ETV Bharat / jagte-raho

ఏపీలో పిడుగుపాటుకు ఐదుగురు మృతి - శ్రీకాకుళం జిల్లాలో పిడుగులు పడిన తాజా న్యూస్

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు ఐదుగురు మృతి చెందారు. వంగర మండలంలో ముగ్గురు మృతి చెందగా.. రాజాం, సీతంపేట మండలాల్లో ఒక్కొక్కరు మృత్యువాతపడ్డారు.

five-people-died-with-thunderbolt-in-srikakulam-district
పిడుగుపాటుకు ఐదుగురు మృతి
author img

By

Published : May 30, 2020, 10:09 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లా వంగర మండలం శ్రీహరిపురంలో వడ్డిపల్లి శంకరరావు అనే 43 సంవత్సరాల వ్యక్తి మృతి చెందారు. గీతనాపల్లిలో సాలాపు శ్రీరాములునాయుడు అనే 61 సంవత్సరాల వ్యక్తితో పాటు శనపతి అచ్చుతరావు అనే 16 సంవత్సరాల బాలుడు పిడుగుపడి మృతిచెందారు. రాజాం మండలం కొఠారిపురంలో కింతలి సింహాచలం అనే 38 ఏళ్ల రైతు పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. సీతంపేట మండలం తుంబకొండలో పిడుగుపాటుకు ఆరిక ఆనంద్‌ అనే 35 సంవత్సరాల వ్యక్తి మృతి చెందగా.. నిమ్మక గోపి అనే వ్యక్తి గాయాలపాలై అస్వస్థతకు గురయ్యారు. అతడు పాలకొండ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాలు బోరున విలపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లా వంగర మండలం శ్రీహరిపురంలో వడ్డిపల్లి శంకరరావు అనే 43 సంవత్సరాల వ్యక్తి మృతి చెందారు. గీతనాపల్లిలో సాలాపు శ్రీరాములునాయుడు అనే 61 సంవత్సరాల వ్యక్తితో పాటు శనపతి అచ్చుతరావు అనే 16 సంవత్సరాల బాలుడు పిడుగుపడి మృతిచెందారు. రాజాం మండలం కొఠారిపురంలో కింతలి సింహాచలం అనే 38 ఏళ్ల రైతు పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. సీతంపేట మండలం తుంబకొండలో పిడుగుపాటుకు ఆరిక ఆనంద్‌ అనే 35 సంవత్సరాల వ్యక్తి మృతి చెందగా.. నిమ్మక గోపి అనే వ్యక్తి గాయాలపాలై అస్వస్థతకు గురయ్యారు. అతడు పాలకొండ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాలు బోరున విలపిస్తున్నాయి.

ఇదీ చూడండి: శామీర్‌పేట్ ఓఆర్​ఆర్​ జంక్షన్ వద్ద ప్రమాదం.. ఒకరు మృతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.