ETV Bharat / jagte-raho

పోలీస్​ వాహనం ఢీకొని ఒకరు.. టిప్పర్​ చక్రాల కింద నలిగి ఇంకొకరు..

author img

By

Published : Sep 30, 2020, 8:31 PM IST

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందారు. మూడు సంవత్సరాల బాలికను టిప్పర్​ ఢీకొట్టగా.. ఏడేళ్ల బాలుడిని పోలీస్​ పెట్రోలింగ్​ వాహనం ఢీకొట్టింది. చిన్నారుల ఆకస్మిక మరణంతో వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.

two children died in hyderabad
పోలీస్​ వాహనం ఢీకొని ఒకరు.. టిప్పర్​ చక్రాల కింద నలిగి ఇంకొకరు..

ఇద్దరు డ్రైవర్ల నిర్లక్ష్యం అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారుల ప్రాణాలు బలికొన్నాయి. హైదరాబాద్​ పాతబస్తీలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. పోలీస్​ పెట్రోలింగ్​ వాహనం ఢీకొని ఒకరు.. టిప్పర్​ ఢీకొట్టి మరొకరు దుర్మరణం చెందారు.

పోలీస్​ వాహనం ఢీకొని..

మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సీతారాంబాగ్‌ కూడలి వద్ద ఏడేళ్ల బాలుడు హర్షవర్ధన్​ను పోలీస్​ పెట్రోలింగ్​ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడిని.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్​ ఘటనా స్థలాన్ని సందర్శించారు.

టిప్పర్​ చక్రాల కింద నలిగి..

చంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మూడేళ్ల బాలికను టిప్పర్​ ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనం చక్రాల కింద పడి బాలిక అక్కడికక్కడే దుర్మరణం చెందింది.

వాహన ఛోదకుల నిర్లక్ష్యమే ఇరు కుటుంబాల్లో విషాదానికి కారణమని స్థానికులు మండిపడుతున్నారు. డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

పోలీస్​ వాహనం ఢీకొని ఒకరు.. టిప్పర్​ చక్రాల కింద నలిగి ఇంకొకరు..

ఇవీచూడండి: చిన్నారిని ఢీ కొట్టిన టిప్పర్ లారీ.. చికిత్స పొందుతూ మృతి

ఇద్దరు డ్రైవర్ల నిర్లక్ష్యం అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారుల ప్రాణాలు బలికొన్నాయి. హైదరాబాద్​ పాతబస్తీలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. పోలీస్​ పెట్రోలింగ్​ వాహనం ఢీకొని ఒకరు.. టిప్పర్​ ఢీకొట్టి మరొకరు దుర్మరణం చెందారు.

పోలీస్​ వాహనం ఢీకొని..

మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సీతారాంబాగ్‌ కూడలి వద్ద ఏడేళ్ల బాలుడు హర్షవర్ధన్​ను పోలీస్​ పెట్రోలింగ్​ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడిని.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్​ ఘటనా స్థలాన్ని సందర్శించారు.

టిప్పర్​ చక్రాల కింద నలిగి..

చంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మూడేళ్ల బాలికను టిప్పర్​ ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనం చక్రాల కింద పడి బాలిక అక్కడికక్కడే దుర్మరణం చెందింది.

వాహన ఛోదకుల నిర్లక్ష్యమే ఇరు కుటుంబాల్లో విషాదానికి కారణమని స్థానికులు మండిపడుతున్నారు. డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

పోలీస్​ వాహనం ఢీకొని ఒకరు.. టిప్పర్​ చక్రాల కింద నలిగి ఇంకొకరు..

ఇవీచూడండి: చిన్నారిని ఢీ కొట్టిన టిప్పర్ లారీ.. చికిత్స పొందుతూ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.