ETV Bharat / jagte-raho

వైద్యుల నిర్లక్ష్యం... బాలింతకు ప్రాణ సంకటం - తెలంగాణ తాజా వార్తలు

కాన్పు కోసం ఆస్పత్రికి వెళితే అన్నవాహిక పేగుకు కన్నం వేశారని ఆరోపిస్తున్న బాధితురాలి కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతో తమ బిడ్డ ప్రాణాపాయంలో ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో జరిగింది.

వైద్యుల నిర్లక్ష్యం... బాలింతకు ప్రాణ సంకటం
వైద్యుల నిర్లక్ష్యం... బాలింతకు ప్రాణ సంకటం
author img

By

Published : Sep 14, 2020, 3:25 PM IST

కాన్పుకోసం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన గర్భిణీ... వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉంది. వైద్యుల పొరపాటు తోనే తమ బిడ్డకు ఈ పరిస్థితి వచ్చిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణానికి చెందిన సారయ్య కుమార్తె ప్రసవం కోసం కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా... ఆపరేషన్​ చేసి బిడ్డను తీశారు. మూడు రోజులు ఆస్పత్రిలో ఉంచి ఇంటికి పంపేశారు. కానీ అప్పటి నుంచి ఆమెకు కడుపునొప్పి రావడం వల్ల మరోసారి ఆస్పత్రిలో చేర్పించగా... అక్కడి నుంచి ఖమ్మంలోని మరో ఆస్పత్రికి పంపించారు. అక్కడి వైద్యులు మళ్లీ ఆపరేషన్​ చేసి చూడగా మొదటిసారి ఆపరేషన్​ చేసిన సమయంలో పేగుకు రంద్రం ఏర్పడిందని... అక్కడి వైద్యులు ఆమెను హైదరాబాద్​కు పంపించారు.

పుట్టిన బిడ్డను 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న తల్లిదండ్రుల వద్ద ఉంచి... ఆ తల్లి హైదరాబాదులో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని బాధిత కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 15 లక్షల రూపాయలు ఖర్చయినా తమ బిడ్డకు ఈ పరిస్థితి వచ్చిందని రోధిస్తున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి: వేగంగా ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం.. వ్యక్తి మృతి

కాన్పుకోసం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన గర్భిణీ... వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉంది. వైద్యుల పొరపాటు తోనే తమ బిడ్డకు ఈ పరిస్థితి వచ్చిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణానికి చెందిన సారయ్య కుమార్తె ప్రసవం కోసం కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా... ఆపరేషన్​ చేసి బిడ్డను తీశారు. మూడు రోజులు ఆస్పత్రిలో ఉంచి ఇంటికి పంపేశారు. కానీ అప్పటి నుంచి ఆమెకు కడుపునొప్పి రావడం వల్ల మరోసారి ఆస్పత్రిలో చేర్పించగా... అక్కడి నుంచి ఖమ్మంలోని మరో ఆస్పత్రికి పంపించారు. అక్కడి వైద్యులు మళ్లీ ఆపరేషన్​ చేసి చూడగా మొదటిసారి ఆపరేషన్​ చేసిన సమయంలో పేగుకు రంద్రం ఏర్పడిందని... అక్కడి వైద్యులు ఆమెను హైదరాబాద్​కు పంపించారు.

పుట్టిన బిడ్డను 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న తల్లిదండ్రుల వద్ద ఉంచి... ఆ తల్లి హైదరాబాదులో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని బాధిత కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 15 లక్షల రూపాయలు ఖర్చయినా తమ బిడ్డకు ఈ పరిస్థితి వచ్చిందని రోధిస్తున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి: వేగంగా ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం.. వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.