సికింద్రాబాద్లో జీహెచ్ఎంసీ ఉద్యోగి అనుమానాస్పదంగా మృతి చెందారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న రంగారెడ్డి అనే వ్యక్తి జూబ్లిహిల్స్లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం నుంచి కనిపించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోమవారం తెల్లవారు జామున జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో రంగారెడ్డి మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో... పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లారు. మృతుని శరీరంపై కత్తితో పొడిచిన గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్కు సమాచారం అందించారు. ఇది ప్రమాదమా? హత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు జవహర్నగర్ పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: వరంగల్లో ఆటో డ్రైవర్ దారుణ హత్య...