ETV Bharat / science-and-technology

న్యూఇయర్​లో 5జీ సేవలు షురూ.. ఈ నగరాల్లోనే...

author img

By

Published : Dec 27, 2021, 7:25 PM IST

5G services India: కొత్త సంవత్సరంలో దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నట్లు టెలి కమ్యూనికేషన్ల శాఖ(డాట్​) తెలిపింది. దిల్లీ, ముంబయి, హైదరాబాద్​తోపాటు పలు మహానగరాల్లో ఐదోతరం సేవలను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది.

5G services India
5G services India

5G services India: దేశీయంగా టెలికాం రంగంలో నూతన శకం ప్రారంభం కానుంది. 2022లో దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. గురుగ్రామ్, బెంగళూరు, కోల్‌కతా, ముంబయి, చండీగఢ్, దిల్లీ, జామ్‌నగర్​, అహ్మదాబాద్​, చెన్నై, హైదరాబాద్​, లఖ్​నవూ, పుణె, గాంధీనగర్ సహా పలు ప్రధాన నగరాల్లో 5జీ సేవలను తొలుత అందుబాటులోకి తీసుకురానున్నట్లు టెలికమ్యూనికేషన్ల శాఖ (డాట్‌) తెలిపింది. దిగ్గజ టెలికాం సంస్థలు భారతీ ఎయిర్​టెల్​, రిలయన్స్​ జియో, వొడాఫోన్​ ఐడియా ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది.

దేశంలో 5జీ సేవలను త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టెలికాం సంస్థలు, మొబైల్​ తయారీ కంపెనీలతో పాటు ప్రభుత్వం కూడా కృషి చేస్తోంది. 5జీ టెక్నాలజీ అభివృద్ధి, పరీక్షించడం కోసం పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేసింది టెలికాం విభాగం. స్వదేశీ 5జీ టెస్ట్​ బెడ్ ప్రాజెక్ట్​గా పిలిచే పరిశోధనా సంస్థలో ఐఐటీ దిల్లీ, ఐఐటీ బొంబయి, ఐఐటీ హైదరాబాద్​, ఐఐటీ మద్రాస్​, ఐఐటీ కాన్పుర్​, ఇండియన్​ ఇన్​స్టిట్యూషన్​ ఆఫ్​ సైన్స్​ బెంగళూరు సహా మరో రెండు టెక్​ పరిశోధన సంస్థలు పాల్గొన్నాయి. ఈ ప్రాజెక్టు కోసం రూ.224 కోట్లు ఖర్చు చేసినట్లు డాట్​ తెలిపింది.

2022 మార్చి-ఏప్రిల్​ నెలల్లో 5జీ స్పెక్ట్రమ్ వేలం నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిజర్వ్ ధర, బ్యాండ్ ప్లాన్, బ్లాక్ సైజు, స్పెక్ట్రమ్ క్వాంటంకు సంబంధించి టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) ​నుంచి సిఫార్సులను కోరింది డాట్​. ట్రాయ్​ తన వంతుగా పరిశ్రమ వాటాదారులతో ఈ సమస్యపై సంప్రదింపులు ప్రారంభించింది.

ఇదీ చూడండి: చైనావ్యాప్తంగా 5జీ సేవలు షురూ- భారత్​లో ఎప్పుడో?

5G services India: దేశీయంగా టెలికాం రంగంలో నూతన శకం ప్రారంభం కానుంది. 2022లో దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. గురుగ్రామ్, బెంగళూరు, కోల్‌కతా, ముంబయి, చండీగఢ్, దిల్లీ, జామ్‌నగర్​, అహ్మదాబాద్​, చెన్నై, హైదరాబాద్​, లఖ్​నవూ, పుణె, గాంధీనగర్ సహా పలు ప్రధాన నగరాల్లో 5జీ సేవలను తొలుత అందుబాటులోకి తీసుకురానున్నట్లు టెలికమ్యూనికేషన్ల శాఖ (డాట్‌) తెలిపింది. దిగ్గజ టెలికాం సంస్థలు భారతీ ఎయిర్​టెల్​, రిలయన్స్​ జియో, వొడాఫోన్​ ఐడియా ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది.

దేశంలో 5జీ సేవలను త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టెలికాం సంస్థలు, మొబైల్​ తయారీ కంపెనీలతో పాటు ప్రభుత్వం కూడా కృషి చేస్తోంది. 5జీ టెక్నాలజీ అభివృద్ధి, పరీక్షించడం కోసం పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేసింది టెలికాం విభాగం. స్వదేశీ 5జీ టెస్ట్​ బెడ్ ప్రాజెక్ట్​గా పిలిచే పరిశోధనా సంస్థలో ఐఐటీ దిల్లీ, ఐఐటీ బొంబయి, ఐఐటీ హైదరాబాద్​, ఐఐటీ మద్రాస్​, ఐఐటీ కాన్పుర్​, ఇండియన్​ ఇన్​స్టిట్యూషన్​ ఆఫ్​ సైన్స్​ బెంగళూరు సహా మరో రెండు టెక్​ పరిశోధన సంస్థలు పాల్గొన్నాయి. ఈ ప్రాజెక్టు కోసం రూ.224 కోట్లు ఖర్చు చేసినట్లు డాట్​ తెలిపింది.

2022 మార్చి-ఏప్రిల్​ నెలల్లో 5జీ స్పెక్ట్రమ్ వేలం నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిజర్వ్ ధర, బ్యాండ్ ప్లాన్, బ్లాక్ సైజు, స్పెక్ట్రమ్ క్వాంటంకు సంబంధించి టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) ​నుంచి సిఫార్సులను కోరింది డాట్​. ట్రాయ్​ తన వంతుగా పరిశ్రమ వాటాదారులతో ఈ సమస్యపై సంప్రదింపులు ప్రారంభించింది.

ఇదీ చూడండి: చైనావ్యాప్తంగా 5జీ సేవలు షురూ- భారత్​లో ఎప్పుడో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.