ETV Bharat / international

వ్యాక్సిన్‌ వినియోగానికి చైనాకు అనుమతిచ్చిన డబ్ల్యూహెచ్​ఓ!

author img

By

Published : Sep 25, 2020, 7:05 PM IST

కరోనా కాలంలో వ్యాక్సిన్​ కోసం ప్రపంచదేశాలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే కరోనా పుట్టినిల్లు చైనాలో మాత్రం ప్రజలపై వ్యాక్సిన్​ను ప్రయోగిస్తున్నారు. ఇందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) అనుమతి ఇచ్చిందట. అంతేకాదు 2021 నాటికి 100 కోట్ల డోసులు తయారుచేయాలని చైనా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

china corona vaccine
వ్యాక్సిన్‌ వినియోగానికి చైనాకు అనుమతిచ్చిన డబ్ల్యూహెచ్​ఓ!

కరోనా వైరస్‌ వ్యాక్సిను వినియోగించుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తమకు అనుమతిచ్చినట్లు ఇవాళ ప్రకటించింది చైనా. ఇప్పటికే మూడో దశ ప్రయోగాలు కొనసాగుతోన్న వ్యాక్సిన్‌ను.. ప్రజలకు ఇచ్చేందుకు డబ్ల్యూహెచ్‌ఓ మద్దతు తెలిపినట్లు చైనా ఆరోగ్యశాఖ అధికారి వెల్లడించారు.

అత్యవసరంగా..

ప్రస్తుతం మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతోన్న వ్యాక్సిన్‌ను అత్యవసర కార్యక్రమం కింద వేల మంది ప్రజలకు ఇస్తున్నారు. ముఖ్యంగా వైరస్‌ ప్రమాదం పొంచివున్న ఆరోగ్యకార్యకర్తలకు, ప్రజలకు ఈ టీకాలను వేస్తున్నారు. ఇందుకోసం జూన్‌ చివరివారంలోనే చైనా స్టేట్‌ కౌన్సిల్‌ దీనికి ఆమోదం తెలిపిందని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ అధికారి వెల్లడించారు. అయితే, ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు జూన్‌లోనే తెలియజేసినట్లు ఆయన స్పష్టంచేశారు. జూన్‌ 29న డబ్ల్యూహెచ్‌ఓను సంప్రదించగా వారు ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. అయితే, దీనిపై చైనాలోని డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి మాత్రం స్పందించలేదు. అత్యవసర టీకా కార్యక్రమం గురించి ఇప్పటివరకు చైనా కూడా అధికారికంగా వెల్లడించలేదు.

ఇప్పటికే చైనాలో మూడు వ్యాక్సిన్‌లు తుది దశ ప్రయోగాల్లో ఉన్నాయి. చైనా జాతీయ బయోటెక్‌ గ్రూప్ ‌(సీఎన్‌బీజీ) తయారుచేసిన రెండు వ్యాక్సిన్‌లతో పాటు.. సినోవాక్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌లను అత్యవసర టీకా కార్యక్రమంలో వినియోగిస్తున్నారు. అయితే, ఈ మూడు వ్యాక్సిన్‌ల తుదిదశ ప్రయోగాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరో సంస్థ కాన్‌సినో బయోటాజిక్స్‌ తయారుచేసిన వ్యాక్సిన్‌ను చైనా మిలటరీలో ఉపయోగించేందుకు ఇప్పటికే ఆమోదం పొందింది.

లక్ష్యమిదే...

ఈ సంవత్సరం చివరినాటికి చైనాలో వ్యాక్సిన్‌ తయారీ సామర్థ్యం దాదాపు 60 కోట్ల డోసులకు చేరుకుంటుందని.. 2021 వరకు 100 కోట్ల డోసులు తయారవుతాయని చైనా జాతీయ కమిషన్ అంచనా వేస్తోంది. అయితే, తుది దశ ప్రయోగాలు పూర్తికాకముందే భారీ స్థాయిలో వ్యాక్సిన్‌ కార్యక్రమం చేపట్టడం చర్చనీయాంశమైంది.

ఇదీ చూడండి: 2021కల్లా చైనా నుంచి మరో 'వ్యాక్సిన్'​!

కరోనా వైరస్‌ వ్యాక్సిను వినియోగించుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తమకు అనుమతిచ్చినట్లు ఇవాళ ప్రకటించింది చైనా. ఇప్పటికే మూడో దశ ప్రయోగాలు కొనసాగుతోన్న వ్యాక్సిన్‌ను.. ప్రజలకు ఇచ్చేందుకు డబ్ల్యూహెచ్‌ఓ మద్దతు తెలిపినట్లు చైనా ఆరోగ్యశాఖ అధికారి వెల్లడించారు.

అత్యవసరంగా..

ప్రస్తుతం మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతోన్న వ్యాక్సిన్‌ను అత్యవసర కార్యక్రమం కింద వేల మంది ప్రజలకు ఇస్తున్నారు. ముఖ్యంగా వైరస్‌ ప్రమాదం పొంచివున్న ఆరోగ్యకార్యకర్తలకు, ప్రజలకు ఈ టీకాలను వేస్తున్నారు. ఇందుకోసం జూన్‌ చివరివారంలోనే చైనా స్టేట్‌ కౌన్సిల్‌ దీనికి ఆమోదం తెలిపిందని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ అధికారి వెల్లడించారు. అయితే, ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు జూన్‌లోనే తెలియజేసినట్లు ఆయన స్పష్టంచేశారు. జూన్‌ 29న డబ్ల్యూహెచ్‌ఓను సంప్రదించగా వారు ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. అయితే, దీనిపై చైనాలోని డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి మాత్రం స్పందించలేదు. అత్యవసర టీకా కార్యక్రమం గురించి ఇప్పటివరకు చైనా కూడా అధికారికంగా వెల్లడించలేదు.

ఇప్పటికే చైనాలో మూడు వ్యాక్సిన్‌లు తుది దశ ప్రయోగాల్లో ఉన్నాయి. చైనా జాతీయ బయోటెక్‌ గ్రూప్ ‌(సీఎన్‌బీజీ) తయారుచేసిన రెండు వ్యాక్సిన్‌లతో పాటు.. సినోవాక్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌లను అత్యవసర టీకా కార్యక్రమంలో వినియోగిస్తున్నారు. అయితే, ఈ మూడు వ్యాక్సిన్‌ల తుదిదశ ప్రయోగాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరో సంస్థ కాన్‌సినో బయోటాజిక్స్‌ తయారుచేసిన వ్యాక్సిన్‌ను చైనా మిలటరీలో ఉపయోగించేందుకు ఇప్పటికే ఆమోదం పొందింది.

లక్ష్యమిదే...

ఈ సంవత్సరం చివరినాటికి చైనాలో వ్యాక్సిన్‌ తయారీ సామర్థ్యం దాదాపు 60 కోట్ల డోసులకు చేరుకుంటుందని.. 2021 వరకు 100 కోట్ల డోసులు తయారవుతాయని చైనా జాతీయ కమిషన్ అంచనా వేస్తోంది. అయితే, తుది దశ ప్రయోగాలు పూర్తికాకముందే భారీ స్థాయిలో వ్యాక్సిన్‌ కార్యక్రమం చేపట్టడం చర్చనీయాంశమైంది.

ఇదీ చూడండి: 2021కల్లా చైనా నుంచి మరో 'వ్యాక్సిన్'​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.