సిద్దిపేట జిల్లా చేర్యాల మార్కెట్ యార్డు వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కారు చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 8 మందికి గాయాలయ్యాయి.
రాజస్థాన్కు చెందిన 9 మంది ఇన్నోవా కారులో జనగామకు వస్తుండగా.. చేర్యాల మార్కెట్ యార్డు వద్ద డ్రైవర్ నిద్రమత్తులో చెట్టును ఢీకొట్టాడు. ఘటనలో డ్రైవర్ రహీమ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులోని మరో 8 మందికి గాయాలయ్యాయి.
గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను చేర్యాల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.