ETV Bharat / jagte-raho

నకిలీ సర్టిఫికేట్ల ముఠా గుట్టు రట్టు... ఒక్కోటి రూ.2 లక్షలటా! - habsiguda news

హైదరాబాద్​ హబ్సీగూడలో నకిలీ ధ్రువపత్రాలు సృష్టిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 13 పదో తరగతి నకిలీ సర్టిఫికెట్లతో పాటు, లాప్​టాప్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

fake certificates gang arrested in hyderabad
fake certificates gang arrested in hyderabad
author img

By

Published : Aug 19, 2020, 6:53 PM IST

సులభంగా డబ్బు సంపాదించాలని దురుద్దేశంతో నకిలీ ధ్రువపత్రాలను సృష్టిస్తున్న ముఠాను హైదరాబాద్​ నార్త్​జోన్ టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 13 పదో తరగతి నకిలీ సర్టిఫికేట్లతో పాటు, లాప్​టాప్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మచ్చెందర్​ అనే వ్యక్తి రైల్వేలో ఎలక్ట్రీషన్​గా పనిచేస్తున్నాడు. పోస్టల్ డిపార్ట్మెంట్​లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి సంతోశ్​ అనే వ్యక్తితో కలిసి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ పేరుతో నకిలీ ఎస్ఎస్సీ ధ్రువపత్రాలను తయారు చేస్తున్నారు.

హబ్సిగూడ కేంద్రంగా సాగుతున్న ఈ దందాలో ఒక్కో సర్టిఫికెట్​ రూ.2 లక్షల వరకూ అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో మచ్చేందర్ వద్ద నకిలీ ధ్రువపత్రాలు తీసుకున్న సంతోశ్​, జయంత్, రాజేష్​కు పోస్టల్ శాఖలో ఉద్యోగాలు లభించాయి. వారి ధ్రువపత్రాలను పరిశీలించగా... అవి నకిలీవని తేలాయి. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. ముఠా గుట్టు రట్టయింది.

పోస్టల్ డిపార్ట్మెంట్​లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి చాలా మంది నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి : లంచం కేసులో అధికారుల కస్టడీకి అనిశా పిటిషన్

సులభంగా డబ్బు సంపాదించాలని దురుద్దేశంతో నకిలీ ధ్రువపత్రాలను సృష్టిస్తున్న ముఠాను హైదరాబాద్​ నార్త్​జోన్ టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 13 పదో తరగతి నకిలీ సర్టిఫికేట్లతో పాటు, లాప్​టాప్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మచ్చెందర్​ అనే వ్యక్తి రైల్వేలో ఎలక్ట్రీషన్​గా పనిచేస్తున్నాడు. పోస్టల్ డిపార్ట్మెంట్​లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి సంతోశ్​ అనే వ్యక్తితో కలిసి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ పేరుతో నకిలీ ఎస్ఎస్సీ ధ్రువపత్రాలను తయారు చేస్తున్నారు.

హబ్సిగూడ కేంద్రంగా సాగుతున్న ఈ దందాలో ఒక్కో సర్టిఫికెట్​ రూ.2 లక్షల వరకూ అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో మచ్చేందర్ వద్ద నకిలీ ధ్రువపత్రాలు తీసుకున్న సంతోశ్​, జయంత్, రాజేష్​కు పోస్టల్ శాఖలో ఉద్యోగాలు లభించాయి. వారి ధ్రువపత్రాలను పరిశీలించగా... అవి నకిలీవని తేలాయి. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. ముఠా గుట్టు రట్టయింది.

పోస్టల్ డిపార్ట్మెంట్​లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి చాలా మంది నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి : లంచం కేసులో అధికారుల కస్టడీకి అనిశా పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.