితో ఆయా డివైజ్​లలోని సున్నితమైన డేటాను సులభంగా యాక్సెస్​ చేయగలుగుతుందని తెలిపారు.

వేటికి ముప్పు..

బ్లాక్​రాక్​ మాల్వేర్ క్రెడిట్ కార్డుల వివరాలతో పాటు సామాజిక మధ్యమాలైన ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్, స్కైప్, స్నాప్​చాట్, ట్విట్టర్ వంటి వాటి యాప్​లపై దాడి చేస్తున్నట్లు గుర్తించారు నిపుణులు. మొత్తం 337 వేరువేరు యాప్​లను ఈ మాల్వేర్ లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించారు. ఇంకా చాలా యాప్​లు ఈ మాల్వేర్​ లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించలేదని కూడా అనుమానం వ్యక్తం చేసుతున్నారు.

బ్లాక్​రాక్​ నుంచి రక్షణ ఎలా?

ఎప్పటికప్పుడు ఆండ్రాయిడ్ ఓఎస్​ను, యాప్స్​ను అప్​డేట్ చేసుకోవాలి. మొబైల్ ఫోన్లలో గుర్తింపు పొందిన యాంటీవైరస్​ టూల్స్ మాత్రమే వినియోగించాలి. యాప్​లకు అనవసర అనుమతులు ఇవ్వొద్దు. రక్షణ లేని థర్డ్ పార్టీ యాప్స్​ను డౌన్​లోడ్ చేసుకోవద్దని సైబర్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్​ ఇండియా ఛైర్మన్ ప్రొఫెసర్ ఎన్​.కె.గోయల్ సూచిస్తున్నారు.

మాల్వేర్​లు చూపించే మాయలో పడి భద్రత లేని యాప్​లు డౌన్​లోడ్​ చేసుకుంటే భారీ మూల్యం చెల్లిచుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి:'కేవైసీ అప్​డేట్​ అంటూ ఫోన్.. నిజమో కాదో తెలుసుకోండి'

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.