ETV Bharat / jagte-raho

వాహనాల్లో బ్యాటరీలు చోరీ చేస్తున్న నిందితుల అరెస్టు

author img

By

Published : Sep 25, 2020, 10:53 PM IST

జల్సాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను జడ్చర్ల పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఐదు లక్షల విలువైన వాహనాల బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు.

వాహనాల్లో బ్యాటరీలు చోరీ చేస్తున్న నిందితులు అరెస్టు
వాహనాల్లో బ్యాటరీలు చోరీ చేస్తున్న నిందితులు అరెస్టు

మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్లలో గత కొన్ని రోజులుగా వాహనాల్లో బ్యాటరీలను చోరీ చేస్తున్న ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం తెల్లవారుజాము సమయంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానమొచ్చి ముగ్గురిని విచారించగా అసలు విషయం బయటపడింది.

నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన విష్ణు, హన్వాడ మండలానికి చెందిన వాన రాశి సులేమాన్, మహబూబ్​నగర్​కు చెందిన వాన రాశి నవీన్ కుమార్ ముఠాగా ఏర్పడి వాహనాల్లో బ్యాటీరీలు ఎత్తుకెళ్తున్నారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ద్విచక్రవాహనం, ఆటోతో పాటు ఐదు లక్షల రూపాయల విలువైన బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. నిందితులను రిమాండ్​కు తరలించారు.

మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్లలో గత కొన్ని రోజులుగా వాహనాల్లో బ్యాటరీలను చోరీ చేస్తున్న ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం తెల్లవారుజాము సమయంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానమొచ్చి ముగ్గురిని విచారించగా అసలు విషయం బయటపడింది.

నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన విష్ణు, హన్వాడ మండలానికి చెందిన వాన రాశి సులేమాన్, మహబూబ్​నగర్​కు చెందిన వాన రాశి నవీన్ కుమార్ ముఠాగా ఏర్పడి వాహనాల్లో బ్యాటీరీలు ఎత్తుకెళ్తున్నారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ద్విచక్రవాహనం, ఆటోతో పాటు ఐదు లక్షల రూపాయల విలువైన బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. నిందితులను రిమాండ్​కు తరలించారు.

ఇదీ చూడండి: కీసర మాజీ తహసీల్దార్ నాగరాజుపై మరో కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.