ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పోలీసులు నకిలీ మావోయిస్టుల ముఠా గుట్టురట్టు చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.3.20 లక్షల నగదు, రెండు టాయ్ పిస్తల్లు, నాలుగు కార్లు, ఐదు చరవాణీలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా కల్లూరు ఏసీపీ వెంకటేశ్ సత్తుపల్లి పోలీస్ బృందాన్ని అభినందించారు. వారికి రివార్డు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీచూడండి: తల్లీ, కూతురుకి మత్తుమందు ఇచ్చిన యజమాని.. ఆపై అత్యాచారం..!