ETV Bharat / international

సుప్రసిద్ధ ట్రెవీ ఫౌంటెయిన్​లో నాణెం విసిరిన మోదీ.. మళ్లీ వెళ్లాలని!

author img

By

Published : Oct 31, 2021, 4:09 PM IST

విదేశీ పర్యటనలో ఉన్న మోదీ (Modi visit to Italy).. ఇటలీలోని చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. పలు ప్రపంచ దేశాధినేతలతో కలిసి రోమ్​లోని ప్రసిద్ధ ట్రెవీ ఫౌంటెయిన్​కు (Trevi fountain) వెళ్లారు. అక్కడి నీటిలో ఓ నాణెం కూడా విసిరారు. ఎందుకో తెలుసా?

PM Modi, world leaders visit Trevi Fountain in Italy
సుప్రసిద్ధ ట్రెవీ ఫౌంటెయిన్​లో నాణెం విసిరిన మోదీ
ట్రెవీ ఫౌంటెయిన్​ను సందర్శనలో మోదీ

జీ-20 సదస్సు(Modi G20 summit) కోసం ఇటలీ(Modi visit to Italy) వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ.. అక్కడి పర్యటక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. ఆదివారం.. జీ-20 సదస్సు రెండో రోజులో భాగంగా రోమ్​లోని ప్రసిద్ధ ట్రెవీ ఫౌంటెయిన్​కు(Trevi fountain) వెళ్లారు.

PM Modi, world leaders visit Trevi Fountain in Italy
చక్కటి శిల్పకళానైపుణ్యం కూడిన ట్రెవీ ఫౌంటెయిన్​

ఇతర దేశాధినేతలు, అక్కడి అధికారులతో మోదీ కాసేపు కలియతిరిగారు. బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​, జర్మనీ ఛాన్స్​లర్​ ఏంజెలా మెర్కెల్​తో మోదీ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు.

PM Modi, world leaders visit Trevi Fountain in Italy
ఏంజెలా మెర్కెల్​తో మోదీ

నీటిలోకి నాణెం..

ఆ తర్వాత వెనుకకు తిరిగి నీటిలోకి నాణెం (Trevi fountain coins) విసిరారు మోదీ. అలా భుజం మీదుగా నీళ్లలో నాణెం విసిరితే మళ్లీ రోమ్​ వెళ్తారని ప్రజల నమ్మకం (Trevi fountain facts). భారత ప్రధాని కూడా ఇతర నేతలతో కలిసి ఇదే పని చేశారు.

PM Modi, world leaders visit Trevi Fountain in Italy
ఇతర దేశాధినేతలతో కలిసి నీటిలోకి నాణెం విసురుతున్న మోదీ

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫౌంటెయిన్లలో ట్రెవీ (Rome fountain famous) ముందు వరుసలో ఉంటుంది. చక్కటి శిల్పకళా నైపుణ్యం (Modi visit to Italy) దీని సొంతం.

జీ-20 సదస్సులో భాగంగా భారత ప్రధాని.. సింగపూర్​ ప్రధాని లీ సైన్​ లూంగ్​, ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్​ మేక్రాన్​లతో భేటీ అయ్యారు. అంతకుముందు.. వాటికన్​ సిటీలో పోప్​ ఫ్రాన్సిస్​ను కలిశారు. ఆయనను భారత్​కు రావాలని ఆహ్వానించారు మోదీ.

ఇవీ చూడండి: Cop26 Glasgow: వాతావరణ మార్పులపై 'కాప్'​ అస్త్రం ఫలిస్తుందా?

G20 Summit 2021: అగ్రదేశాధినేతలతో మోదీ మాటామంతీ.. బైడెన్​తో సరదాగా..

ట్రెవీ ఫౌంటెయిన్​ను సందర్శనలో మోదీ

జీ-20 సదస్సు(Modi G20 summit) కోసం ఇటలీ(Modi visit to Italy) వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ.. అక్కడి పర్యటక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. ఆదివారం.. జీ-20 సదస్సు రెండో రోజులో భాగంగా రోమ్​లోని ప్రసిద్ధ ట్రెవీ ఫౌంటెయిన్​కు(Trevi fountain) వెళ్లారు.

PM Modi, world leaders visit Trevi Fountain in Italy
చక్కటి శిల్పకళానైపుణ్యం కూడిన ట్రెవీ ఫౌంటెయిన్​

ఇతర దేశాధినేతలు, అక్కడి అధికారులతో మోదీ కాసేపు కలియతిరిగారు. బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​, జర్మనీ ఛాన్స్​లర్​ ఏంజెలా మెర్కెల్​తో మోదీ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు.

PM Modi, world leaders visit Trevi Fountain in Italy
ఏంజెలా మెర్కెల్​తో మోదీ

నీటిలోకి నాణెం..

ఆ తర్వాత వెనుకకు తిరిగి నీటిలోకి నాణెం (Trevi fountain coins) విసిరారు మోదీ. అలా భుజం మీదుగా నీళ్లలో నాణెం విసిరితే మళ్లీ రోమ్​ వెళ్తారని ప్రజల నమ్మకం (Trevi fountain facts). భారత ప్రధాని కూడా ఇతర నేతలతో కలిసి ఇదే పని చేశారు.

PM Modi, world leaders visit Trevi Fountain in Italy
ఇతర దేశాధినేతలతో కలిసి నీటిలోకి నాణెం విసురుతున్న మోదీ

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫౌంటెయిన్లలో ట్రెవీ (Rome fountain famous) ముందు వరుసలో ఉంటుంది. చక్కటి శిల్పకళా నైపుణ్యం (Modi visit to Italy) దీని సొంతం.

జీ-20 సదస్సులో భాగంగా భారత ప్రధాని.. సింగపూర్​ ప్రధాని లీ సైన్​ లూంగ్​, ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్​ మేక్రాన్​లతో భేటీ అయ్యారు. అంతకుముందు.. వాటికన్​ సిటీలో పోప్​ ఫ్రాన్సిస్​ను కలిశారు. ఆయనను భారత్​కు రావాలని ఆహ్వానించారు మోదీ.

ఇవీ చూడండి: Cop26 Glasgow: వాతావరణ మార్పులపై 'కాప్'​ అస్త్రం ఫలిస్తుందా?

G20 Summit 2021: అగ్రదేశాధినేతలతో మోదీ మాటామంతీ.. బైడెన్​తో సరదాగా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.