ETV Bharat / jagte-raho

అత్యచారం చేసి హత్య చేసిన వారిని శిక్షించాలి: లంబాడి ఐక్యవేదిక

author img

By

Published : Nov 5, 2020, 5:46 PM IST

రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఓ మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా కొల్లూరు తండాలో జరిగింది. ఈ ఘటనలో నిందితులను పట్టుకుని శిక్షించాలని లంబాడి ఐక్యవేదిక ఆందోళనకు దిగింది. మృతురాలిని అత్యాచారం చేసి హత్య చేశారని లంబాడి ఐక్యవేదిక అధ్యక్షుడు ఆరోపిస్తున్నారు.

a women suspected death in sangareddy district
అత్యచారం చేసి హత్య చేసిన వారిని శిక్షించాలి: లంబాడి ఐక్యవేదిక

సంగారెడ్డి జిల్లా కొల్లూరు జరిగిన ఘటనపై లంబాడి ఐక్యవేదిక ఆందోళనకు దిగింది. ప్రేమలతను హత్య చేసి అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని లంబాడి ఐక్యవేదిక అధ్యక్షుడు రాజు డిమాండ్​ చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్​ చేయాలని కోరారు.

రామచంద్రాపురం మండలం కొల్లూరు తండాలో ప్రేమలత అనే మహిళ అపహరణకు గురై అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. మియాపూర్‌కు చెందిన మృతురాలికి కొల్లూరు తండాకు చెందిన ఓ వ్యక్తితో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమె భర్త కొంతకాలం క్రితం చనిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మంగళవారం సాయంత్రం దుకాణానికి వెళ్తున్నాని చెప్పిన ప్రేమలత తిరిగి రాలేదని ఆమె సోదరి తెలిపారు. గురువారం మధ్యాహ్నం కొల్లూరు శివారులోని ఓ రేకుల షెడ్డులో ఆమె మృతదేహం లభ్యమైంది. మృతురాలి ఒంటిపై బట్టలు లేవని ప్రేమలత బంధువులు, స్థానికులు తెలిపారు.

రెండు రోజుల క్రితం అదృశ్యమైన మహిళ.. ఒంటిపై బట్టలు లేకుండా మృతదేహం లభ్యం..

ఇదీ చదవండి: వైద్యులు చికిత్స అందించట్లేదని రోగి ఆత్మహత్య..!

సంగారెడ్డి జిల్లా కొల్లూరు జరిగిన ఘటనపై లంబాడి ఐక్యవేదిక ఆందోళనకు దిగింది. ప్రేమలతను హత్య చేసి అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని లంబాడి ఐక్యవేదిక అధ్యక్షుడు రాజు డిమాండ్​ చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్​ చేయాలని కోరారు.

రామచంద్రాపురం మండలం కొల్లూరు తండాలో ప్రేమలత అనే మహిళ అపహరణకు గురై అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. మియాపూర్‌కు చెందిన మృతురాలికి కొల్లూరు తండాకు చెందిన ఓ వ్యక్తితో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమె భర్త కొంతకాలం క్రితం చనిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మంగళవారం సాయంత్రం దుకాణానికి వెళ్తున్నాని చెప్పిన ప్రేమలత తిరిగి రాలేదని ఆమె సోదరి తెలిపారు. గురువారం మధ్యాహ్నం కొల్లూరు శివారులోని ఓ రేకుల షెడ్డులో ఆమె మృతదేహం లభ్యమైంది. మృతురాలి ఒంటిపై బట్టలు లేవని ప్రేమలత బంధువులు, స్థానికులు తెలిపారు.

రెండు రోజుల క్రితం అదృశ్యమైన మహిళ.. ఒంటిపై బట్టలు లేకుండా మృతదేహం లభ్యం..

ఇదీ చదవండి: వైద్యులు చికిత్స అందించట్లేదని రోగి ఆత్మహత్య..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.