ETV Bharat / international

మరిన్ని నగరాలు తాలిబన్ల వశం- తూటా పేలకుండానే...

author img

By

Published : Aug 15, 2021, 12:31 PM IST

Updated : Aug 15, 2021, 1:28 PM IST

తాలిబన్ల అధీనంలోకి అఫ్గానిస్థాన్​ వెళ్లిపోయిందా? ఆ దేశ ప్రభుత్వం, సైన్యం చేతులెత్తేశాయా? తాజా పరిణామాలు చూస్తే అవుననక తప్పదు. ఆ దేశ ప్రజలు శరణు కోరుతూ ఇతర దేశాలకు పారిపోతున్నారు. బలగాల ఉపసంహరణకు బదులుగా అమెరికా అదనపు బలగాలను పంపించటం గమనార్హం.

Taliban
అఫ్గాన్​లో తాలిబన్ల ఆక్రమణ

అంతకంతకూ విజృంభిస్తున్న తాలిబన్లు... కనీసం ప్రతిఘటించని సైన్యం... తూటా పేలకుండానే తాలిబన్ల చేతుల్లోకి కీలక నగరాలు... భయంతో ఇతర దేశాలకు పారిపోతున్న వేలాది మంది ప్రజలు... 'ఆపరేషన్​ అఫ్గానిస్థాన్'​లో అమెరికా దిద్దుబాటు చర్యలు... హడావుడిగా కాబుల్​కు అదనపు బలగాలు... అఫ్గానిస్థాన్​లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఇవి.

అఫ్గాన్​లోని తాజా పరిణామాలు ఇలా..

  • అఫ్గాన్​లోని కీలక నగరం జలాలాబాద్​ను ఆదివారం తెల్లవారు జామున ఆక్రమించారు తాలిబన్లు. దీంతో తూర్పు ప్రాంతానికి, దేశ రాజధాని కాబుల్​కు మధ్య సంబంధాలు తెగిపోయాయి. జలాలాబాద్​ నగరంలోని గవర్నర్​ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్న వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు తాలిబన్లు. వారితో ఎలాంటి ఘర్షణకు దిగకుండానే.. భద్రతా దళాలు లొంగిపోయినట్లు ఓ అధికారి తెలిపారు.
    Taliban
    హెరత్​ నగరంలో వాహనంలో తరలుతున్న తాలిబన్లు
    Taliban
    హెరత్​ నగరంలోకి వస్తున్న తాలిబన్​ సంస్థ సభ్యులు
  • ఖోస్ట్ ప్రావిన్స్​​ రాజధానిని స్వాధీనం చేసుకున్నట్లు ఆదివారం మధ్యాహ్నం ప్రకటించారు. ఈ విషయాన్ని అఫ్గాన్​ అధికారులు ధ్రువీకరించారు. అలాగే.. మెయిడన్​ వార్డక్​ రాష్ట్ర రాజధాని మెయిడన్​ వార్డక్​ను తమ అధీనంలోకి తీసుకున్నట్లు తాలిబన్లు తెలిపారు. ఇది కాబుల్​కు కేవలం 90 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. మరోవైపు.. అంతర్జాతీయ సరిహద్దు పోస్టులు అన్నింటిని తమ అధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించారు. తొర్ఖమ్​ సరిహద్దు ప్రాంతాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారని పాకిస్థాన్​ అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్​ రషీద్​ అహ్మద్​ తెలిపారు. దీంతో సరిహద్దులను మూసివేసినట్లు చెప్పారు.
  • ఉత్తర అఫ్గాన్​లోని నాలుగో అతిపెద్ద, భద్రతా వలయంలోని నగరం, బల్ఖ్​ రాష్ట్రం, మెజర్​-ఏ- షరీఫ్​ను శనివారం ఆక్రమించారు తాలిబన్లు. అది ప్రభుత్వానికి అతిపెద్ద ఎదురుదెబ్బ. దీంతో ఉత్తర అఫ్గాన్​ పూర్తిగా వారి చేతుల్లోకి వెళ్లినట్లయింది. ముందుగా సైన్యం వారికి లొంగిపోయిందని, ఆ తర్వాత ప్రభుత్వ అనుకూల సంస్థలు, ఇతర దళాల్లో నైతిక దెబ్బతిని వారూ లొంగిపోయినట్లు రాష్ట్ర చట్టసభ్యుడు అబ్బాస్​ ఎబ్రహిమ్జాదా తెలిపారు.
    Taliban
    హెరత్​ నగరంలో తాలిబన్​ జెండాలు విక్రయిస్తున్న వ్యక్తి
  • కొద్ది రోజుల క్రితం దేశంలోని రెండు, మూడో అతిపెద్ద నగరాలైన హెరత్​, కాందహార్​ నగరాలను తమ వశం చేసుకున్నారు తాలిబన్లు. అఫ్గాన్​లోని మొత్తం 34 రాష్ట్రాల్లోని 24 రాష్ట్రాలు వారి అధీనంలోకి వెళ్లాయి.
    Taliban
    హెరత్​ అధికార భవనం ముందరి క్లాక్​ టవర్​పై ఎగురుతున్న తాలిబన్​ జెండా
    Taliban
    ఘాజీ నగరంలోని ఓ కూడలిలో ఏర్పాటు చేసిన తాలిబన్​ జెండాలు
  • అఫ్గాన్​ నుంచి బలగాల ఉపసంహరణ నేపథ్యంలో బైడెన్​ ప్రభుత్వంపై అంతర్జాతీయంగా విమర్శలు ఎదురవుతున్నాయి. తాజాగా అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. బైడెన్​ తీరును తప్పుబట్టారు. అధ్యక్షుడి వైఫల్యం వల్లే తాలిబన్లు రెచ్చిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
  • అఫ్గాన్​లో తాలిబన్లు దురాక్రమణలకు పాల్పడుతున్న క్రమంలో తమ దేశ పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు బైడెన్​ సర్కార్​ చర్యలు చేపట్టింది. అదనంగా మరో 1000 మంది సైన్యాన్ని పంపాలని ఆదేశించారు. దీంతో మొత్తం 5000 మంది బలగాలను అఫ్గాన్​కు తరలిస్తోంది అమెరికా.
    Taliban
    అఫ్గానిస్థాన్​ రాజధాని కాబుల్​లోని అమెరికా ఎంబసీ భవనం
  • కాబుల్​కు దక్షిణాన ఉన్న లోగర్​ రాష్ట్రాన్ని శనివారం ఆక్రమించారు తాలిబన్లు. స్థానిక అధికారులను నిర్బంధించారు. కాబుల్​కు 11 కిలోమీటర్ల దూరంలోని చార్​ అస్యాద్​ జిల్లాకు చేరుకున్నట్లు ఓ చట్టసభ్యురాలు తెలిపారు. ఆ తర్వాత లాఘ్​మ్యాన్​ రాష్ట్రాన్ని ఎలాంటి ఘర్షణ లేకుండానే స్వాధీనం చేసుకున్నారు.
    Taliban
    ఉత్తర అఫ్గాన్​లోని కుందుజ్​ నగరంలో మోహరించిన తాలిబన్​ ఫైటర్స్​
  • తాలిబన్ల అరాచకాలు మొదలైన తర్వాత శనివారం తొలిసారి ప్రజల ముందుకు వచ్చి మాట్లాడారు అఫ్గాన్​ అధ్యక్షుడు అష్రాఫ్​ ఘనీ. గత 20 ఏళ్లలో సాధించిన విజయాలను వదులుకోవద్దని సూచించారు.
  • దేశంలో తాలిబన్ల ఆగడాలు తట్టుకోలేని ప్రజలు ఇతర దేశాలకు పారిపోతున్నారు. అమెరికా, యూకే, భారత్​ సహా శరణార్థ వీసా సౌకర్యం కల్పిస్తోన్న దేశాలకు వలస వెళ్తున్నారు.
    Taliban
    కాబుల్​ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలివస్తున్న ప్రజలు
    Taliban
    హమీద్​ ఖర్జాయ్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో అఫ్గాన్​వాసులు
  • అఫ్గాన్​ ప్రజలు ఇతర దేశాలకు పారిపోతున్న క్రమంలో కాబుల్​లోని భారత ఎంబసీకి ఒక్కసారిగా వీసాల దరఖాస్తులు పెరిగిపోయాయి. వీసాల జారీ కోసం ఎక్కువ సమయం పనిచేస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. వీసాలో కోటాను సైతం పెంచినట్లు చెప్పారు. ఆ దేశంలోని కాన్సులేట్లను మూసివేసిన భారత్​.. కాబుల్​లోని ఎంబసీ నుంచే వీసాలు జారీ చేస్తోంది.
    Taliban
    హమీద్​ ఖర్జాయ్​ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి వెళ్తున్న ప్రజలు

అంతకంతకూ విజృంభిస్తున్న తాలిబన్లు... కనీసం ప్రతిఘటించని సైన్యం... తూటా పేలకుండానే తాలిబన్ల చేతుల్లోకి కీలక నగరాలు... భయంతో ఇతర దేశాలకు పారిపోతున్న వేలాది మంది ప్రజలు... 'ఆపరేషన్​ అఫ్గానిస్థాన్'​లో అమెరికా దిద్దుబాటు చర్యలు... హడావుడిగా కాబుల్​కు అదనపు బలగాలు... అఫ్గానిస్థాన్​లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఇవి.

అఫ్గాన్​లోని తాజా పరిణామాలు ఇలా..

  • అఫ్గాన్​లోని కీలక నగరం జలాలాబాద్​ను ఆదివారం తెల్లవారు జామున ఆక్రమించారు తాలిబన్లు. దీంతో తూర్పు ప్రాంతానికి, దేశ రాజధాని కాబుల్​కు మధ్య సంబంధాలు తెగిపోయాయి. జలాలాబాద్​ నగరంలోని గవర్నర్​ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్న వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు తాలిబన్లు. వారితో ఎలాంటి ఘర్షణకు దిగకుండానే.. భద్రతా దళాలు లొంగిపోయినట్లు ఓ అధికారి తెలిపారు.
    Taliban
    హెరత్​ నగరంలో వాహనంలో తరలుతున్న తాలిబన్లు
    Taliban
    హెరత్​ నగరంలోకి వస్తున్న తాలిబన్​ సంస్థ సభ్యులు
  • ఖోస్ట్ ప్రావిన్స్​​ రాజధానిని స్వాధీనం చేసుకున్నట్లు ఆదివారం మధ్యాహ్నం ప్రకటించారు. ఈ విషయాన్ని అఫ్గాన్​ అధికారులు ధ్రువీకరించారు. అలాగే.. మెయిడన్​ వార్డక్​ రాష్ట్ర రాజధాని మెయిడన్​ వార్డక్​ను తమ అధీనంలోకి తీసుకున్నట్లు తాలిబన్లు తెలిపారు. ఇది కాబుల్​కు కేవలం 90 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. మరోవైపు.. అంతర్జాతీయ సరిహద్దు పోస్టులు అన్నింటిని తమ అధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించారు. తొర్ఖమ్​ సరిహద్దు ప్రాంతాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారని పాకిస్థాన్​ అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్​ రషీద్​ అహ్మద్​ తెలిపారు. దీంతో సరిహద్దులను మూసివేసినట్లు చెప్పారు.
  • ఉత్తర అఫ్గాన్​లోని నాలుగో అతిపెద్ద, భద్రతా వలయంలోని నగరం, బల్ఖ్​ రాష్ట్రం, మెజర్​-ఏ- షరీఫ్​ను శనివారం ఆక్రమించారు తాలిబన్లు. అది ప్రభుత్వానికి అతిపెద్ద ఎదురుదెబ్బ. దీంతో ఉత్తర అఫ్గాన్​ పూర్తిగా వారి చేతుల్లోకి వెళ్లినట్లయింది. ముందుగా సైన్యం వారికి లొంగిపోయిందని, ఆ తర్వాత ప్రభుత్వ అనుకూల సంస్థలు, ఇతర దళాల్లో నైతిక దెబ్బతిని వారూ లొంగిపోయినట్లు రాష్ట్ర చట్టసభ్యుడు అబ్బాస్​ ఎబ్రహిమ్జాదా తెలిపారు.
    Taliban
    హెరత్​ నగరంలో తాలిబన్​ జెండాలు విక్రయిస్తున్న వ్యక్తి
  • కొద్ది రోజుల క్రితం దేశంలోని రెండు, మూడో అతిపెద్ద నగరాలైన హెరత్​, కాందహార్​ నగరాలను తమ వశం చేసుకున్నారు తాలిబన్లు. అఫ్గాన్​లోని మొత్తం 34 రాష్ట్రాల్లోని 24 రాష్ట్రాలు వారి అధీనంలోకి వెళ్లాయి.
    Taliban
    హెరత్​ అధికార భవనం ముందరి క్లాక్​ టవర్​పై ఎగురుతున్న తాలిబన్​ జెండా
    Taliban
    ఘాజీ నగరంలోని ఓ కూడలిలో ఏర్పాటు చేసిన తాలిబన్​ జెండాలు
  • అఫ్గాన్​ నుంచి బలగాల ఉపసంహరణ నేపథ్యంలో బైడెన్​ ప్రభుత్వంపై అంతర్జాతీయంగా విమర్శలు ఎదురవుతున్నాయి. తాజాగా అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. బైడెన్​ తీరును తప్పుబట్టారు. అధ్యక్షుడి వైఫల్యం వల్లే తాలిబన్లు రెచ్చిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
  • అఫ్గాన్​లో తాలిబన్లు దురాక్రమణలకు పాల్పడుతున్న క్రమంలో తమ దేశ పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు బైడెన్​ సర్కార్​ చర్యలు చేపట్టింది. అదనంగా మరో 1000 మంది సైన్యాన్ని పంపాలని ఆదేశించారు. దీంతో మొత్తం 5000 మంది బలగాలను అఫ్గాన్​కు తరలిస్తోంది అమెరికా.
    Taliban
    అఫ్గానిస్థాన్​ రాజధాని కాబుల్​లోని అమెరికా ఎంబసీ భవనం
  • కాబుల్​కు దక్షిణాన ఉన్న లోగర్​ రాష్ట్రాన్ని శనివారం ఆక్రమించారు తాలిబన్లు. స్థానిక అధికారులను నిర్బంధించారు. కాబుల్​కు 11 కిలోమీటర్ల దూరంలోని చార్​ అస్యాద్​ జిల్లాకు చేరుకున్నట్లు ఓ చట్టసభ్యురాలు తెలిపారు. ఆ తర్వాత లాఘ్​మ్యాన్​ రాష్ట్రాన్ని ఎలాంటి ఘర్షణ లేకుండానే స్వాధీనం చేసుకున్నారు.
    Taliban
    ఉత్తర అఫ్గాన్​లోని కుందుజ్​ నగరంలో మోహరించిన తాలిబన్​ ఫైటర్స్​
  • తాలిబన్ల అరాచకాలు మొదలైన తర్వాత శనివారం తొలిసారి ప్రజల ముందుకు వచ్చి మాట్లాడారు అఫ్గాన్​ అధ్యక్షుడు అష్రాఫ్​ ఘనీ. గత 20 ఏళ్లలో సాధించిన విజయాలను వదులుకోవద్దని సూచించారు.
  • దేశంలో తాలిబన్ల ఆగడాలు తట్టుకోలేని ప్రజలు ఇతర దేశాలకు పారిపోతున్నారు. అమెరికా, యూకే, భారత్​ సహా శరణార్థ వీసా సౌకర్యం కల్పిస్తోన్న దేశాలకు వలస వెళ్తున్నారు.
    Taliban
    కాబుల్​ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలివస్తున్న ప్రజలు
    Taliban
    హమీద్​ ఖర్జాయ్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో అఫ్గాన్​వాసులు
  • అఫ్గాన్​ ప్రజలు ఇతర దేశాలకు పారిపోతున్న క్రమంలో కాబుల్​లోని భారత ఎంబసీకి ఒక్కసారిగా వీసాల దరఖాస్తులు పెరిగిపోయాయి. వీసాల జారీ కోసం ఎక్కువ సమయం పనిచేస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. వీసాలో కోటాను సైతం పెంచినట్లు చెప్పారు. ఆ దేశంలోని కాన్సులేట్లను మూసివేసిన భారత్​.. కాబుల్​లోని ఎంబసీ నుంచే వీసాలు జారీ చేస్తోంది.
    Taliban
    హమీద్​ ఖర్జాయ్​ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి వెళ్తున్న ప్రజలు

ఇవీ చూడండి: తాలిబన్ల అధీనంలోకి మూడు రాష్ట్రాలు, ఆర్మీ స్థావరం

టీవీ, సినిమా, స్కూల్ బంద్- మహిళలకు మళ్లీ ఆ రూల్స్ తప్పవా?

తాలిబన్ల ఉక్కుపిడికిట్లో అఫ్గాన్‌- రష్యా, చైనా మద్దతు!

Last Updated : Aug 15, 2021, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.