ETV Bharat / jagte-raho

అన్నను కడతేర్చిన తమ్ముడు… మానసిక హింస భరించలేకే..

author img

By

Published : Sep 25, 2020, 11:42 AM IST

మద్యం తాగి వచ్చి తన భార్యతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ… తీవ్ర దుర్బాషలాడుతున్నాడని సొంత అన్నను కడతేర్చాడు ఓ వ్యక్తి. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో చోటు చేసుకుంది.

అన్నను కడతేర్చిన తమ్ముడు… మానసిక హింస భరించలేకే..
అన్నను కడతేర్చిన తమ్ముడు… మానసిక హింస భరించలేకే..

ఏపీలోని అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణం పాతపేటలో గురువారం సాయంత్రం జరిగిన అన్నదమ్ముల ఘర్షణలో రామాంజనేయులు(39) అనే వ్యక్తి మృతి చెందాడు. మద్యానికి బానిసైన రామాంజనేయులు తరచు తాగి వచ్చి తన భార్యతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ… తీవ్ర దుర్భషలాడాడని మల్లేశ్​ సహించలేకపోయాడు. ఆ మానసిక హింస భరించలేక ఇనుపరాడ్డుతో రామాంజనేయులు తల పగలకొట్టాడు. దీంతో రామాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి భార్య 14 ఏళ్ల క్రితమే అతన్ని వదిలేసి వెళ్లిందని బంధువులు తెలిపారు. హత్యకు పాల్పడిన మల్లేశ్​​… తన అన్న మృతదేహం పక్కనే కూర్చొన్నాడు.

అన్ననే కదా అని 14 సంవత్సరాలుగా ఆ బాధను భరిస్తూ ఉన్నానని... తన భార్యను వినకూడని భాషలో నిత్యం తిడుతూ ఉంటే భరించలేక ఈ పని చేసినట్లు తమ్ముడు మల్లేశ్​​ చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు. మల్లేశ్​​పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు ఉరవకొండ ఎస్సై ధరణిబాబు తెలిపారు. ఓ కుమారుడు జైలుకు వెళ్లి, మరొకరు మృతి చెందడం వల్ల రామాంజనేయులు తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది.

ఏపీలోని అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణం పాతపేటలో గురువారం సాయంత్రం జరిగిన అన్నదమ్ముల ఘర్షణలో రామాంజనేయులు(39) అనే వ్యక్తి మృతి చెందాడు. మద్యానికి బానిసైన రామాంజనేయులు తరచు తాగి వచ్చి తన భార్యతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ… తీవ్ర దుర్భషలాడాడని మల్లేశ్​ సహించలేకపోయాడు. ఆ మానసిక హింస భరించలేక ఇనుపరాడ్డుతో రామాంజనేయులు తల పగలకొట్టాడు. దీంతో రామాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి భార్య 14 ఏళ్ల క్రితమే అతన్ని వదిలేసి వెళ్లిందని బంధువులు తెలిపారు. హత్యకు పాల్పడిన మల్లేశ్​​… తన అన్న మృతదేహం పక్కనే కూర్చొన్నాడు.

అన్ననే కదా అని 14 సంవత్సరాలుగా ఆ బాధను భరిస్తూ ఉన్నానని... తన భార్యను వినకూడని భాషలో నిత్యం తిడుతూ ఉంటే భరించలేక ఈ పని చేసినట్లు తమ్ముడు మల్లేశ్​​ చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు. మల్లేశ్​​పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు ఉరవకొండ ఎస్సై ధరణిబాబు తెలిపారు. ఓ కుమారుడు జైలుకు వెళ్లి, మరొకరు మృతి చెందడం వల్ల రామాంజనేయులు తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది.

ఇదీ చదవండి: కుమార్తె ప్రేమ పెళ్లి.. పరువు కోసం అల్లుడి హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.