ETV Bharat / science-and-technology

'యూపీఐ లైట్'​ ఫీచర్​తో ఇంటర్నెట్​ లేకుండానే చెల్లింపులు​

UPI Lite Wallet: ఆఫ్​లైన్​ చెల్లింపులు విస్తృతం చేసేందుకు త్వరలో యూపీఐ లైట్​ అనే ఫీచర్​ను ప్రవేశపెట్టనున్నట్లు ఎన్​పీసీఐ ప్రకటించింది. దీని ద్వారా చిన్న మొత్తంలో చెల్లింపులను ఇంటర్నెట్​ అవసరం లేకుండానే చేసుకోవచ్చని వెల్లడించింది. 'నియర్​ ఆఫ్​లైన్​ మోడ్​'లో అందుబాటులోకి వచ్చే ఈ ఫీచర్​ను క్రమంగా అభివృద్ధి చేస్తామని తెలిపింది.

author img

By

Published : Mar 20, 2022, 7:48 PM IST

UPI Lite Wallet
యూపీఐ

UPI Lite Wallet: ఇటీవల రిజర్వ్​ బ్యాంకు.. ఫీచర్​ ఫోన్ల కోసం యూపీఐ చెల్లింపులు అందుబాటులోకి తెచ్చింది. ఇంటర్నెట్​ కనెక్షన్​ లేకుండానే లావాదేవీలు జరుపుకునేందుకు వీలుగా దీనిని తయారు చేశారు. తాజాగా మరో యూపీఐ ఫీచర్​ను ప్రవేశపెట్టనుంది నేషనల్​ పేమెంట్స్​ కార్పొరేషన్​ ఆఫ్ ఇండియా (ఎన్​పీసీఐ). అన్ని ఫోన్లలో యూపీఐ లైట్​ పేరుతో అందుబాటులోకి తేనున్న ఈ ఫీచర్​తో చిరు లావాదేవీలను ఇంటర్నెట్​ లేకుండానే చేసుకోవచ్చు.

యూపీఐ లైట్​ వ్యాలెట్​

పేటీఎం, మొబీక్విక్​ వంటి ఆన్​డివైజ్​ వ్యాలెట్ల తరహాలోనే యూపీఐ లైట్​ వ్యాలెట్​ను ప్రవేశపెట్టనున్నట్లు ఎన్​పీసీఐ ప్రకటించింది. ఈ వ్యాలెట్​​.. ఇటీవల ప్రవేశపెట్టిన ఆఫ్​లైన్​ యూపీఐ సేవల్లానే పనిచేస్తుంది. దీని ద్వారా యూజర్లు చిన్న మొత్తంలో ట్రాన్సాక్షన్స్​ చేసుకోవచ్చు. ఈ వ్యాలెట్​లో ఫండ్స్​ను కూడా స్టోర్​ చేసుకునే సదుపాయాన్ని ఎన్​పీసీఐ కల్పిస్తోంది.

ఇది ఎలా పనిచేస్తుండంటే..

యూపీఐ లైట్​ వ్యాలెట్​.. అందుబాటులోకి వచ్చిన తొలినాళ్లలో 'నియర్​ ఆఫ్​లైన్​ మోడ్​'లో పనిచేస్తుందని ఎన్​పీసీఐ వెల్లడించింది. డెబిట్​ పేమెంట్స్​ ఆఫ్​లైన్​లో, క్రెడిట్​ పేమెంట్స్​ ఆన్​లైన్​లో జరుగుతాయి. యూజర్ ఆన్​లైన్​లోకి వచ్చాక క్రెడిట్​ పేమెంట్స్​ అప్​డేట్​ అవుతాయి. అయితే క్రమంగా అన్ని రకాల చెల్లింపులూ ఆఫ్​లైన్​కు వచ్చేలా కృషి చేస్తామని ఎన్​పీసీఐ పేర్కొంది.

యూపీఐ లైట్​ సాయంతో వినియోగదారులు రూ.200లోపు లావాదేవీలు జరుపుకోవచ్చని.. అయితే వ్యాలెట్​​ లిమిట్​ గరిష్ఠంగా రూ.2000 అని ఎన్​పీసీఐ తెలిపింది. ఈ యూపీఐ లైట్ వ్యాలెట్​లో ఉండే నగదుకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయటం లేదని స్పష్టం చేసింది. యూపీఐ లైట్​ ఖాతాల సంఖ్య యూజర్లు వాడే యూపీఐ యాప్​ల సంఖ్యపై ఆధారపడి ఉంటుందని తెలిపింది.

అలా చేయాలంటే ఆన్​లైన్​కు రావాల్సిందే..

యూజర్లు యూపీఐ లైట్​లో ఫండ్స్​ను యాడ్​ చేయాలంటే ఇంటర్నెట్​ ఉండాల్సిందే. ఇందుకు అదనంగా వెరిఫికేషన్​ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఆటోమేటిక్​గా ఫండ్స్​ యాడ్​ చేసుకునే అవకాశం కూడా ఉంది.

ఎప్పుడు అందుబాటులోకి వస్తుందంటే?

ఈ యూపీఐ లైట్​ వ్యాలెట్​ అందుబాటులోకి రావడంపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. మొదట పైలట్​గా ప్రవేశపెట్టనున్న ఈ యూపీఐ త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి : దరి చేరనున్న 5జీ సాంకేతికత- అధిగమించాల్సిన సవాళ్లెన్నో..

UPI Lite Wallet: ఇటీవల రిజర్వ్​ బ్యాంకు.. ఫీచర్​ ఫోన్ల కోసం యూపీఐ చెల్లింపులు అందుబాటులోకి తెచ్చింది. ఇంటర్నెట్​ కనెక్షన్​ లేకుండానే లావాదేవీలు జరుపుకునేందుకు వీలుగా దీనిని తయారు చేశారు. తాజాగా మరో యూపీఐ ఫీచర్​ను ప్రవేశపెట్టనుంది నేషనల్​ పేమెంట్స్​ కార్పొరేషన్​ ఆఫ్ ఇండియా (ఎన్​పీసీఐ). అన్ని ఫోన్లలో యూపీఐ లైట్​ పేరుతో అందుబాటులోకి తేనున్న ఈ ఫీచర్​తో చిరు లావాదేవీలను ఇంటర్నెట్​ లేకుండానే చేసుకోవచ్చు.

యూపీఐ లైట్​ వ్యాలెట్​

పేటీఎం, మొబీక్విక్​ వంటి ఆన్​డివైజ్​ వ్యాలెట్ల తరహాలోనే యూపీఐ లైట్​ వ్యాలెట్​ను ప్రవేశపెట్టనున్నట్లు ఎన్​పీసీఐ ప్రకటించింది. ఈ వ్యాలెట్​​.. ఇటీవల ప్రవేశపెట్టిన ఆఫ్​లైన్​ యూపీఐ సేవల్లానే పనిచేస్తుంది. దీని ద్వారా యూజర్లు చిన్న మొత్తంలో ట్రాన్సాక్షన్స్​ చేసుకోవచ్చు. ఈ వ్యాలెట్​లో ఫండ్స్​ను కూడా స్టోర్​ చేసుకునే సదుపాయాన్ని ఎన్​పీసీఐ కల్పిస్తోంది.

ఇది ఎలా పనిచేస్తుండంటే..

యూపీఐ లైట్​ వ్యాలెట్​.. అందుబాటులోకి వచ్చిన తొలినాళ్లలో 'నియర్​ ఆఫ్​లైన్​ మోడ్​'లో పనిచేస్తుందని ఎన్​పీసీఐ వెల్లడించింది. డెబిట్​ పేమెంట్స్​ ఆఫ్​లైన్​లో, క్రెడిట్​ పేమెంట్స్​ ఆన్​లైన్​లో జరుగుతాయి. యూజర్ ఆన్​లైన్​లోకి వచ్చాక క్రెడిట్​ పేమెంట్స్​ అప్​డేట్​ అవుతాయి. అయితే క్రమంగా అన్ని రకాల చెల్లింపులూ ఆఫ్​లైన్​కు వచ్చేలా కృషి చేస్తామని ఎన్​పీసీఐ పేర్కొంది.

యూపీఐ లైట్​ సాయంతో వినియోగదారులు రూ.200లోపు లావాదేవీలు జరుపుకోవచ్చని.. అయితే వ్యాలెట్​​ లిమిట్​ గరిష్ఠంగా రూ.2000 అని ఎన్​పీసీఐ తెలిపింది. ఈ యూపీఐ లైట్ వ్యాలెట్​లో ఉండే నగదుకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయటం లేదని స్పష్టం చేసింది. యూపీఐ లైట్​ ఖాతాల సంఖ్య యూజర్లు వాడే యూపీఐ యాప్​ల సంఖ్యపై ఆధారపడి ఉంటుందని తెలిపింది.

అలా చేయాలంటే ఆన్​లైన్​కు రావాల్సిందే..

యూజర్లు యూపీఐ లైట్​లో ఫండ్స్​ను యాడ్​ చేయాలంటే ఇంటర్నెట్​ ఉండాల్సిందే. ఇందుకు అదనంగా వెరిఫికేషన్​ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఆటోమేటిక్​గా ఫండ్స్​ యాడ్​ చేసుకునే అవకాశం కూడా ఉంది.

ఎప్పుడు అందుబాటులోకి వస్తుందంటే?

ఈ యూపీఐ లైట్​ వ్యాలెట్​ అందుబాటులోకి రావడంపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. మొదట పైలట్​గా ప్రవేశపెట్టనున్న ఈ యూపీఐ త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి : దరి చేరనున్న 5జీ సాంకేతికత- అధిగమించాల్సిన సవాళ్లెన్నో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.