మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్పేట్ మండలం బొమ్మరాశిపేటలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనులు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై శ్రీపాల్ రెడ్డి అనే యువ రైతు మృతి చెందాడు.
గ్రామానికి చెందిన మెడసాని శ్రీపాల్ రెడ్డి గేదెల కోసం తన పొలంలో గడ్డి కోయడానికి వెళ్లాడు. ఈ క్రమంలో గట్టుపై తెగి పడి ఉన్న విద్యుత్ తీగలకు ప్రమాదవశాత్తు తగలడంతో విద్యుత్ షాక్కు గురయ్యాడు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న శామీర్పేట ఎస్సై రవికుమార్ ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కుమారుని అకాల మరణంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపించారు.
ఇదీచూడండి.. కృష్ణానదిలో స్నానానికి వెళ్లి బ్యాంకు ఉద్యోగి మృతి