ETV Bharat / opinion

సాంకేతికత వెలుగు నీడలు.. కావాలి భారీ వ్యయాలు

author img

By

Published : Jul 9, 2020, 7:04 AM IST

కొన్నేళ్లుగా ప్రైవేటు రంగంలో పెట్టుబడులు ఊపందుకున్నా.. కరోనా పుణ్యమా అని మళ్లీ దెబ్బతిన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను దిగజార్చే పరిస్థితులు తలెత్తుతున్నాయి. సాంకేతికత వినియోగం భారీగా పెరిగిన తరుణంలోనూ ఫలితాలు మాత్రం ఆశావహంగా లేవు. పెద్ద నగరాల్లో కిరాణా సరకులు, వస్త్రాలు మొదలుకొని రకరకాల వినియోగ వస్తువులను ఈ-కామర్స్‌ కంపెనీలు భారీస్థాయిలో సరఫరా చేస్తున్నాయి. కొవిడ్‌ వల్ల ఉద్యోగాలు కోల్పోయినవారే కాకుండా, నెలనెలా ఉపాధి విపణిలో కొత్తగా ప్రవేశించే 20 లక్షల మందికి జీవనోపాధి కల్పించేందుకు, అర్థవంతమైన వ్యయాలు చేయడం తప్పనిసరి.

Technology has been down
సాంకేతికత వెలుగు నీడలు

మన జీవన విధానాన్నీ, వృత్తులను, ఉపాధిని, ఇతరులతో సామాజిక అనుబంధాలను కరోనా సమూలంగా మార్చేసింది. 2011 నుంచి తగ్గుతూ వస్తున్న ప్రైవేటు పెట్టుబడులు 2016లో కొంత ఊపందుకున్నా, కొవిడ్‌ మహమ్మారి దెబ్బకు మళ్లీ నేలచూపులు చూస్తున్నాయి. ఇది ఆర్థిక ప్రగతికి ఏ మాత్రం శుభ సూచకం కాదు. ఇంత నిరాశావహ వాతావరణంలోనూ సాంకేతిక పరిజ్ఞాన ఫలితాలు ఆశాకిరణంలా కనిపించడం విశేషం. కరోనా విషపు నీడలో ఆర్థిక కార్యకలాపాలు బొత్తిగా మందగించినా, సాంకేతికత వినియోగం మాత్రం గణనీయంగా పెరిగింది. ఇంటి నుంచే పని అనే పదబంధం సరికొత్త వాడుక పదమైంది. లక్షలాది విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతుల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. ఎలక్ట్రానిక్‌ చెల్లింపులు పెద్దపెట్టున పెరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన చెల్లింపులకన్నా జూన్‌ నెలలో చెల్లింపులు ఎన్నో రెట్లు ఎక్కువ. కుటుంబాలు, కంపెనీలు, ప్రభుత్వాలు దృశ్యమాధ్యమాల ద్వారా సంప్రదింపులకు అగ్ర ప్రాధాన్యమిస్తున్నాయి.

పెరిగిన ఈ-కామర్స్​ వ్యాపారం

లాక్‌డౌన్‌ పతాకస్థాయిలో ఉన్నప్పుడు బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ (బీపీఎం) రంగంలోని 45 లక్షల మంది సిబ్బందిలో మూడింట రెండొంతులు ఇళ్ళ నుంచే పని చేశారని అంచనా. దీంతో కంపెనీలు కరోనా తగ్గుముఖం పట్టేవరకు కార్యాలయాలను తెరవకుండా కార్యకలాపాలు కొనసాగించడానికి వీలైంది. ఒకవేళ కొన్ని తెరిచినా పరిమిత సిబ్బందితో అవి కార్యకలాపాలు నడిపిస్తున్నాయి. పెద్ద నగరాల్లో కిరాణా సరకులు, వస్త్రాలు మొదలుకొని రకరకాల వినియోగ వస్తువులను ఈ-కామర్స్‌ కంపెనీలు భారీస్థాయిలో సరఫరా చేస్తున్నాయి. అందుకే కరోనా ప్రబలిన తొలినాళ్లతో పోలిస్తే ఇప్పుడు తమ వ్యాపారం 80 శాతందాకా పెరిగిందని ఈ-కామ్‌ కంపెనీలు వెల్లడించాయి. అదే సాధారణ దుకాణాలు కరోనా ముందు నాటి వ్యాపారంలో 50 నుంచి 60 శాతం మాత్రమే చేయగలుగుతున్నాయి.

ఉద్యోగాలపై ప్రభావం

సాంకేతికత వెలుగు నీడలు అసలే కొవిడ్‌ వల్ల భారీ ఉద్యోగ నష్టం సంభవించిన పరిస్థితిలో సాంకేతికత వల్ల ఇప్పటికిప్పుడు కొత్త ఉద్యోగాలు వస్తాయనే ఆశ లేదు. స్వల్ప, మధ్య కాలాల్లో ఉద్యోగ విపణి విచ్ఛిత్తి సాంకేతికత వల్ల మరింతగా ముదిరింది. భారత్‌ వంటి వర్ధమాన దేశంలో అన్ని ఉద్యోగాలూ ఇంటి నుంచి చేయడానికి అనువైనవి కావు. కొన్ని రంగాల్లో మాత్రమే ఆ సదుపాయం లభిస్తుంది. ఒకటి మాత్రం నిజం- ఇంటి నుంచి పని విధానం సంఘటిత రంగంలోని పెద్ద కంపెనీల్లో ఉద్యోగుల ఉత్పాదకతను పెంచింది. ఉద్యోగులపై కంపెనీలు చేసే ప్రయాణ ఖర్చులు, క్యాంటీన్‌ ఖర్చులు, కార్యాలయ భవనాల అద్దెలు, విద్యుత్‌ ఖర్చులు గణనీయంగా తగ్గాయి. నగరాల్లో కంపెనీలు తమ ఉద్యోగులపై చేసే వ్యయంకన్నా తమ కార్యాలయాలకు చెల్లించే అద్దె ఒకటిన్నర నుంచి రెండు రెట్లు ఎక్కువని అంచనా.

దేశ ఆర్థికంపై ప్రభావం..

ఇంటి నుంచి పనితో అద్దె ఖర్చు ఆదా అయినా దీనివల్ల స్థిరాస్తి, భవన నిర్మాణ రంగాలపై పడే ప్రతికూల ప్రభావం తక్కువేమీ కాదు. పేదలకు, వలస కూలీలకు ఉపాధి కల్పించే ఈ రెండు రంగాలు దెబ్బతినడం దేశార్థికానికి ఏమాత్రం మంచిది కాదు. ఆధునిక సాంకేతికతలను క్రమంగా చేపట్టాలి తప్ప, ఉన్నఫళాన అమలు చేయడం మంచిది కాదు. సంక్షోభ సమయాల్లో ఆకస్మికంగా వచ్చిపడే సాంకేతిక మార్పు తీవ్ర నష్టాలకు దారి తీస్తుందని ప్రస్తుత కొవిడ్‌ సంక్షోభ సమయం రుజువు చేస్తోంది. కొవిడ్‌ వల్ల ఈ ఏడాదే కాదు వచ్చే ఏడాది కూడా ఉపాధి నష్టం కొనసాగేట్లుంది. నేడు భారత ఆర్థిక వ్యవస్థను కరోనాతోపాటు ఉపాధి రహిత అభివృద్ధి, విపరీతమైన రుణభారం, తగ్గిపోయిన ప్రైవేటు పెట్టుబడులనే రుగ్మతలు పట్టి పీడిస్తున్నాయి.

భారీ ఉద్యోగ నష్టాలు

కరోనా కాలంలో లక్షలాది వలస కూలీలు ఉపాధి కోల్పోయి స్వగ్రామాలకు తరలివెళ్లడం దేశానికి పట్టిన ఆర్థిక దురవస్థను కళ్లకు కట్టింది. సంఘటిత రంగంలో ఒక్క ఉద్యోగం పోతే, అసంఘటిత రంగంలో నాలుగు ఉద్యోగాల నష్టం జరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే రెండు రంగాల్లో భారీ ఉద్యోగ నష్టం సంభవించిందని స్పష్టమవుతోంది. ఉన్న ఉపాధి కోల్పోవడంతో చాలామంది మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఆశ్రయిస్తున్నారు. 2020 ఏప్రిల్‌ నుంచి అదనంగా 35 లక్షల మంది ఈ పథకం కింద ఉపాధి పొందినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. గడచిన రెండు దశాబ్దాల్లో అత్యధిక ఉద్యోగ సృష్టి సేవారంగంలోనే జరిగింది. అవన్నీ పెద్ద జీతాలు ఇచ్చే ఉద్యోగాలు కావని గమనించాలి.

అప్పులు తప్పవా?

హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, చిల్లర వర్తకం, స్థిరాస్తి, భవన నిర్మాణ రంగాల్లో తక్కువ జీతాలకు లక్షల మంది పని చేస్తున్నారు. పై రంగాల్లో వ్యవస్థాపకులు భారీగా అప్పులు తెచ్చి పనులు నడిపిస్తారని గుర్తుంచుకోవాలి. ఈ వాణిజ్య రంగాలకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇచ్చిన రుణాలు 2010 మార్చిలో రూ.31 లక్షల కోట్లు; 2020 ఏప్రిల్‌కల్లా అవి రూ.91 లక్షల కోట్లకు పెరిగాయి. ఇందులో రూ.17 లక్షల కోట్ల రుణాలను 2017 తరవాతే ఇచ్చారు. చిత్రంగా 2017 నుంచి ప్రతి త్రైమాసికంలో జీడీపీకి అదనపు విలువ జోడింపు తగ్గిపోతూ వచ్చింది. అంటే ఇకపై జీడీపీని పెంచాలంటే కొత్తగా అప్పులు చేయక తప్పదన్నమాట. ఇది ఆర్థిక వ్యవస్థ స్వస్థతకు ఏమాత్రం మంచిది కాదు.

ముందున్న మార్గం

భారతదేశం నిరంతరం విత్త, ఆదాయ లోటుతో సతమతమవుతున్నందు వల్ల, ప్రభుత్వం అదేపనిగా స్వల్పకాలిక లక్ష్యాలపై ఖర్చు చేస్తూ పోవడం లాభించదు. అప్పులు చేసీ, పన్నులు పెంచీ ఖర్చులు పెట్టడం ఉపయుక్తంకాదు. రుణభారం, విత్త, ఆదాయ లోటు, అధిక పన్నులు గుదిబండలై కిందకు లాగుతున్నందు వల్ల రాగల మూడు నుంచి అయిదేళ్ల కాలంలో కొత్త ఉద్యోగాల సృష్టి చాలా కష్టసాధ్యం కానున్నది. ఈ సమస్యను అధిగమించాలంటే ఆస్పత్రులు, ఇతర మౌలిక వసతుల నిర్మాణంపై, వెనకబడిన ప్రాంతాల్లో భారీ పరిశ్రమల ఏర్పాటుపై ప్రభుత్వం విరివిగా ఖర్చు చేయాలి. తద్వారా అసంఘటిత రంగంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించగల వీలుంది. 1960లు, 1980లలో జరిగింది ఇదే. రాగల 20 ఏళ్లదాకా ఉపయోగపడే ప్రాజెక్టులపై కేంద్రం భారీ వ్యయాలు చేయాలి.

అలా చేస్తేనే..

చైనా రానున్న సంవత్సరాల్లో హైటెక్‌ రంగాలపై లక్షన్నర కోట్ల డాలర్లను వెచ్చించబోతున్నట్లు ఇటీవల ప్రకటించింది. దీనివల్ల భవిష్యత్తులో వేగవంతమైన అభివృద్ధి, ఉపాధి కల్పన సుసాధ్యమవుతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌, విశాఖపట్నం నగరాల్లో భారీ ప్రభుత్వ రంగ పరిశ్రమలు, మౌలిక వసతుల నిర్మాణం కోసం ప్రభుత్వాలు పెద్దయెత్తున పెట్టుబడులు గుమ్మరించాయి. అందుకే నేడవి మహానగరాలుగా వర్ధిల్లుతున్నాయి. ఇటీవల స్వస్థలాలకు తిరిగి వెళ్లిన వలస కార్మికులకు కొత్త నైపుణ్యాలు నేర్పించడంపై భారీగా ఖర్చు చేస్తే ఆర్థిక వ్యవస్థ మళ్లీ వేగంగా పుంజుకొంటుంది. కొవిడ్‌ వల్ల ఉద్యోగాలు కోల్పోయినవారే కాకుండా, నెలనెలా ఉపాధి విపణిలో కొత్తగా ప్రవేశించే 20 లక్షల మందికి జీవనోపాధి కల్పించేందుకు, అర్థవంతమైన వ్యయాలు చేయడం తప్పనిసరి.

- డాక్టర్​ ఎస్​. అనంత్​, రచయిత - ఆర్థిక సామాజిక రంగ నిపుణులు

ఇదీ చదవండి: ఇండియా గ్లోబల్​ వీక్​-2020లో మోదీ ప్రసంగం

మన జీవన విధానాన్నీ, వృత్తులను, ఉపాధిని, ఇతరులతో సామాజిక అనుబంధాలను కరోనా సమూలంగా మార్చేసింది. 2011 నుంచి తగ్గుతూ వస్తున్న ప్రైవేటు పెట్టుబడులు 2016లో కొంత ఊపందుకున్నా, కొవిడ్‌ మహమ్మారి దెబ్బకు మళ్లీ నేలచూపులు చూస్తున్నాయి. ఇది ఆర్థిక ప్రగతికి ఏ మాత్రం శుభ సూచకం కాదు. ఇంత నిరాశావహ వాతావరణంలోనూ సాంకేతిక పరిజ్ఞాన ఫలితాలు ఆశాకిరణంలా కనిపించడం విశేషం. కరోనా విషపు నీడలో ఆర్థిక కార్యకలాపాలు బొత్తిగా మందగించినా, సాంకేతికత వినియోగం మాత్రం గణనీయంగా పెరిగింది. ఇంటి నుంచే పని అనే పదబంధం సరికొత్త వాడుక పదమైంది. లక్షలాది విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతుల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. ఎలక్ట్రానిక్‌ చెల్లింపులు పెద్దపెట్టున పెరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన చెల్లింపులకన్నా జూన్‌ నెలలో చెల్లింపులు ఎన్నో రెట్లు ఎక్కువ. కుటుంబాలు, కంపెనీలు, ప్రభుత్వాలు దృశ్యమాధ్యమాల ద్వారా సంప్రదింపులకు అగ్ర ప్రాధాన్యమిస్తున్నాయి.

పెరిగిన ఈ-కామర్స్​ వ్యాపారం

లాక్‌డౌన్‌ పతాకస్థాయిలో ఉన్నప్పుడు బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ (బీపీఎం) రంగంలోని 45 లక్షల మంది సిబ్బందిలో మూడింట రెండొంతులు ఇళ్ళ నుంచే పని చేశారని అంచనా. దీంతో కంపెనీలు కరోనా తగ్గుముఖం పట్టేవరకు కార్యాలయాలను తెరవకుండా కార్యకలాపాలు కొనసాగించడానికి వీలైంది. ఒకవేళ కొన్ని తెరిచినా పరిమిత సిబ్బందితో అవి కార్యకలాపాలు నడిపిస్తున్నాయి. పెద్ద నగరాల్లో కిరాణా సరకులు, వస్త్రాలు మొదలుకొని రకరకాల వినియోగ వస్తువులను ఈ-కామర్స్‌ కంపెనీలు భారీస్థాయిలో సరఫరా చేస్తున్నాయి. అందుకే కరోనా ప్రబలిన తొలినాళ్లతో పోలిస్తే ఇప్పుడు తమ వ్యాపారం 80 శాతందాకా పెరిగిందని ఈ-కామ్‌ కంపెనీలు వెల్లడించాయి. అదే సాధారణ దుకాణాలు కరోనా ముందు నాటి వ్యాపారంలో 50 నుంచి 60 శాతం మాత్రమే చేయగలుగుతున్నాయి.

ఉద్యోగాలపై ప్రభావం

సాంకేతికత వెలుగు నీడలు అసలే కొవిడ్‌ వల్ల భారీ ఉద్యోగ నష్టం సంభవించిన పరిస్థితిలో సాంకేతికత వల్ల ఇప్పటికిప్పుడు కొత్త ఉద్యోగాలు వస్తాయనే ఆశ లేదు. స్వల్ప, మధ్య కాలాల్లో ఉద్యోగ విపణి విచ్ఛిత్తి సాంకేతికత వల్ల మరింతగా ముదిరింది. భారత్‌ వంటి వర్ధమాన దేశంలో అన్ని ఉద్యోగాలూ ఇంటి నుంచి చేయడానికి అనువైనవి కావు. కొన్ని రంగాల్లో మాత్రమే ఆ సదుపాయం లభిస్తుంది. ఒకటి మాత్రం నిజం- ఇంటి నుంచి పని విధానం సంఘటిత రంగంలోని పెద్ద కంపెనీల్లో ఉద్యోగుల ఉత్పాదకతను పెంచింది. ఉద్యోగులపై కంపెనీలు చేసే ప్రయాణ ఖర్చులు, క్యాంటీన్‌ ఖర్చులు, కార్యాలయ భవనాల అద్దెలు, విద్యుత్‌ ఖర్చులు గణనీయంగా తగ్గాయి. నగరాల్లో కంపెనీలు తమ ఉద్యోగులపై చేసే వ్యయంకన్నా తమ కార్యాలయాలకు చెల్లించే అద్దె ఒకటిన్నర నుంచి రెండు రెట్లు ఎక్కువని అంచనా.

దేశ ఆర్థికంపై ప్రభావం..

ఇంటి నుంచి పనితో అద్దె ఖర్చు ఆదా అయినా దీనివల్ల స్థిరాస్తి, భవన నిర్మాణ రంగాలపై పడే ప్రతికూల ప్రభావం తక్కువేమీ కాదు. పేదలకు, వలస కూలీలకు ఉపాధి కల్పించే ఈ రెండు రంగాలు దెబ్బతినడం దేశార్థికానికి ఏమాత్రం మంచిది కాదు. ఆధునిక సాంకేతికతలను క్రమంగా చేపట్టాలి తప్ప, ఉన్నఫళాన అమలు చేయడం మంచిది కాదు. సంక్షోభ సమయాల్లో ఆకస్మికంగా వచ్చిపడే సాంకేతిక మార్పు తీవ్ర నష్టాలకు దారి తీస్తుందని ప్రస్తుత కొవిడ్‌ సంక్షోభ సమయం రుజువు చేస్తోంది. కొవిడ్‌ వల్ల ఈ ఏడాదే కాదు వచ్చే ఏడాది కూడా ఉపాధి నష్టం కొనసాగేట్లుంది. నేడు భారత ఆర్థిక వ్యవస్థను కరోనాతోపాటు ఉపాధి రహిత అభివృద్ధి, విపరీతమైన రుణభారం, తగ్గిపోయిన ప్రైవేటు పెట్టుబడులనే రుగ్మతలు పట్టి పీడిస్తున్నాయి.

భారీ ఉద్యోగ నష్టాలు

కరోనా కాలంలో లక్షలాది వలస కూలీలు ఉపాధి కోల్పోయి స్వగ్రామాలకు తరలివెళ్లడం దేశానికి పట్టిన ఆర్థిక దురవస్థను కళ్లకు కట్టింది. సంఘటిత రంగంలో ఒక్క ఉద్యోగం పోతే, అసంఘటిత రంగంలో నాలుగు ఉద్యోగాల నష్టం జరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే రెండు రంగాల్లో భారీ ఉద్యోగ నష్టం సంభవించిందని స్పష్టమవుతోంది. ఉన్న ఉపాధి కోల్పోవడంతో చాలామంది మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఆశ్రయిస్తున్నారు. 2020 ఏప్రిల్‌ నుంచి అదనంగా 35 లక్షల మంది ఈ పథకం కింద ఉపాధి పొందినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. గడచిన రెండు దశాబ్దాల్లో అత్యధిక ఉద్యోగ సృష్టి సేవారంగంలోనే జరిగింది. అవన్నీ పెద్ద జీతాలు ఇచ్చే ఉద్యోగాలు కావని గమనించాలి.

అప్పులు తప్పవా?

హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, చిల్లర వర్తకం, స్థిరాస్తి, భవన నిర్మాణ రంగాల్లో తక్కువ జీతాలకు లక్షల మంది పని చేస్తున్నారు. పై రంగాల్లో వ్యవస్థాపకులు భారీగా అప్పులు తెచ్చి పనులు నడిపిస్తారని గుర్తుంచుకోవాలి. ఈ వాణిజ్య రంగాలకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇచ్చిన రుణాలు 2010 మార్చిలో రూ.31 లక్షల కోట్లు; 2020 ఏప్రిల్‌కల్లా అవి రూ.91 లక్షల కోట్లకు పెరిగాయి. ఇందులో రూ.17 లక్షల కోట్ల రుణాలను 2017 తరవాతే ఇచ్చారు. చిత్రంగా 2017 నుంచి ప్రతి త్రైమాసికంలో జీడీపీకి అదనపు విలువ జోడింపు తగ్గిపోతూ వచ్చింది. అంటే ఇకపై జీడీపీని పెంచాలంటే కొత్తగా అప్పులు చేయక తప్పదన్నమాట. ఇది ఆర్థిక వ్యవస్థ స్వస్థతకు ఏమాత్రం మంచిది కాదు.

ముందున్న మార్గం

భారతదేశం నిరంతరం విత్త, ఆదాయ లోటుతో సతమతమవుతున్నందు వల్ల, ప్రభుత్వం అదేపనిగా స్వల్పకాలిక లక్ష్యాలపై ఖర్చు చేస్తూ పోవడం లాభించదు. అప్పులు చేసీ, పన్నులు పెంచీ ఖర్చులు పెట్టడం ఉపయుక్తంకాదు. రుణభారం, విత్త, ఆదాయ లోటు, అధిక పన్నులు గుదిబండలై కిందకు లాగుతున్నందు వల్ల రాగల మూడు నుంచి అయిదేళ్ల కాలంలో కొత్త ఉద్యోగాల సృష్టి చాలా కష్టసాధ్యం కానున్నది. ఈ సమస్యను అధిగమించాలంటే ఆస్పత్రులు, ఇతర మౌలిక వసతుల నిర్మాణంపై, వెనకబడిన ప్రాంతాల్లో భారీ పరిశ్రమల ఏర్పాటుపై ప్రభుత్వం విరివిగా ఖర్చు చేయాలి. తద్వారా అసంఘటిత రంగంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించగల వీలుంది. 1960లు, 1980లలో జరిగింది ఇదే. రాగల 20 ఏళ్లదాకా ఉపయోగపడే ప్రాజెక్టులపై కేంద్రం భారీ వ్యయాలు చేయాలి.

అలా చేస్తేనే..

చైనా రానున్న సంవత్సరాల్లో హైటెక్‌ రంగాలపై లక్షన్నర కోట్ల డాలర్లను వెచ్చించబోతున్నట్లు ఇటీవల ప్రకటించింది. దీనివల్ల భవిష్యత్తులో వేగవంతమైన అభివృద్ధి, ఉపాధి కల్పన సుసాధ్యమవుతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌, విశాఖపట్నం నగరాల్లో భారీ ప్రభుత్వ రంగ పరిశ్రమలు, మౌలిక వసతుల నిర్మాణం కోసం ప్రభుత్వాలు పెద్దయెత్తున పెట్టుబడులు గుమ్మరించాయి. అందుకే నేడవి మహానగరాలుగా వర్ధిల్లుతున్నాయి. ఇటీవల స్వస్థలాలకు తిరిగి వెళ్లిన వలస కార్మికులకు కొత్త నైపుణ్యాలు నేర్పించడంపై భారీగా ఖర్చు చేస్తే ఆర్థిక వ్యవస్థ మళ్లీ వేగంగా పుంజుకొంటుంది. కొవిడ్‌ వల్ల ఉద్యోగాలు కోల్పోయినవారే కాకుండా, నెలనెలా ఉపాధి విపణిలో కొత్తగా ప్రవేశించే 20 లక్షల మందికి జీవనోపాధి కల్పించేందుకు, అర్థవంతమైన వ్యయాలు చేయడం తప్పనిసరి.

- డాక్టర్​ ఎస్​. అనంత్​, రచయిత - ఆర్థిక సామాజిక రంగ నిపుణులు

ఇదీ చదవండి: ఇండియా గ్లోబల్​ వీక్​-2020లో మోదీ ప్రసంగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.