మాస్కుల పేరుతో సైబర్ నేరగాళ్లు వైద్యుడిని మోసం చేసిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. ఎక్స్పోర్టు ఇండియా అనే వెబ్సైట్లో ఎన్-95 మాస్కులు ఆర్డర్ చేశాడు. ఇది గమనించిన సైబర్ నేరగాళ్లు వైద్యుడికి ఫోన్ చేసి అనుకున్న ధరకే సరఫరా చేస్తామని నమ్మించి, ముందుగా సగం డబ్బులు పంపించాలని సూచించారు. ఒప్పదం ప్రకారం వైద్యుడు రూ.56 వేలు బదిలీ చేశాడు. నగదు ఖాతాలో జమ కాగానే నిందితులు ఫోన్ స్విచ్చాఫ్ చేశారు. మోసపోయానని గ్రహించిన బాదితుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించండి : మోదీ