ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా వంగర మండలం శ్రీహరిపురంలో వడ్డిపల్లి శంకరరావు అనే 43 సంవత్సరాల వ్యక్తి మృతి చెందారు. గీతనాపల్లిలో సాలాపు శ్రీరాములునాయుడు అనే 61 సంవత్సరాల వ్యక్తితో పాటు శనపతి అచ్చుతరావు అనే 16 సంవత్సరాల బాలుడు పిడుగుపడి మృతిచెందారు. రాజాం మండలం కొఠారిపురంలో కింతలి సింహాచలం అనే 38 ఏళ్ల రైతు పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. సీతంపేట మండలం తుంబకొండలో పిడుగుపాటుకు ఆరిక ఆనంద్ అనే 35 సంవత్సరాల వ్యక్తి మృతి చెందగా.. నిమ్మక గోపి అనే వ్యక్తి గాయాలపాలై అస్వస్థతకు గురయ్యారు. అతడు పాలకొండ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాలు బోరున విలపిస్తున్నాయి.
ఇదీ చూడండి: శామీర్పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ వద్ద ప్రమాదం.. ఒకరు మృతి