ETV Bharat / jagte-raho

సుపారీ ఇచ్చి మరీ.. తండ్రిపైనే దాడి చేయించిన 'కన్నింగ్​' కొడుకు

author img

By

Published : Oct 9, 2020, 7:43 PM IST

వ్యాపారం, కుటుంబ తగాదాల కారణంగా తండ్రిపైనే దాడి చేయించాడు ఓ కన్నకొడుకు. ఇద్దరికి సుపారీ ఇచ్చి మరీ దాడి చేయించాడు. సీసీ కెమెరాల ద్వారా దుండగులు పోలీసుల చేతికి చిక్కగా... ఆ కొడుకు వేసిన కన్నింగ్​ పథకం మొత్తం బయటపడింది. చివరికి పోలీసులు ఆ కొడుకును కటాకటాల్లోకి నెట్టారు.

son planned to attack on his father in kharkhana
son planned to attack on his father in kharkhana

సికింద్రాబాద్​ కార్ఖానా పోలీస్​స్టేషన్​ పరిధిలోని వాల్మీకినగర్​కు చెందిన రాజు బోయిన్​పల్లి మార్కెట్లో కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. ఈనెల 4న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పికెట్​లోని వెల్లింగ్టన్ రోడ్డు మార్గంలో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. ఇద్దరు దుండగులు అడ్డగించారు.

రాజు వద్ద ఉన్న రూ.50 వేలతో పాటు వాహనాన్ని లాక్కొని దాడి చేయడానికి ప్రయత్నించగా... తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా దర్యాప్తు చేశారు. దాడి చేసిన వారు... మారేడ్ పల్లికి చెందిన ఆమన్ (25), పికెట్​కు చెందిన ఫాస్ట్​ఫుడ్ వ్యాపారి మ్యాథ్యూస్(40)గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

తమదైన శైలిలో విచారించగా... నిందితులు అసలు విషయం బయటపెట్టారు. వ్యాపారం, కుటుంబ తగాదాల కారణంగా తండ్రిపై దాడి చేయించింది అతని కన్న కొడుకేనని తెలిపారు. తన స్నేహితునితో కలిసి దాడి చేసి నగదు దొంగిలించి ఇవ్వాలని తమకు సుఫారీ ముట్టజెప్పాడని వెల్లడించారు. ఇంత పథకం పన్నిన ఆ కొడుకును సైతం పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ చూడండి: బంగారం, వెండి కాస్త ప్రియం- ప్రస్తుత ధరలు ఇవే..

సికింద్రాబాద్​ కార్ఖానా పోలీస్​స్టేషన్​ పరిధిలోని వాల్మీకినగర్​కు చెందిన రాజు బోయిన్​పల్లి మార్కెట్లో కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. ఈనెల 4న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పికెట్​లోని వెల్లింగ్టన్ రోడ్డు మార్గంలో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. ఇద్దరు దుండగులు అడ్డగించారు.

రాజు వద్ద ఉన్న రూ.50 వేలతో పాటు వాహనాన్ని లాక్కొని దాడి చేయడానికి ప్రయత్నించగా... తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా దర్యాప్తు చేశారు. దాడి చేసిన వారు... మారేడ్ పల్లికి చెందిన ఆమన్ (25), పికెట్​కు చెందిన ఫాస్ట్​ఫుడ్ వ్యాపారి మ్యాథ్యూస్(40)గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

తమదైన శైలిలో విచారించగా... నిందితులు అసలు విషయం బయటపెట్టారు. వ్యాపారం, కుటుంబ తగాదాల కారణంగా తండ్రిపై దాడి చేయించింది అతని కన్న కొడుకేనని తెలిపారు. తన స్నేహితునితో కలిసి దాడి చేసి నగదు దొంగిలించి ఇవ్వాలని తమకు సుఫారీ ముట్టజెప్పాడని వెల్లడించారు. ఇంత పథకం పన్నిన ఆ కొడుకును సైతం పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ చూడండి: బంగారం, వెండి కాస్త ప్రియం- ప్రస్తుత ధరలు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.