ETV Bharat / international

తాలిబన్లపై అమెరికా వైమానిక దాడులు

author img

By

Published : Jun 5, 2020, 11:14 PM IST

Updated : Jun 5, 2020, 11:31 PM IST

అఫ్గానిస్థాన్​లో అమెరికా బలగాలు తాలిబన్లపై వైమానిక దాడులు జరిపాయి. ఈ ఘటనలో ముగ్గురు సీనియర్​ తాలిబన్​ కమాండర్లు, 13 మంది తాలిబన్​ సభ్యులను మట్టుపెట్టినట్లు అఫ్గాన్​ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

US airstrikes hit Taliban; 10 Afghan police killed in ambush
తాలిబన్లపై అమెరికా వైమానిక దాడులు!

అఫ్గానిస్థాన్​లో తాలిబన్లపై అమెరికా బలగాలు రెండు సార్లు వైమానిక దాడులు జరిపాయి. పశ్చిమ ఫరా రాష్ట్రంలో అఫ్గాన్​ దళాలపై దాడి చేస్తున్న 25 మంది ముష్కరులను లక్ష్యంగా చేసుకొని శుక్రవారం మధ్యాహ్నం వైమానిక దాడులు జరిపినట్లు అమెరికా సైనిక అధికార ప్రతినిధి కల్నల్​ సోని లెగెట్​ తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు సీనియర్​ తాలిబన్​ కమాండర్లు, 13 మంది సభ్యులను మట్టుపెట్టినట్లు అఫ్గాన్​ ప్రభుత్వాధికారి ఒకరు స్పష్టం చేశారు.

గత నెలలో ముస్లింల పర్వదినం సందర్భంగా తిరుగుబాటుదారులు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన అనంతరం.. తాలిబన్లకు వ్యతిరేకంగా అమెరికా దాడులు చేయడం ఇదే మొదటిసారి.

పోలీసులపై కాల్పులు...

మరోవైపు దక్షిణ జాబుల్​ రాష్ట్రంలో ముష్కరులు రోడ్డు పక్కన బాంబు పేల్చి.. అఫ్గాన్​ పోలీసు కాన్వాయ్​పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది పోలీసులు చనిపోయారు. జరిగిన కాల్పుల్లో నలుగురు తాలిబన్​ సభ్యులు కూడా మరణించినట్లు అప్గాన్​ అంతర్గత వ్యవహారాలశాఖ ప్రతినిధి తారిక్​ అరియన్​ తెలిపారు. అయితే ఈ దాడికి తాలిబన్లు ఇప్పటికీ ఎటువంటి బాధ్యత వహించలేదు.

అఫ్గానిస్థాన్​లో తాలిబన్లపై అమెరికా బలగాలు రెండు సార్లు వైమానిక దాడులు జరిపాయి. పశ్చిమ ఫరా రాష్ట్రంలో అఫ్గాన్​ దళాలపై దాడి చేస్తున్న 25 మంది ముష్కరులను లక్ష్యంగా చేసుకొని శుక్రవారం మధ్యాహ్నం వైమానిక దాడులు జరిపినట్లు అమెరికా సైనిక అధికార ప్రతినిధి కల్నల్​ సోని లెగెట్​ తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు సీనియర్​ తాలిబన్​ కమాండర్లు, 13 మంది సభ్యులను మట్టుపెట్టినట్లు అఫ్గాన్​ ప్రభుత్వాధికారి ఒకరు స్పష్టం చేశారు.

గత నెలలో ముస్లింల పర్వదినం సందర్భంగా తిరుగుబాటుదారులు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన అనంతరం.. తాలిబన్లకు వ్యతిరేకంగా అమెరికా దాడులు చేయడం ఇదే మొదటిసారి.

పోలీసులపై కాల్పులు...

మరోవైపు దక్షిణ జాబుల్​ రాష్ట్రంలో ముష్కరులు రోడ్డు పక్కన బాంబు పేల్చి.. అఫ్గాన్​ పోలీసు కాన్వాయ్​పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది పోలీసులు చనిపోయారు. జరిగిన కాల్పుల్లో నలుగురు తాలిబన్​ సభ్యులు కూడా మరణించినట్లు అప్గాన్​ అంతర్గత వ్యవహారాలశాఖ ప్రతినిధి తారిక్​ అరియన్​ తెలిపారు. అయితే ఈ దాడికి తాలిబన్లు ఇప్పటికీ ఎటువంటి బాధ్యత వహించలేదు.

Last Updated : Jun 5, 2020, 11:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.