ETV Bharat / international

కొవిడ్ సోకినా.. ఆ దేశంలో ఐసోలేషన్​ అక్కర్లేదు!

author img

By

Published : Feb 20, 2022, 5:17 PM IST

Britain Covid Rules: కొవిడ్​ కేసులు తగ్గుతున్న నేపథ్యంలో బ్రిటన్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం నుంచి కొవిడ్​ సోకిన వ్యక్తులు సెల్ఫ్​ ఐసోలేషన్​లో ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించింది. 'కొవిడ్​తో సహజీవనం' ప్రణాళికలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

britain covid restrictions
britain covid restrictions

Britain Covid Rules: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో బ్రిటన్​ సర్కారు కరోనా నిబంధనలను సడలిస్తోంది. తాజాగా మరో కీలక కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చేవారం నుంచి కరోనా బాధితులు స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించింది. 'కొవిడ్​తో సహాజీవనం' ప్రణాళికలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్లాన్​కు సంబంధించిన వివరాలను ​పార్లమెంట్‌లో సోమవారం వెల్లడించనున్నారు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్​.

కరోనా వైరస్​ వ్యాప్తిని అరికట్టడానికి అమలు చేసిన అన్ని చట్టపరమైన ఆంక్షలు ముగింపు దశకు వచ్చినట్లు జాన్సన్​ పేర్కొన్నారు. తద్వారా బ్రిటన్​ ప్రజలు 'తమ స్వేచ్ఛకు భంగం కలకుండా తమను తాము రక్షించుకోగలుగుతారు' అని బోరిస్​ వ్యాఖ్యానించారు.

అయితే, ఇది ప్రమాదకరమైన చర్య అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొవిడ్ మరింత ప్రబలి.. కేసులు పెరగడానికి దారితీయవచ్చని భావిస్తున్నారు. భవిష్యత్​లో మరింత ప్రమాదకరమైన కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి దేశ రక్షణను బలహీనపరుస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు జాన్సన్​ నిర్ణయంపై ప్రతిపక్ష లేబర్​ పార్టీ విమర్శలు గుప్పించింది. యుద్ధం ముగియక ముందే విజయాన్ని ప్రకటించుకున్నారని ఎద్దేవా చేసింది.

బ్రిటన్​ ఇప్పటికే అర్హులై, 12 ఏళ్లు దాటినవారిలో.. 85 శాతం మందికి రెండు డోసుల టీకాలు​ పంపిణీ చేశారు. జనవరి నెలలోనే చాలా కొవిడ్​ ఆంక్షలను ఎత్తివేసింది అక్కడి ప్రభుత్వం.

ఇదీ చూడండి: Ukraine Crisis: మభ్యపెట్టి దెబ్బతీయడానికి రష్యా సిద్ధం?

Britain Covid Rules: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో బ్రిటన్​ సర్కారు కరోనా నిబంధనలను సడలిస్తోంది. తాజాగా మరో కీలక కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చేవారం నుంచి కరోనా బాధితులు స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించింది. 'కొవిడ్​తో సహాజీవనం' ప్రణాళికలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్లాన్​కు సంబంధించిన వివరాలను ​పార్లమెంట్‌లో సోమవారం వెల్లడించనున్నారు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్​.

కరోనా వైరస్​ వ్యాప్తిని అరికట్టడానికి అమలు చేసిన అన్ని చట్టపరమైన ఆంక్షలు ముగింపు దశకు వచ్చినట్లు జాన్సన్​ పేర్కొన్నారు. తద్వారా బ్రిటన్​ ప్రజలు 'తమ స్వేచ్ఛకు భంగం కలకుండా తమను తాము రక్షించుకోగలుగుతారు' అని బోరిస్​ వ్యాఖ్యానించారు.

అయితే, ఇది ప్రమాదకరమైన చర్య అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొవిడ్ మరింత ప్రబలి.. కేసులు పెరగడానికి దారితీయవచ్చని భావిస్తున్నారు. భవిష్యత్​లో మరింత ప్రమాదకరమైన కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి దేశ రక్షణను బలహీనపరుస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు జాన్సన్​ నిర్ణయంపై ప్రతిపక్ష లేబర్​ పార్టీ విమర్శలు గుప్పించింది. యుద్ధం ముగియక ముందే విజయాన్ని ప్రకటించుకున్నారని ఎద్దేవా చేసింది.

బ్రిటన్​ ఇప్పటికే అర్హులై, 12 ఏళ్లు దాటినవారిలో.. 85 శాతం మందికి రెండు డోసుల టీకాలు​ పంపిణీ చేశారు. జనవరి నెలలోనే చాలా కొవిడ్​ ఆంక్షలను ఎత్తివేసింది అక్కడి ప్రభుత్వం.

ఇదీ చూడండి: Ukraine Crisis: మభ్యపెట్టి దెబ్బతీయడానికి రష్యా సిద్ధం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.