ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్యకి పాల్పడ్డాడు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడనే మనస్తాపంతో వసతి గృహంలో ఫ్యానుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన సాయిమనోజ్గా గుర్తించారు.
శుక్రవారం పీ1 సెకెండ్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో వసతి గృహంలో ఫ్యాన్కు ఉరివేసుకుని సాయిమనోజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇడుపులపాయ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వేంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: బంగాల్ ఎన్నికలకు మజ్లిస్ వ్యూహాలు.. ప్రతినిధులతో చర్చలు