ETV Bharat / jagte-raho

వివాహం ఇష్టంలేక మనస్తాపంతో యువతి ఆత్మహత్య

author img

By

Published : Oct 17, 2020, 6:50 PM IST

పెళ్లి చేసుకోవడం ఇష్టంలేక మనస్తాపం చెందిన ఓ యువతి.. ఒంటిపై కిరోసిన్​ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్​ జిల్లా నందిగామలో జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

woman suicide as she hesitates to marry at medak
వివాహం ఇష్టంలేక మనస్తాపంతో యువతి ఆత్మహత్య

మెదక్​ జిల్లా నందిగామ గ్రామానికి చెందిన రేవతి.. రెండేళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలో తనకు కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తుండగా అనారోగ్యం కారణంగా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మనస్తాపం చెందింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్​ పోసుకుని నిప్పంటించుకుంది.

మంటను భరించలేక రేవతి వేసిన కేకలను స్థానికులు గమనించి వాటిని ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆమె మరణించింది. మృతురాలి తల్లి సుమలత ఫిర్యాదు మేరకు నిజాంపేట ఎస్సై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ఆసుపత్రికి తరలించారు.

మెదక్​ జిల్లా నందిగామ గ్రామానికి చెందిన రేవతి.. రెండేళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలో తనకు కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తుండగా అనారోగ్యం కారణంగా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మనస్తాపం చెందింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్​ పోసుకుని నిప్పంటించుకుంది.

మంటను భరించలేక రేవతి వేసిన కేకలను స్థానికులు గమనించి వాటిని ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆమె మరణించింది. మృతురాలి తల్లి సుమలత ఫిర్యాదు మేరకు నిజాంపేట ఎస్సై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: కాంగ్రెస్, భాజపాకు ఓటు వేస్తే అంతే: హరీశ్​ రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.