ఇటీవల పలువురు ప్రముఖులు ఫేస్బుక్ ఖాతాలు హ్యాక్కు గురవుతున్నాయి. తాజాగా ఎస్ఆర్నగర్ సీఐ సైదులు ఫేస్బుక్ ఖాతాను హ్యాక్ చేశారు దుండగులు. దీనిపై ఇప్పటికే దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారిని పట్టుకునేందురు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఫేస్బుక్లో ఉన్న సీఐ స్నేహితులను అర్జంటుగా డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని వెంటనే గమనించిన సీఐ సైదులు ఎవరు నమ్మి డబ్బులు వేయవద్దని స్నేహితులకు సందేశాలు పంపారు. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని తన మిత్రులను కోరారు.